TG: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక లాజిస్టిక్స్ సేవలను TGSRTC ఎండీ నాగిరెడ్డి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. రూ.151 చెల్లించి రాములోరి తలంబ్రాలు పొందే అవకాశం కల్పించారు. ఈనెల 23 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.