TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వృద్ధి 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలపై చర్చిస్తారు.