TG: ఎలక్షన్ రిజల్ట్ లాగే.. సినిమా రిలీజ్ ఫస్ట్డే ఉంటుందని టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. సంధ్య థియేటర్ ఘటన తమను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్లో కాంపిటేషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండటం వల్ల ప్రమోషన్ను విస్తృతంగా చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
TG: బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో చెప్పినదానికే కట్టుబడి ఉంటామని.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే అని చెప్పారు. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవని సినీ ఇండస్ట్రీ పెద్దలకు రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. కాగా, సీఎంతో సినీ ప్రముఖుల సమావేశం కొనసాగుతుంది.
మెల్బోర్న్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యాడు. ఈ సిరీస్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన హెడ్(409)ను బుమ్రా బోల్తా కొట్టించాడు. అతడి బంతిని అంచనా వేయడంలో విఫలమైన హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 4వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం స్మిత్, మిచెల్ మార్ష్ క్రీజులో ఉన్నారు.
TG: సీఎం రేవంత్ రెడ్డితో ఇవాళ పలువురు సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి హాజరుకాలేదు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ వార్త బయటకొచ్చింది. చిరు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారట. అందువల్లే ఆయన సీఎంను కలవలేదట. కాగా, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చిరు మాట్లాడారని సమాచారం.
మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు భాను భోగవరపు రూపొందిస్తున్న సినిమా ‘మాస్ జాతర’. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 26న ఇది విడుదల కానున్నట్లు సమాచారం. ఇక శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి. 2025 మే 9న రిలీజ్ కానుంది.
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి తన నటన, కామెడీ టైమింగ్స్తో ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. పలు యూట్యూబ్ వీడియోలతో పాటు షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి విజయం సాధించాడు. అదే ఏడాదిలో చిచోరే మూవీతో హిందీలో ఎంట్రీ ఇచ్చాడు. ఇక తెలుగులో జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి సినిమాలు తీశాడు.
TG: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరామర్శించాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ను కలిశారా? అంటూ ఓ విలేకరు జానీని అడిగాడు. దానికి ‘లేదు. జైలు నుంచి వచ్చాక ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతున్నా’ అంటూ జానీ బదులిచ్చాడు.
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన గ్రేస్, నటన, డ్యాన్స్తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా చిరు ఫొటోషూట్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన స్టైలిష్ స్టిల్స్ బయటకొచ్చాయి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. చిరు చాలా యంగ్ హీరోలా కనిపిస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
TG: HYDలోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలసిందే. కాగా, తొక్కిసలాటలో విరిగిపోయిన గ్రిల్స్కు మరమ్మతులు చేస్తున్నారు. అలాగే, థియేటర్ లోపల, బయట మరమ్మతులు ప్రారంభమయ్యాయి. ఇకనుంచి సంధ్య 70MM, 35MM థియేటర్లకు వెళ్లేందుకు ఆయా గేట్లకు ప్రత్యేక సూచికలు బిగిస్తున్నారు. ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన మూవీ ‘పుష్ప 2’. ఇటీవల ఈ సినిమా నుంచి ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ పాట రిలీజైన విషయం తెలిసిందే. తాజాగా ఆ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు. ప్రస్తుతం టీ సిరీస్ తెలుగు ఛానల్లో ఇది కనిపించడం లేదు. బన్నీ పోలీసులు విచారించిన రోజున(డిసెంబర్) ఈ పాటను రిలీజ్ చేయగా.. కావాలనే దీన్ని విడుదల చేశారని పలువురు నెటిజన్లు విమర్శించారు.
హీరోయిన్ శ్రుతి హాసన్ తన పెళ్లిపై నిర్ణయాన్ని చెప్పారు. ‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పెళ్లి చేసుకోను అని చెప్పాను కానీ.. ఎప్పటికీ చేసుకోనని చెప్పలేదు కదా..! నేను రిలేషన్లో ఉండటాన్ని ఇష్టపడతాను. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. భవిష్యత్లో ఎవరైనా నా మనసుకు దగ్గరైతే వారిని వివాహం చేసుకుంటాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం’ అని అన్నారు.
హీరోయిన్ శ్రుతి హాసన్ తన పెళ్లిపై నిర్ణయాన్ని చెప్పారు. ‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పెళ్లి చేసుకోను అని చెప్పాను కానీ.. ఎప్పటికీ చేసుకోనని చెప్పలేదు కదా..! నేను రిలేషన్లో ఉండటాన్ని ఇష్టపడతాను. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. భవిష్యత్లో ఎవరైనా నా మనసుకు దగ్గరైతే వారిని వివాహం చేసుకుంటాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం’ అని అన్నారు.
దేశముదురు సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆ తరువాత చాలా మంది యంగ్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. 2022లో పారిశ్రామికవేత్తను పెళ్లాడింది. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే హన్సిక బ్లాక్ కలర్ స్లీవ్లెస్ ధరించి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.