ఢిల్లీలో బైక్ ట్యాక్సీలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీ రవాణా శాఖ నోటీసులో స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఓలా, ఉబర్, రాపిడో రైడర్స్ వంటి సర్వీస్ ప్రొవైడర్లు ఢిల్లీలో బైక్ ట్యాక్సీ సేవలను కొనసాగిస్తే జరిమానా విధించబడుతుందని వెల్లడించింది.
అమృత్సర్కు చెందిన రెండేళ్ల తన్మయ్ 195 దేశాల జెండాలను గుర్తించడం ద్వారా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ప్రవేశించాడని అతని తల్లి హీనా నారంగ్ తెలిపారు. ఇంత చిన్న వయస్సులోనే తన్మయ్ అరుదైన ఘనతను సాధించడం పట్ల బాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ బాబు తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు భగవద్గీతను ఎక్కువగా విన్నానని వెల్లడించింది.
భారత చలన చిత్ర పరిశ్రమలో దాదా సాహెబ్ పాల్కేను ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) సోమవారం రాత్రి ముంబైలో అట్టహాసంగా జరిగింది. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన ట్రిపుల్ అర్, కాంతార సినిమాలు అవార్డు దక్కించుకున్నాయి. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను సొంతం చేసుకున్నది. కలెక్షన్స్ సునామీ సృష్టించిన కాంతారా సినిమాలో నటనకు గాను ...
ఈ సందర్భంగా తమ ప్రజలకు 11 నియమాలు విధించారు. వీటిని విధిగా కట్టుబడి ఉండాలని ఆదేశించారు. వీటిని పాటిస్తామని అందరితో ప్రమాణం చేయించారు. అయితే సమాజ్ పెద్దలు విధించిన 11 నిబంధనలు వివాహానికి సంబంధించినవి ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి..
నేర చరిత్ర ఉన్నవారితో పాటు అనుమానితులను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ లో ఎన్ఐఏ 5 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో కూడా ఇదే రీతిన దాడులు చేపట్టింది. నాడు లభించిన ఆధారాల ఆధారంగా తాజా దాడులు జరిగాయి.
నితీశ్ పై అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు గౌరవం లేదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నితీశ్ పై బాహాటంగా విమర్శలు చేశారు. ఒంటరిగా మారడంతో జేడీ(యూ)ను వదిలేసి కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఉపేంద్రకు ఎవరికీ ఇవ్వనంత గౌరవం ఇచ్చామని పేర్కొన్నారు. వివాదం ముదరడంతో జేడీయూలో ఉపేంద్ర ఒంటరిగా మారారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీని వీడి కొత్త పార్టీని స్థాపించారు.
అతడి స్నేహితుడు ఉండడంతో కొద్దిలో బాలీవుడ్ స్టార్ సింగర్ సోను నిగమ్ క్షేమంగా బయటపడ్డాడు. ఈ సంఘటన బాలీవుడ్ లో కలకలం రేపింది. అయితే దాడికి పాల్పడింది ఓ ఎమ్మెల్యే కుమారుడు అని తెలుస్తోంది. ఆ ఈవెంట్ లో ఎమ్మెల్యే కుమారుడు రెచ్చిపోయాడు. దీనిపై సోనూ నిగమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ బ్లూమ్ బర్గ్ రియల్ టైమ్ బిలియనీర్; జాబితాలో 25వ స్థానానికి పడిపోయారు. సోమవారం నాటికి అతని నికర సంపద 49.1 బిలియన్ డాలర్లు గా ఉంది.
గతేడాది విద్యుత్ సంక్షోభం నుంచి పాఠం నేర్చుకోకపోవడం.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఏడాది కూడా విద్యుత్ కష్టాలు తప్పేట్టు లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రకటన రావడం అంటే దేశంలో విద్యుత్ సంక్షోభం ఉన్నట్టే. అనధికారికంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. గతేడాదిని చూసి నివారణ చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఉంటే ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి కొంత మెరుగయ్యేది.
నటుడు రోబో శంకర్ (Robo Shankar) చిక్కుల్లో పడ్డారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ అనుమతి లేకుండా రెండు అలెగ్జాండ్రైన్ (Alexandrine) జాతికి చెందిన చిలుకలను (parrots)పెంచినందకు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వాళ్లు శంకర్ ఇంటిపై దాడి చేసి ఆ చిలుకలను సీజ్ చేసి జూపార్క్ (zoopark) తరలించారు. ఇంటిని వీడియో తీసి ‘హోం టూర్’ (home tour) పేరుతో దానిని సోషల్ మీడియాలో షేర్ చేసిన తమిళ నటుడు అందుకు మూల్యం చెల్లించుకు...
నీతి ఆయోగ్(NITI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO)గా బీవీఆర్ సుబ్రహ్మణ్యంను కేంద్రం సోమవారం నియమించింది. ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ మూడేళ్లపాటు ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వెళ్లనున్నారు.
కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఫిబ్రవరి 22న అమృత్సర్లోని గురుదాస్పూర్లో 'రైల్ రోకో' నిరసనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది రైతులు పాల్గొననున్నట్లు ప్రకటించింది. భారతమాల యోజన కింద హైవే నిర్మాణం కోసం సేకరించిన భూమికి సమానమైన పరిహారం చెల్లించడం, చెరకు బకాయిలు, ఢిల్లీ ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుబాలకు పరిహారం, ఉద్యోగాలు సహా పలు అంశాలపై రైతులు నిరసన చేపట్టనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అధికారులు దూకుడు పెంచారనే చెప్పవచ్చు. దర్యాప్తును వేగవంతం చేస్తూ క్రమంగా పలువురిని అరెస్ట్ చేసి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అరెస్టైన ఏపీ వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని తీహార్ జైలుకు తీసుకెళ్లారు. రాఘవకు విధించిన కస్టడీ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
మంచి బాడీ షేప్స్, కండలు తిరిగిన మజిల్స్, సిక్స్ ప్యాక్ కోసం యువకులు ఎక్కువగా జిమ్ సప్లిమెంట్లను వాడుతూ ఉంటారు. అయితే వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ఓ 22 ఏళ్ల యువకుడు దీర్ఘకాలంగా జిమ్ సప్లిమెంట్స్ వాడుతూ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్నాడు.
కర్ణాటకలో ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారుల మధ్య లొల్లి అక్కడి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. IAS అధికారిణి రోహిణి సింధూరి వ్యక్తిగత ఫోటోలను.. IPS అధికారిణి డీ రూప మౌద్గిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు లొల్లి మొదలైంది. వీరి గొడవ ఎంటో తెలుసుకోవాలంటే కింది వార్తను చదివాల్సిందే.