నాగ చైతన్య విషయంలో తాను ఎంతో ఆనందంగా ఉన్నానని అక్కినేని నాగార్జున తెలిపారు. చైతూతో పరిచయం కంటే ముందే తనకు శోభితా ధూళిపాళ్ల తెలుసని చెప్పారు. శోభిత ఎంతో అందమైన, మంచి మనసున్న అమ్మాయని కొనియాడారు. చైతన్య జీవితంలోకి ఆమె వచ్చినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాగా.. చైతూ, శోభిత పెళ్లి ఈ నెలలోనే జరిగిన విషయం తెలిసిందే.
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను పరామర్శించిన అనంతరం ఆయన ప్రకటించారు. హీరో అల్లు అర్జున్ తరపున రూ.కోటి, పుష్ప-2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
సినీ నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. బాలుడు శ్రీతేజ్ను పరామర్శించారు. బాలుడి తండ్రి భాస్కర్తో వారిద్దరూ మాట్లాడనున్నారు. బాధిత కుటుంబానికి అందించాల్సిన సాయంపై వారు చర్చించనున్నారు. కాగా, సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి చనిపోగా.. గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో విచారణ ఖైదీలుగా కొనసాగుతున్న మరో ఐదుగురికి బెయిల్ మంజూరైంది. బెంగళూరు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పును ప్రకటించింది. దీంతో హత్యకేసును ఎదుర్కొంటున్న మొత్తం 17మంది బెయిల్పై బయటకు వచ్చారు. వీరిలో వినయ్, పవిత్రగౌడ అసిస్టెంట్ పవన్, రాఘవేంద్ర, వినయ్, నందీశ్కు బెయిల్ మంజూరైంది.
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్న మూవీ ‘లైలా’. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్లో కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి సోను మోడల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. విశ్వక్.. స్టైలిష్ అండ్ రిచ్ కిడ్లా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన చేతులపై ఉన్న టాటూస్ అట్రాక్షన్గా నిలిచాయి. ఇక ఈ మూవీ 2025 ఫిబ్రవరి 14న విడుదలవుతుంది.
టాలీవుడ్లో ఇటీవల నెలకొన్న పరిస్థితులపై మంచు విష్ణు ‘మా’ అసోసియేషన్ సభ్యులకు పలు సూచనలు చేశారు. ‘ప్రభుత్వాల మద్దతుతోనే సినీ పరిశ్రమ ఎంతో ఎదిగింది. ప్రతీ ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. సున్నిత అంశాలపై సభ్యులు బహిరంగ ప్రకటనలు చేయవద్దు. వివాదాస్పద అంశాల జోలికి ఎవరూ వెళ్లవద్దు. చట్టం తన పని తాను చేస్తుంది. అందరూ సంయమనం పాటించాలి’ అని విజ్ఞప్తి చేశారు.
‘బలగం’ దర్శకుడు వేణుతో నటి సాయి పల్లవి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. హీరో నితిన్తో వేణు ‘ఎల్లమ్మ’ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. ఎల్లమ్మ పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి ఈ ఏడాది వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో తాను పెర్ఫార్మెన్స్ ఇవ్వడంపై ప్రముఖ సింగర్ మీకా సింగ్ తాజాగా స్పందించాడు. తాను భారీ మొత్తంలో డబ్బు అందుకున్నట్లు తెలిపాడు. కానీ అనంత్ తనకు రూ.2 కోట్లు విలువ చేసే వాచ్ ఇవ్వలేదని, అది తనని బాధించిందని సరదాగా చెప్పాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
TG: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం HYD కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు నిర్మాత దిల్ రాజు మరోసారి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్నాడు. అల్లు అరవింద్, సుకుమార్తో కలిసి వెళ్లనున్నాడు. బాలుడి తండ్రి భాస్కర్తో సాయంపై చర్చించనున్నాడు. కాగా, ఇప్పటికే శ్రీతేజ్ తండ్రిని కలిసిన దిల్ రాజు.. వారిని అన్నివిధాలా ఆదుకుంటామన్నారు.
ఇవాళ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు విషెస్ చెబుతున్నారు. తాజాగా ఆయనకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘స్పిరిట్’ షూటింగ్ కోసం ఆసక్తిగా ఉన్నట్లు పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు సందీప్ రెడ్డికి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
నటి శ్రీదేవితో తన ప్రేమ, పెళ్లి గురించి నిర్మాత బోనీ కపూర్ తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. మొదట శ్రీదేవికి తానే ప్రపోజ్ చేసినట్లు తెలిపాడు. ప్రేమ విషయం చెప్పగానే ఆమె తనతో మాట్లాడటం మానేసిందని, దాదాపు 6 నెలలు ఆమె తనతో మాట్లాడలేదని అన్నాడు. నా చివరి రోజు వరకూ ఆమెను పేమిస్తూనే ఉంటానని పేర్కొన్నాడు.
నటి మాళవికా మోహనన్ అభిమానులతో సరదాగా ముచ్చటించింది. X వేదికలో ఆమె #AskMalavika నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. ‘మీ జీవితాన్ని మార్చిన సూచన ఏంటి? అని అడిగాడు. దీంతో ఆమె.. ‘కామెంట్స్ సెక్షన్ చదవద్దు అని ఒక పెద్దాయన చెప్పారు. అది నా జీవితాన్ని ఎంతో మార్చింది’ అంటూ జవాబు ఇచ్చాడు.
‘నో ఎంట్రీ’ సినిమాపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీతో పోలిస్తే పార్ట్ 2 చాలా బాగుంటుందని అన్నాడు. ‘పార్ట్ 1లో నటించిన నటీనటులతో పార్ట్ 2 ప్లాన్ చేశా. వాళ్ల కోసం ఎంతో ఎదురుచూశాను. కాకపోతే వాళ్లకంటూ కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని నేను గౌరవించా. అందుకే కొత్త వాళ్లతో మూవీ చేస్తున్నా’ అంటూ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రాబోతుంది. ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్పై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్లో జరుగుతున్నట్లు వెల్లడించాడు. ఈ టీంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందంటూ ఫొటో షేర్ చేశాడు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
మలయాళ హీరో మోహన్ లాల్ స్వీయ దర్శకత్వంలో నటించిన మూవీ ‘బరోజ్’ ఇవాళ విడుదలైంది. తాజాగా ఈ సినిమా OTT పార్ట్నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్ను డిస్నీ+హాట్స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్స్ రన్ పూర్తయిన తర్వాత OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాల్లో టాక్. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.