రవితేజ్, దర్శకుడు వంశి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ శుక్రవారం విడదలైన ఈ చిత్ర నిడివిని తగ్గిస్తున్నట్లు చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది.
Tiger Nageswara Rao: మాస్ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara rao) విడుదలై డివైడ్ టాక్ను తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంపై వస్తున్న ప్రేక్షకుల స్పందనతో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా రన్టైమ్లో మార్పులు చేసింది. సుమారు అరగంట నిడివిని తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 2.37 గంటల రన్టైమ్తో ఇకపై ఇది ప్రేక్షకులను అలరించనుంది. సినిమా బాగున్నప్పటికి నిడివి విషయంలో ప్రేక్షకుల ఫిర్యాదులు ఎక్కవయ్యాయి. అందుకోసం సినిమాకు కోత తప్పలేదు అని మేకర్స్ తెలిపారు.
స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, రేణు దేశాయ్, జిషుసేన్ గుప్త, మురళీ శర్మ, గాయత్రీ భరద్వాజ్, నాజర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 3.02 గంటల నిడివితో ఈ సినిమా సిద్ధమైంది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కొంత మిక్స్డ్ టాక్ సొంత చేసుకుంది. కథా, కథనం, నటీనటుల ప్రదర్శన బాగున్నప్పటికీ నిడివి ఎక్కువగా ఉందని సినీ ప్రియులు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై దృష్టి సారించిన చిత్రబృందం రన్టైమ్ను తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.