TG: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము HYD వచ్చారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్లో రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవ్- 2025ను ఆమె ప్రారంభించనున్నారు.