నూతన విద్యా విధానాన్ని (National Education Policy) అనుసరించి ఇక నుండి ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యా శాఖ (Ministry of Education)... రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు లేఖ రాసింది.
కర్నాటకలో (Karnataka) ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారుణుల (Civil Servants) మధ్య వివాదం రాజుకుంది. ఇద్దరు మహిళా అధికారుల మధ్య సోషల్ మీడియా (Social Media) వేదికగా వాగ్యుద్ధం నడుస్తుండటంపై ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించింది. దీంతో ఇద్దరినీ బదలీ చేసి, పోస్ట్ ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచింది బసవరాజ్ బొమ్మై (basavaraj bommai) ప్రభుత్వం (Government).
మద్యంమత్తులో ఉన్నవారు నానా రచ్చ చేస్తున్నారు. ఇన్నాళ్లు నాలుగు గోడల మధ్యన వీరి ఆగడాలు ఉండేవి. ఇప్పుడు తప్ప తాగి బయటకు వచ్చి బీభత్సం చేస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం లభిస్తుండడంతో మద్యం సేవించి దాడులకు తెగబడుతున్నారు. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు, విమానాల్లో మద్యం సేవించి ప్రయాణం చేయవద్దనే నిబంధనలు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేక గాలులు వస్తున్నాయి. ఆ పార్టీ గట్టెక్కడం కష్టంగా ఉందని సమాచారం. ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న యడియూరప్పకు మళ్లీ అవకాశం దక్కడం అసాధ్యమే. ఆ పదవి ఇవ్వకుంటే ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే తనకు గౌరవం ఉండదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యాడు.
తమకు అన్నీ తెలుసునని భావించే బీజేపీ ఎవరినీ గౌరవించని ‘క్లాస్ రౌడీ’ లాంటిదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. మరోవైపు మేఘాలయ షిల్లాంగ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న క్రమంలో రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే బీజేపీని గెలిపించేందుకే టీఎంసీ పోటీ చేస్తుందని ఎద్దేవా చేశారు.
సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం రణ్బీర్ కపూర్ ఒప్పకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో కోల్కతాలో ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని నెట్టింట ఈ వార్త హల్ చల్ చేస్తుంది.
KL రాహుల్ ఫామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో భారత జట్టు నుంచి ఓపెనర్ రాహుల్ ను తప్పించాలా అనే ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్ జీపీటీ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది. అదేంటో ఇక్కడ చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం పెద్ద ఎత్తున నష్టాలతో చవిచూశాయి. BSE సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లకుపైగా నష్టపోగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 273, బ్యాంక్ నిఫ్టీ 700 పాయింట్లకుపైగా దిగువకు పయనించాయి. దీంతో ఒక్కరోజే సమారు 3.5 లక్షల కోట్ల సంపదను మదుపర్లు కోల్పోయారు.
గత ఏడాది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధికంగా విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ మూడు విఫల ప్రయత్నాల తర్వాత ఈరోజు తన మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్ 34 ఓట్ల తేడాతో గెలుపొందారు. మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులకు ఓటు వేయాలనే నిర్ణయంపై ఆప్, బీజేపీ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో గతంలో మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశాలు వాయిదా పడ్డాయి.
దేశ రాజధాని ఢిల్లీ ఈ రోజు మధ్యాహ్నం భూ ప్రకంపనాలతో వణికింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. నేపాల్లో గల జుమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1.30 గంటలకు భూమి కంపించగా.. దాని తీవ్రత 10 కిలోమీటర్ల లోతు వరకు ఉందని సిస్మలాజిస్టులు తెలిపారు.
తమిళ నటుడు ప్రభు అనారోగ్యానికి గురయ్యారు. ఆకస్మాత్తుగా తనకు కిడ్నీలో రాళ్ల నొప్పి రావడంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ప్రభు బాగానే ఉన్నాడని.. త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని వైద్యులు ప్రకటించారు.
straydogs bite:వీధి కుక్కలు (straydogs) స్వైరవిహరం చేస్తున్నాయి. అంబర్ పేట (amberpet) ఘటనతో తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అంబర్ పేట తర్వాత చైత్యనపురి.. అటు నుంచి కరీంనగర్లో (karimnagar) కూడా స్ట్రీట్ డాగ్స్ రెచ్చిపోయాయి. వరస ఘటనలతో కుక్కల బెడదపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వీధి కుక్కల నియంత్రణపై చర్యలేవి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
భోజ్పురి (Bhojpuri) జానపద గాయని నేహా సింగ్ (Neha Singh) రాథోడ్కు ఉత్తర ప్రదేశ్ పోలీసులు (UP Police) షాకిచ్చారు. ఆమె ఇటీవల విడుదల చేసిన ఒక పాటలో ఉత్తర ప్రదేశ్పై విమర్శలు చేయడంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. బిహార్కు చెందిన నేహా సింగ్ భోజ్పురి జానపద గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కోత (layoffs) కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకెన్సీ (McKinsey) 2000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. తమ క్లయింట్స్ తో నేరుగా సంబంధాలు ఉండని సహాయక సిబ్బందిని తొలగించే యోచనలో మెకెన్సీ ఉందని వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ శాండిల్ వుడ్ నటుడు (sandalwood), మాజీ మంత్రి అనంత్ నాగ్ (Ananth Nag) ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. కర్నాటక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నలిన్ కటీల్ ఆధ్వర్యంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు పార్టీ కార్యాలయంలో కమల తీర్థం పుచ్చుకోనున్నారు.