సంచలనాల కోసం.. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం యువత పిచ్చిపిచ్చి వేషాలకు (Stunts) పాల్పడుతున్నారు. వెర్రి వేషాలు వేస్తూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే సాహసాలకు (Adventures) ఒడిగట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు వైరల్ (Viral) కావడం కోసం చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తన స్నేహితుడితో కాసిన పందెం (Challenge) కోసం నడిరోడ్డుపై స్నానం (Bath on Road) చేశాడు....
తన స్నేహితుడు మరణవార్త విన్న ఓ అఘారా అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. బంధాలకు దూరంగా ఉండే అఘారా తన స్నేహితుడి మృతదేహంపై కూర్చుని పూజలు చేయడంతో స్థానికులు భయాందోళన చెందారు.
గత మార్చి నెలలో కూడా జీవన్ రెడ్డి ప్రమాదానికి గురయ్యారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన సమయంలో సంఘటన చోటుచేసుకుంది. రెండు నెలల తర్వాత మరోసారి ఎమ్మెల్యే ప్రమాదానికి గురయ్యారు.
కదులుతున్న కారుపైన పుషప్స్ చేస్తూ అత్యంత దుస్సాహసానికి ఒడిగట్టారు. దీంతోపాటు కారు ముందు అద్దాలపై నుంచి బయటకు వచ్చి ప్రమాదకరంగా ప్రయాణం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరి వెర్రికి పోలీసులు బుద్ధి చెప్పారు.
పలువురు దుండగులు అక్షయ్కుమార్ నటించిన 'స్పెషల్ 26' సినిమాతో పాటు పలు చిత్రాలు(movies) చూసి దోపిడీకి ప్లాన్ చేశారు. ఆ నేపథ్యంలో 8 నుంచి 10 మంది కలిసి సికింద్రాబాద్లోని ఓ నగల దుకాణంలోకి ఐటీ అధికారులమని వెళ్లారు. 60 లక్షల రూపాయల విలువైన 17 బంగారు కడ్డీలను దోచుకెళ్లారు.
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిన్నయ్యపై ఓ మహిళ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కు కంప్లైంట్ చేసింది. ఈ అంశంపై పోలీసులకు అనేకసార్లు తెలిపినా కూడా పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పరీక్షల్లో నిందితులు ప్రశాంత్, నవీన్, మహేష్ ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించినట్లు సిట్ పోలీసులు గుర్తించారు.
మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సురేష్ బాలు(Suresh Balu) ధనోర్కర్ కన్నుమూశారు. కాంగ్రెస్ నాయకుడు సురేష్ బాలు ధనోర్కర్ ఢిల్లీ ఎన్సీఆర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అతని వయసు 47 సంవత్సరాలు. సురేష్ బాలు మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కు చెందిన ఏకైక ఎంపీ. సురేష్ బాలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతిని...
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో బహిరంగంగా జరిగిన ఈ హత్య దారుణం మాత్రమే కాదు, మానవాళికే సిగ్గుచేటు. కోపంతో నేరం చేశానని నిందితుడు సాహిల్(sahil) తన నేరాన్ని అంగీకరించాడు. అయితే మైనర్ బాలికను చంపిన తర్వాత ఆమె మృతదేహం అరగంట పాటు అక్కడే పడి ఉంది.
జూబ్లీ హిల్స్లో Xora నైట్ క్లబ్లో వినూత్నంగా జంతువులను బంధించి పార్టీ జరుపుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి వన్యప్రాణులను అదుపులోకి తీసుకుని అటవీ అధికారులకు అందించారు.