AP: దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. సీఎంతో పాటు మంత్రులు లోకేష్, టీజీ భరత్, ఉన్నతాధికారులు దావోస్కు వెళ్లనున్నారు. జనవరి 19 నుంచి 23 వరకు దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనుంది. ఈ పర్యటనలో సీఎం పలువురు పారిశ్రామికవేత్తలను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి.