తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు జయభారతి(77) అనారోగ్యంతో కన్నుమూశారు. మూత్రపిండాల ఇన్ఫెక్షన్ కారణంగా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక 1979లో క్రౌడ్ ఫండింగ్ విధానంలో ‘కుడిసై’ సినిమాను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినీ జీవితంలో కేవలం 9...
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘విశ్వంభర’. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్.. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక UV క్రియేషన్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్&zwn...
మెగా హీరో సాయి ధరమ్ ప్రధాన పాత్రలో దర్శకుడు రోహిత్ కేపీ ‘SDT18’ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 12న మూవీ టైటిల్ను రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే గ్లింప్స్ కూడా విడుదల చేస్తున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. ఇక ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతోన్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథాన...
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మికా మందన్న ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా ‘ది గర్ల్ఫ్రెండ్’. తాజాగా ఈ సినిమాలోని రష్మిక పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 9న దీన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక రష్మిక నటించిన ‘పుష్ప 2’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మొదటి రోజే రూ.294 కోట్లు రాబట్టింది. దీంతో ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రూ.294 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డులను సెట్ చేసింది. కాగా, అంతకుముందు ఇండియాలో ఇప్పటివరకు మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘RRR’ రూ.233 కోట్ల గ్రాస్తో మొదటి స్థానంలో ఉంది. తాజాగా ఆ రికార్డును ...
జీ తెలుగు: బొమ్మరిల్లు (9AM), గ్రీకువీరుడు (11PM); ఈటీవీ: ఆడుతూ.. పాడుతూ (9AM); జెమినీ: ఆర్య 2 (8.30AM), పందెంకోడి (3PM); స్టార్ మా: పుష్ప (9AM), రఘువరన్ బీటెక్ (10:30PM); స్టార్ మా మూవీస్: అనుభవించు రాజా (7AM), రాజా రాణి (9AM), ది ఘోస్ట్ (12PM), దూకుడు (3PM), క్రాక్ (6PM), మంగళవారం (9PM); జీ సినిమాలు: చీకటి (7AM), బాబు బంగారం (9AM), డిమోంటి కాలనీ 2 (12PM), W/O రణసింగం (3PM), […]
‘పుష్ప 2’ సినిమా పైరసీపై చిత్రబృందం స్పందించింది. పైరసీ కనిపిస్తే వెంటనే తెలపాలని మేకర్స్ విజ్ఞప్తి చేశారు. మెయిల్ ఐడీ claims@antipiracysolutions.org , వాట్సాప్ నంబరు 8978650014 ద్వారా తెలియజేయొచ్చని రిక్వెస్ట్ చేశారు. అలాగే నకిలీ డైలాగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పుష్ప-2లోవి అని చెబుతున్నారని, అలా చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నటసిహం బాలయ్య-ప్రగ్యా జైస్వాల్ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డాకు మహారాజ్. ఈ సినిమాపై ప్రస్తుతం ఓ క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆడియెన్స్ను థ్రిల్ చేసేందుకు క్యామియో ఎపిసోడ్స్ ఉంటాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్లోని యంగ్ హీరోలు డాకు మహారాజ్లో ప్రేక్షకులకు సర్ప్రైజ్ చేయనున్నారట.
పుష్ప-2 మ్యూజిక్ విషయంలో సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ‘ సినిమా మొత్తానికి నేనే సంగీతం అందించా. DSP సంగీతంలో మేకర్స్ కొంత భాగం ఉంచినప్పటికీ.. క్లైమాక్స్ ఫైట్తో పాటు బీజీఎంలో 90శాతం క్రెడిట్ నాదే. ఈ మూవీ కోసం పైపు పరికరాలను ఉపయోగించాను’ అని చెప్పుకొచ్చాడు. కానీ సినిమాDSPదేనని, పనులు త్వరగా ముగించాల్సి రావడంతో తనను టీంలోకి తీసుకున్న...
పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు హిందీలో రూ. 72 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్లో ఫస్ట్ రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని అధికారింగా ప్రకటిస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసింది.
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.294 కోట్లు వసూలు చేసిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానులు పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
హీరోయిన్ ప్రగ్యా నగ్రా ప్రయివేట్ వీడియోలు లీక్ అయ్యాయి. ఆమెకు సంబంధించిన వీడియోలు దుండగులు ఇంటర్నెట్లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తన పేరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హర్యానాకు చెందిన ప్రగ్యా తమిళ్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది.
‘భారతీయుడు 2’ సినిమాలో హీరో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సినిమా ఆశించిన స్థాయిలో సాధించకపోవడంపై ప్రశ్న ఎదురవగా సిద్ధార్థ్ స్పందించాడు. ఫ్యామిలీ, ప్రేక్షకులకు తన నటనను మెచ్చుకుంటున్నారని తెలిపాడు. కాగా, సిద్ధార్థ్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘మిస్ యు’ ఈనెల 13న విడుదల కానున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై వాళ్లెప్పుడూ నేరుగా స్పందించలేదు. రీసెంట్గా ఈ జంట ఓ కార్యక్రమానికి హాజరు కాగా.. మ్యాచింగ్ డ్రెస్సుల్లో ఒకే ఫ్రేమ్లో కనిపించారు. అంతేకాక.. ఐశ్వర్య తల్లి బృంద్య, అను రంజన్తో కలిసి ఈ కపుల్ దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో వారి విడాకుల రూమర్స్కి చెక్ పడ...