AP: ప్రభుత్వంపై ప్రతిపక్షం బురదజల్లుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని, నదీజలాల్లో రాష్ట్రానికి 70 శాతం వాటాపై వాదనలు వినిపించామన్నారు. రాష్ట్ర జల హక్కుల విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పారు. గత KCR ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్షల కోట్లు బూడిద పాలు చేసిందని ధ్వజమెత్తారు.