హీరో రామ్ పోతినేని సోదరుడు కృష్ణ పోతినేని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అతడు నటుడిగా కాకుండా నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నారని సమాచారం. రామ్ హీరోగా నటించబోయే తదుపరి చిత్రాన్ని కృష్ణ స్వయంగా నిర్మించబోతున్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. విఘ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిహారిక కొణిదెల నిర్మించిన తాజా చిత్రం ‘రాకాస’ వచ్చే నెల 3న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న నిహారిక.. చిరంజీవి ‘అంజి’ చిత్రంలో తాను ఓ పాత్రలో నటించినట్లు తెలిపింది. ‘ఆ సినిమాలో ఒక చిన్న పాప పాత్ర కోసం నన్ను తీసుకున్నారు. అప్పుడు నాకు సరిగ్గా మాటలు కూడా రావు. అయితే సినిమా కథలో మార్పులు జరగడం వల్ల నా స్థానంలో వేరే వాళ్లను తీసుకున్నారు’ అని చ...
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో వరుణ్ తేజ్ ఓ క్రేజీ ప్రాజెక్టు చేయనున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు యాదు వంశీ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 28, 2026న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ డ్రామాగా రాబోతున్నట్లు సమాచారం.
విజయ్ సేతుపతి హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘స్లమ్ డాగ్’ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది. విజయ్తో కలిసి పనిచేయడం చాలా ప్రశాంతంగా ఉంటుందని, ఆయన ఒక గొప్ప వ్యక్తి అని పేర్కొంది. కాగా, ప్రస్తుతం ఈ క్రేజీ కాంబోపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
స్కూల్ డేస్లో ప్రేమించాలని తపించే కుర్రాడికి ముగ్గురు అమ్మాయిల వల్ల ఎదురైన అనుభవాలే ‘యూత్’ మూవీ కథ. ప్రేమ, బ్రేకప్, అవమానాల ద్వారా ప్రవీణ్ ఏం నేర్చుకున్నాడనేది ఆసక్తికరం. కరుణాస్ దర్శకత్వం, నటన, సంగీతం, క్లైమాక్స్ మూవీకి ప్లస్. సాగతీత, పాత కథనం కొంచెం బోర్ కొట్టిస్తాయి. రేటింగ్: 2.75/5.
జియో స్టూడియోస్ నిర్మాణంలో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కేవలం 8 రోజుల్లోనే రూ. 1088 కోట్ల గ్రాస్ వసూళ్లతో వెయ్యి కోట్ల మార్కును అత్యంత వేగంగా అందుకున్న చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇందులో ఇండియా వసూళ్లు రూ. 814 కోట్లు కాగా, ఓవర్సీస్ వాటా రూ. 274 కోట్లు. భారతీయ సినిమా సత్తాను ఈ చిత్రం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
సోషల్ మీడియాలో వస్తున్న డేటింగ్ రూమర్లపై నటి మలైకా అరోరా ఘాటుగా స్పందించింది. తన ఉనికి కోసం, పరిపూర్ణత కోసం పురుషుడి తోడు అవసరం లేదని, చిన్నప్పటి నుంచి స్వయంకృషితో ఎదిగానని స్పష్టం చేసింది. ప్రస్తుతం తోడు కోసం వెతకడం లేదని పేర్కొంది. భవిష్యత్తులో ఎవరితోనైనా ఉండాలనిపిస్తే అది తన వ్యక్తిగత నిర్ణయమని, ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని ఆమె తేల్చి చెప్పింది.
సినిమా రంగంలో మహిళల పోరాటంపై సమంత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమ గుర్తింపు కోసం స్త్రీలు రెట్టింపు కష్టపడాలని, ఇతరుల సౌకర్యం కోసం తమ అభిప్రాయాలను, ఆశయాలను త్యాగం చేయడం అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకనైనా ప్రతి చిన్న విషయానికి క్షమాపణలు చెప్పడం ఆపి, మహిళలు తమ వ్యక్తిత్వాన్ని చాటుకోవాలని గట్టిగా పిలుపునిచ్చింది.
తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు నటి సాయి పల్లవి చెక్ పెట్టింది. ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నా పూర్తి దృష్టి కెరీర్పైనే ఉంది. పెళ్లి గురించి ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదు, నేను సింగిల్గానే ఉన్నాను’ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. కావ్య అనే యువతితో ఆయన ఏప్రిల్ 5న నిశ్చితార్థం చేసుకోనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 29న తిరుపతిలో వీరి వివాహం నిరాడంబరంగా జరగనున్నట్లు టాక్. అనంతరం మే 1న HYDలో సినీ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారట. త్వరలోనే శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతుండటంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు పారాక్వాట్ అనే విషపూరిత గడ్డిమందు వల్ల మరణించాడు. దీంతో ఈ రసాయనం తెలంగాణలో సులభంగా లభించడంపై రాహుల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. దీనివల్ల జరుగుతున్న మరణాలను చూసి వైద్యులు కూడా విస్మయానికి గురవుతున్నారని పేర్కొంటూ.. ప్రాణాలను కాపాడేందుకు వెంటనే పారాక్వాట్ను నిషేధించాలని CMO, PMO కార్యాలయాలకు ఆయన విజ్ఞప్తి చేశాడు.
టాలీవుడ్ హీరో నాగశౌర్య, దర్శకుడు రామ్ దేశిన కాంబోలో రాబోతున్న సినిమా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకులకు మేకర్స్ విషెస్ చెప్పారు. అంతేకాదు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17, 2026న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో విధి యాదవ్, సముద్రఖని, వెన్నెల కిశోర్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
భూమిని పోలి ఉండే గ్రహం ‘కెప్లర్-452బి’. ఇది మనకంటే 1.5 బిలియన్ ఏళ్ల ముందే పుట్టింది. భూమి కన్నా 60% పెద్దదైన ఈ గ్రహంపై గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ. అక్కడ మన బరువు రెట్టింపు అవుతుంది. కాంతి వేగంతో వెళ్లినా అక్కడికి చేరడానికి 1400 ఏళ్లు పడుతుంది. మనకంటే పురాతనమైనది కావడంతో అక్కడ అత్యంత తెలివైన జీవులు ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సోదరుడి కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నటన పట్ల అంకితభావం, కుటుంబ విలువలకు గౌరవం ఇచ్చే రామ్ చరణ్కు జన్మదిన శుభాకాంక్షలు. చరణ్ తపన, ఆధ్యాత్మిక చింతన అతనికి శ్రీరామరక్ష. భగవంతుడు అతనికి మరిన్ని విజయాలు, సంపూర్ణ ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.