టాలీవుడ్ హీరో నాగశౌర్య, దర్శకుడు రామ్ దేశిన కాంబోలో రాబోతున్న సినిమా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకులకు మేకర్స్ విషెస్ చెప్పారు. అంతేకాదు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17, 2026న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో విధి యాదవ్, సముద్రఖని, వెన్నెల కిశోర్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
భూమిని పోలి ఉండే గ్రహం ‘కెప్లర్-452బి’. ఇది మనకంటే 1.5 బిలియన్ ఏళ్ల ముందే పుట్టింది. భూమి కన్నా 60% పెద్దదైన ఈ గ్రహంపై గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ. అక్కడ మన బరువు రెట్టింపు అవుతుంది. కాంతి వేగంతో వెళ్లినా అక్కడికి చేరడానికి 1400 ఏళ్లు పడుతుంది. మనకంటే పురాతనమైనది కావడంతో అక్కడ అత్యంత తెలివైన జీవులు ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సోదరుడి కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నటన పట్ల అంకితభావం, కుటుంబ విలువలకు గౌరవం ఇచ్చే రామ్ చరణ్కు జన్మదిన శుభాకాంక్షలు. చరణ్ తపన, ఆధ్యాత్మిక చింతన అతనికి శ్రీరామరక్ష. భగవంతుడు అతనికి మరిన్ని విజయాలు, సంపూర్ణ ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
ఫోలే ఆర్టిస్ట్ (సౌండ్ డిజైనర్) అయిన హీరోకి ప్రమాదం వచ్చినప్పుడు ఒక సౌండ్ వినిపిస్తుంది. ఎవరి నుంచి ఆపద ఉందో వాళ్లు దుర్యోధనుడిగా కనిపిస్తారు. ఇంతకీ హీరోకి ఉన్న ప్రమాదం ఏంటన్నదే ‘సుయోధన’ మూవీ స్టోరీ. దర్శకుడు వైఎస్ మాధవ్కి తొలి సినిమా అయినా తడబడకుండా తెరకెక్కించాడు. ప్రియదర్శి, సాయికుమార్, ప్రేమ నటన బాగుంది. థ్రిల్లింగ్ మూమెంట్స్ అలరిస్తాయి. రేటింగ్: 3/5.
జూ.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటివరకు కేవలం 40% మాత్రమే పూర్తయినట్లు సమాచారం. నీల్ మార్క్ భారీ యాక్షన్ సీన్లు, విజువల్ గ్రాండియర్ కోసం తీసుకుంటున్న జాగ్రత్తల వల్లే ఆలస్యమవుతోందట. దీంతో NTR ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చరణ్ ఒక గొప్ప మనసున్న వ్యక్తి అని, డ్యాన్సర్ల కష్టాలు తెలిసిన ఆయన వారి కోసం రూ.40 లక్షలతో సుమారు 2000 మందికి ఇన్సూరెన్స్ చేయించారని కొనియాడాడు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని, డ్యాన్సర్స్ యూనియన్ మొత్తం చరణ్కు రుణపడి ఉంటుందని భావోద్వేగానికి లోనయ్యాడు.
రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నితేష్ తివారీ తెరకెక్కిస్తోన్న మూవీ ‘రామాయణ’. శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ ఈ మూవీ గ్లింప్స్ ‘రామ’పై అప్డేట్ ఇచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న ఈ గ్లింప్స్ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల సమక్షంలో ఒక భారీ ఈవెంట్తో ఈ మూవీ ప్రమోషన్స్ను స్టార్ట్ చేయనున్నట్లు చెప్పారు.
చైతన్య రావు, హెబ్బా పటేల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘రేపు ఉదయం 10 గంటలకు’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. చందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 14, 2026న థియేటర్లలో విడుదలైంది. అభినవ్ గోమఠం, కిరీటి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేదు. దీంతో కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
జీవితంలో ముగ్గురిని ఎప్పటికీ మర్చిపోకూడదని శర్వానంద్ అన్నాడు. ‘బైకర్’ ప్రమోషన్స్లో ఆయన మాట్లాడుతూ.. ‘కష్టాల్లో తోడున్నవారిని, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన వారిని, మనల్ని కష్టాల్లోకి నెట్టిన వారిని ఎన్నటికీ మర్చిపోవద్దు. ఎవరైనా నిరుత్సాహపరిచినా పట్టించుకోకండి. మీ విజయమే అవమానించిన వారికి అసలైన సమాధానం కావాలి. మనసు పెడితే ఏదైనా సాధించగలం’ అని చెప్పాడు.
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా రవి నంబూరి దర్శకత్వంలో ‘చెన్నై లవ్ స్టోరీ’ తెరకెక్కుతోంది. ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టీ-సిరీస్ సొంతం చేసుకుంది. యువతను ఆకట్టుకునే అంశాలతో రూపొందుతున్న ఈ మూవీ మ్యూజిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ‘చిన్నప్పుడు నా చేయి పట్టుకోవడం నుంచి నేడు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడం వరకు.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది చరణ్. నీ క్రమశిక్షణ, కుటుంబంపై బాధ్యత, దైవచింతన నీపై నా ప్రేమను మరింత పెంచుతున్నాయి. దేవుడి దీవెనలతో నువ్వు మరిన్ని శిఖరాలు అధిరోహించాలి’ అని పేర్కొన్నారు.
నటుడు, టీవీకే అధినేత విజయ్పై తాను చేసిన వ్యాఖ్యలపై సముద్రఖని స్పందించాడు. ‘కార్మేని సెల్వం’ ప్రమోషన్స్లో ఆయన మాట్లాడుతూ.. ‘విజయ్కు మొదట మద్దతు ఇచ్చింది నేనే, అందుకే ఆయన నిర్ణయంపై నా బాధను వెలిబుచ్చాను. నా మాటలను ఎవరో మధ్యలో రికార్డ్ చేసి తప్పుగా చూపారు. రికార్డ్ చేస్తున్నారని తెలిసి కూడా నా మనసులోని మాటను దాచుకోకుండా చెప్పాను’ అని క్లారిటీ ఇచ్చాడు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజుల క్రేజీ కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభం కానుందట. దీని కోసం ముంబైలోని SRPF గ్రౌండ్లో ఒక భారీ సెట్ను (మినీ సిటీలా) నిర్మిస్తున్నారట. భారీ యాక్షన్ సీక్వెన్స్ల కోసం చిత్రబృందం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నట్లు టాక్.