VKB: బొంరాస్పేట మండలం రేగడిమైలారం కార్యదర్శి నాగరాజు, తుంకిమెట్ల కార్యదర్శి రాజేష్ బదిలీపై వెళ్లారు. గత నాలుగు సంవత్సరాలుగా గ్రామాలల్లో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. కార్యదర్శి నాగరాజు సూర్యాపేట జిల్లాకు, కార్యదర్శి రాజేష్ నల్లగొండ జిల్లాకు బదిలీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఆయా గ్రామాల ప్రజలు వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.