హీరో షారుఖ్ తనయుడు ఆర్యన్ తెరకెక్కించిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వివాదంలో చిక్కుకుంది. ఈ సిరీస్లో తనని తప్పుగా చూపించారని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. షారుఖ్, రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్పై పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించినందుకు రూ.2 కోట్లు చెల్లించాలని తెలిపారు.