కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి హీరో సందీప్ కిషన్ తాజాగా పంచుకున్నారు. ‘నేను సినిమాల్లోకి వెళ్తానని చెబితే మొదట అమ్మ నాన్న అంగీకరించలేదు. ఆ తర్వాత ఓకే అన్నారు. స్నేహగీతం సినిమా తర్వాత నా తల్లిదండ్రులను సెట్కు ఎప్పుడూ పిలవలేదు. ఆ సినిమా సెట్లో జరిగిన ఘటన నన్ను ఇబ్బంది పెట్టింది. ఒకవేళ నాకు చెప్పకుండా వాళ్లు వస్తే.. 15 నిమిషాల్లో అక్కడి నుంచి పంపించేస్తాను’ అ...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి స్టేషన్కు తరలించారు. బన్నీపై 105, BNS 118(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో 5-10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడనుంది. కాగా, తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైన విషయం [&he...
గూగుల్లో అత్యధికంగా వెతికిన నటీనటుల జాబితాలో టాప్ 10లో నటి హీనా ఖాన్ ఉన్నారు. దీనిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇది సంతోష పడాల్సిన విషయం కాదన్నారు. ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకున్నారు. హీనా క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె ఈ ఏడాది ఆరంభంలో వెల్లడించారు. దీంతో హీనా గురించి చాలా మంది గూగుల్లో వెతకడం స్టార్ట్ చేశారు.
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్పై స్టార్ హీరోయిన్ నయనతార స్పందించారు. తన భర్త విఘ్నేశ్తో దిగిన ఫొటోలు పెడితే వాటికి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పారు. అందుకే ఆయనతో దిగిన ఫొటోలను షేర్ చేయడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’లో కామెడీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ ‘వేరే లెవెల్ ఆఫీస్’ స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 50 ఎపిసోడ్స్తో రూపొందిన ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ అందుబాటులో ఉంది. మరో ఎపిసోడ్ ఇవాళ రాత్రి 7 గంటలకు రిలీజ్ కానుంది. కాగా ఈ సిరీస్ ఎపిసోడ్స్ ప్రతి గురువారం, శుక్రవారం రాత్రి 7 గంటలకు రిలీజ్ అవుతాయి.
బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మర్దానీ 3’. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఈ సినిమాను అభిరాజ్ మినావాలా తెరకెక్కిస్తున్నారు. ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ‘జైలర్’ భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘జైలర్ 2’ రాబోతుంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఓ పవర్ ఫుల్ గ్యాంగ్స్టర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన పాత్ర ఊర మాస్ ఉంటుందని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
TG: మోహన్బాబు గురువారం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని జల్పల్లి నివాసంలో మోహన్బాబు, మనోజ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జల్పల్లి నివాసం దగ్గర ప్రైవేటు వ్యక్తులను అనుమతించడంలేదు. అయితే విష్ణు మాత్రం ఇంకా అక్కడికి రానట్లు తెలుస్తోంది. విష్ణు ప్రస్తుతం మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమాపై బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా రివ్యూ ఇచ్చారు. మూవీ అద్భుతంగా ఉందని, అల్లు అర్జున్ ప్రదర్శన మరో స్థాయిలో ఉందని తెలిపారు. భార్యాభర్తల మధ్య సన్నివేశాలను ‘పుష్ప 2’లో చక్కగా చూపించారని, ఇలాంటి సీన్స్ బాలీవుడ్లో తెరకెక్కించాల్సి వస్తే కావాల్సినంత అశ్లీలత పెడతారని వెల్లడించారు. దక్షిణాది చిత్రాలను చూసి బాలీవుడ్ ఎంతో నేర్...
హీరో గోపీచంద్తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో 2010లో ‘గోలీమార్’ మూవీ వచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని పూరీ భావిస్తున్నారట. ‘గోలీమార్’ చుట్టూ కొత్త కథను నడపొచ్చని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న ఇది విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ రన్ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది. 2:40 గంటల నిడివితో ఇది విడుదల కానున్నట్లు సమాచారం. ఇక దర్శకుడు శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మెకానిక్ రాకీ’ మంచి హిట్ అందుకుంది. ఈ యాక్షన్ కామెడీ మూవీ సైలెంట్గా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, దివి కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘హరికథ’. మర్డర్ మిస్టరీకి మైథలాజికల్ టచ్ ఇచ్చి తెరకెక్కించిన ఈ సిరీస్ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ+హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని సదరు సంస్థ వెల్లడించింది.
జీ తెలుగు: దాస్ కా ధమ్కీ (9AM), సుభాష్ చంద్రబోస్ (11PM); ఈటీవీ: సూర్యవంశం (9AM); జెమినీ: లక్ష్మీ (8.30AM), ఖడ్గం (3PM); స్టార్ మా మూవీస్: సీతారాం బెనోయ్ (7AM), మహానటి (9AM), క్రాక్ (12PM), సర్దార్ గబ్బర్ సింగ్ (3PM), గీతాంజలి మళ్లీ వచ్చింది (6PM), ఛత్రపతి (9PM); జీ సినిమాలు: అభినేత్రి (7AM), ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (9AM), విన్నర్ (12PM), 777 చార్లి (3PM), F3 (6PM), దేవదాస్ (9PM).