పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ మూవీ ‘కల్కి 2898ఏడీ’. భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగం షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ శంకర్పల్లి సమీపంలో అమితాబ్ బచ్చన్పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈనెలాఖరు నుంచి ప్రభాస్ షూటింగ్లో పాల్గొంటున్నట్లు సమాచారం. కమల్హాసన్ మార్చి తర్వాత సెట్లోకి వస్తారు.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రాబోయే షెడ్యూల్లో 20 నిమిషాల పాటు సాగే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది సినిమాకే ప్రధాన హైలైట్గా నిలవబోతుందట. ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్గా కనిపిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. జనవరి 30న థియేటర్లలోకి విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మార్చి 4 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కోపిష్టి ఓంకార్(తరుణ్), స్వేచ్ఛ కోరుకునే ప్రశాంతి(ఈషా)ల పెళ్లి తర్వాత వారి జీవితాల్లో ఎదురైన నాటకీయ పరిణామాల సమాహారమే ఈ మూవీ కథ.
NTR, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే, ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ వార్తలు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం, నార్త్ అమెరికా, యూకే హక్కుల కోసం సుమారు రూ.55 కోట్ల అడ్వాన్స్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ చరిత్రలోనే ఇది భారీ ఓవర్సీస్ డీల్గా భావిస్తున్నారు.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈనెల 27న ‘రూబారూ’ అనే ఫస్ట్ సింగిల్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కలయికలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘AA22’. ‘పుష్ప 2’ విజయం తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో, దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ఓ అదిరిపోయే అప్డేట్ SMలో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ ప్రొఫెషనల్ సింగర్గా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. అర్జిత్ సింగ్ను కలిసి పాటలు పాడటం ఆపొద్దంటూ స్వయంగా కోరాడు. ముర్షిదాబాద్లోని అర్జిత్ సింగ్ నివాసానికి వెళ్లిన అమీర్.. ‘నువ్వు పాటలు పాడటం ఆపేస్తే మేము ఏమైపోతాం?’ అంటూ రిక్వెస్ట్ చేయడం విశేషం.
ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోవడం, కావాలని తనను పక్కన పెట్టడంతోనే తాను హాలీవుడ్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఆ సమయంలో తాను తీవ్ర ఒత్తిడికి గురైనట్లు పేర్కొంది. హాలీవుడ్లో ఎన్ని విజయాలు వచ్చినప్పటికీ, భారతీయ చిత్రాల్లో నటించేందుకే తాను ఎప్పుడూ మొగ్గు చూపుతానని వెల్లడించింది.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈనెల 26న వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎంత ఉండవచ్చు? అని అభిమానులు నెట్టింట్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ వయసు 36 ఏళ్లు కాగా, రష్మిక వయసు 30 ఏళ్లు. వీరి మధ్య ఆరేళ్ల వ్యత్యాసం ఉంది. వయసులో పెద్దగా తేడా లేకపోవడంతో వీరిద్దరూ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అని కామెంట్లు చేస్తున్నారు.
గాయత్రి భార్గవి నటిగా, యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనపడుటలేదు’ సిరీస్లో నటించింది. తాజాగా ఓ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ.. ‘మేమంతా ఆర్టిస్టులుగా ఆకలితో ఉన్నాం. అవకాశాలిస్తే తినేస్తాం. మేం కూడా ఉన్నామని గుర్తించండి. విమానమే ఎక్కి రావక్కర్లేదు.. లోకల్గా కార్లు, ట్రైన్లు కూడా ఎక్కి వచ్చి చేయొచ్చు’ అని తెలిపింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్ వల్లే మళ్లీ తనలో మార్పు మొదలైందని తెలిపింది. ‘వివాహ బంధం ముగిసిన తర్వాత ఇక ఎవరినీ నమ్మడం సాధ్యం కాదేమోననిపించింది. ఎందుకంటే ప్రేమ, స్నేహం అంగీకరించలేనంద బలహీనంగా మారిపోయా. రాజ్ నిడుమోరును కలిశాకే నాలో మార్పు వచ్చింది. రాజ్ అలాంటి ప్రేమను పంచిన వ్యక్తి’ అని చెప్పుకొచ్చింది.
విజయ్, రష్మికల పెళ్లి ఈనెల 26న ఘనంగా జరగబోతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి నికర ఆస్తి ఎంత ఉండవచ్చు అనే చర్చ SMలో జోరుగా సాగుతోంది. విజయ్కు జూబ్లీహిల్స్లో రూ.15 కోట్ల విలువైన బంగ్లా ఉండగా, అతని మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.70 కోట్లుగా అంచనా. అలాగే, రష్మికకు కర్ణాటక విరాజ్పేటలో రూ.8 కోట్ల ఇల్లు ఉంది. ఆమె మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.66 కోట్లు అని సమాచారం.
ఏడేళ్ల వయసులోనే నటనను ప్రారంభించిన రాబర్ట్ అరమాయో 2026 బాఫ్టా అవార్డుల్లో ఉత్తమ నటుడుగా నిలిచారు. ఐ స్వేర్ చిత్రంలోని నటనకు గాను లియోనార్డో డికాప్రియోను ఓడించి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గతంలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి ప్రముఖ సిరీస్లలో నటించిన ఆయన, అమెరికాలో ప్రత్యేక నటనా శిక్షణ పొంది తన ప్రతిభను చాటుకున్నారు.