శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తొలి వారంలోనే ఏకంగా 5.75 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు ప్రకటించారు. శనివారం ఒక్కరోజు సాయంత్రానికే 72 వేలమందికి పైగా భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. రద్దీ నిర్వహణ, సౌకర్యాలపై ట్రావెన్కోర్ బోర్డు అధికారులతో మంత్రి వీఎన్ వాసవన్ ప్రత్యేకంగా సమావేశమై సమీక్షించారు.