‘పుష్ప 2’ సినిమా పైరసీపై చిత్రబృందం స్పందించింది. పైరసీ కనిపిస్తే వెంటనే తెలపాలని మేకర్స్ విజ్ఞప్తి చేశారు. మెయిల్ ఐడీ claims@antipiracysolutions.org , వాట్సాప్ నంబరు 8978650014 ద్వారా తెలియజేయొచ్చని రిక్వెస్ట్ చేశారు. అలాగే నకిలీ డైలాగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పుష్ప-2లోవి అని చెబుతున్నారని, అలా చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నటసిహం బాలయ్య-ప్రగ్యా జైస్వాల్ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డాకు మహారాజ్. ఈ సినిమాపై ప్రస్తుతం ఓ క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆడియెన్స్ను థ్రిల్ చేసేందుకు క్యామియో ఎపిసోడ్స్ ఉంటాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్లోని యంగ్ హీరోలు డాకు మహారాజ్లో ప్రేక్షకులకు సర్ప్రైజ్ చేయనున్నారట.
పుష్ప-2 మ్యూజిక్ విషయంలో సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ‘ సినిమా మొత్తానికి నేనే సంగీతం అందించా. DSP సంగీతంలో మేకర్స్ కొంత భాగం ఉంచినప్పటికీ.. క్లైమాక్స్ ఫైట్తో పాటు బీజీఎంలో 90శాతం క్రెడిట్ నాదే. ఈ మూవీ కోసం పైపు పరికరాలను ఉపయోగించాను’ అని చెప్పుకొచ్చాడు. కానీ సినిమాDSPదేనని, పనులు త్వరగా ముగించాల్సి రావడంతో తనను టీంలోకి తీసుకున్న...
పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు హిందీలో రూ. 72 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్లో ఫస్ట్ రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని అధికారింగా ప్రకటిస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసింది.
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.294 కోట్లు వసూలు చేసిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానులు పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
హీరోయిన్ ప్రగ్యా నగ్రా ప్రయివేట్ వీడియోలు లీక్ అయ్యాయి. ఆమెకు సంబంధించిన వీడియోలు దుండగులు ఇంటర్నెట్లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తన పేరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హర్యానాకు చెందిన ప్రగ్యా తమిళ్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది.
‘భారతీయుడు 2’ సినిమాలో హీరో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సినిమా ఆశించిన స్థాయిలో సాధించకపోవడంపై ప్రశ్న ఎదురవగా సిద్ధార్థ్ స్పందించాడు. ఫ్యామిలీ, ప్రేక్షకులకు తన నటనను మెచ్చుకుంటున్నారని తెలిపాడు. కాగా, సిద్ధార్థ్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘మిస్ యు’ ఈనెల 13న విడుదల కానున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై వాళ్లెప్పుడూ నేరుగా స్పందించలేదు. రీసెంట్గా ఈ జంట ఓ కార్యక్రమానికి హాజరు కాగా.. మ్యాచింగ్ డ్రెస్సుల్లో ఒకే ఫ్రేమ్లో కనిపించారు. అంతేకాక.. ఐశ్వర్య తల్లి బృంద్య, అను రంజన్తో కలిసి ఈ కపుల్ దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో వారి విడాకుల రూమర్స్కి చెక్ పడ...
ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబ స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. నూతన వధూవరులు నాగ చైతన్య, శోభితతో కలిసి కుటుంబ సభ్యులు రుద్రాభిషేకం చేశారు. అనంతరం నూతన దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు అక్కినేని కుటుంబ సభ్యులకు మహాద్వారం వద్ద స్వాగతం పలికారు.
15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న తన పాఠశాల స్నేహితుడు ఆంటోనితో ఏడడుగులు నడవడానికి కీర్తి సురేశ్ సిద్ధమవుతున్నారు. కాగా, తను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి క్రిస్టియన్, ఆమె హిందూ కాబట్టి.. రెండు మతాలను గౌరవిస్తూ వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వీరి పెళ్లి ఈ నెల 12న గోవాలో జరగనుంది. ఉదయం హిందూ మత సంప్రదాయం ప్రకారం.. అదే రోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోన...
‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. హీరోలు అలాంటి టైంలో వెళ్లడం కరెక్టేనా అని నిలదీశారు. ఘటనపై హీరో కానీ, చిత్ర యూనిట్ కానీ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. బాధితురాలి కుటుంబాన్ని హీరో, ప్రొడ్యూసర్స్ ఆదుకోవాలని.. బాధితులకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అన్ని చర్యలు తీసుకుంటామని స్ప...
పుష్ప-2 మూవీలో చూపించిన గంగమ్మ జాతర.. తిరుపతిలో మేలో జరుగుతుంది. ఈ జాతరలో మగవాళ్లు అనేక గెటప్స్ వేసుకుంటారు. రాయలసీమలో పాలెగాళ్ల రాజ్యం రోజుల్లో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరిగేవి. ఆ సమయంలో తనపై కన్నేసిన పాలెగాడిని ఉగ్రరూపంతో సంహరించేందుకు గంగమ్మ అనే మహిళ వెంటాడింది. ఆమెకు భయపడి దాక్కున్న ఆ పాలెగాడిని.. వివిధ వేషధారణలతో బయటకి రప్పించి గంగమ్మ చంపేసింది. అప్పటి నుంచి గంగమ్మను శక్తిస్వరూపంగా భావించ...
బాహుబలి ప్రాంఛైజీ నిర్మాత శోభు యార్లగడ్డ వాట్సాప్ ఖాతా హ్యాక్ అయ్యిందని X ద్వారా షేర్ చేశారు. ‘నా వాట్సాప్ ఖాతా హ్యాక్ చేయబడింది. @WhatsApp నేను మరో 12 గంటలపాటు లాగిన్ అవ్వడానికి అనుమతి లేదు. నేను చాలాసార్లు తప్పు పిన్ని ఎంటర్ చేశాను. ఈ సమయంలో హ్యాకర్ నా కాంటాక్ట్లో ఉన్న చాలామందిని మోసం చేశారు. దయచేసి నా వాట్సాప్ సమస్యపై ఏదైనా చేయండి @Meta @WhatsAPP’కు ట్యాగ్ చేశారు. దీన...
హీరో నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో ఓ కార్యక్రమానికి పాల్గొనడానికి గురువారం వచ్చిన ఆయన అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో కాకినాడ పోర్టు మాఫియాపై సినిమా తీస్తారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. మీరు కథ సిద్ధం చేస్తే చేస్తానని బదులిచ్చారు. ఊహించనిది చేయడమే తన నైజమని బాలయ్య చెప్పారు.
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువా’ నవంబర్ 14న థియేటర్లలో విడుదలై డిజాస్టర్గా మిగిలింది. స్టోరీ బాగున్నా అనుకున్న స్థాయిలో ఈ మూవీ వసూళ్లు రాబట్టలేకపోయింది. దేశంలోనే రెండో భారీ డిజాస్టర్ మూవీగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. అయితే ఈ సినిమా త్వరలో ఓటీటీలో అడుగుపెడుతోంది. డిసెంబర్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.