ప్రముఖ హీరో జూ.ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా, ఫొటో, పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్, సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తూ.. ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.