రూ.500 నోట్లు రూ.90 లక్షలు ఇవ్వాలని.. రూ.కోటి విలువగల రూ.2 వేల నోట్లను ఇస్తామని ఓ ముఠా మోసం చేస్తోంది. వారి వెనక ఓ పోలీస్ అధికారి ఉన్నారు. ఘటనను ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకొని.. సదరు అధికారిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీచేశారు.
ఓ బాలిక పట్ల అండగా ఉండాల్సిన రక్షకభటుడే(constable) కామంధుడిగా మారి కాటేశాడు. తన ఇంట్లో పనిలో చేరిన బాలికపై ఆరునెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. అంతేకాదు ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. అయినా కూడా ఆ అమ్మయి ధైర్యంగా పోలీసులకు చెప్పి అతన్ని అరెస్ట్ చేయించింది.
హత్య జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత ఈ విషయాలు వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 2021లో అడిలైడ్కు చెందిన తారిక్జోత్ సింగ్ (22) తన మాజీ ప్రియురాలు జాస్మిన్ కౌర్ (21)ని హత్య చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, అతను ఈ నేరాన్ని అంగీకరించాడు.
జగన్ అక్రమాస్తుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ కు నోటీసులు జారీ చేసింది.
ప్రవేశ్ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదైంది. తాగిన మత్తులో ఊగుతూ ఆ వ్యక్తి ఆదివాసి యువకుడిపై మూత్ర విసర్జనకు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఘోర కారు ప్రమాదంలో భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్(praveen kumar), ఆయన కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారం రాత్రి వీరి వాహనాన్ని అతివేగంతో ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
జౌన్పూర్లోని మడియాహున్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారకమైన కేసు తెరపైకి వచ్చింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని జైరాంపూర్ గ్రామంలో ఈ తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఢిల్లీ ఎయిమ్స్ లో ఘరానా మోసం బయటపడింది. నీట్ పరీక్షలో విద్యార్థుల స్థానంలో వేరేవారు పరీక్ష రాసినట్లు రుజువైంది. అందుకోసం ఒక్కో విద్యార్థి దగ్గర 7లక్షల వరకు వసూల్ చేసినట్లు తేలింది.
మహారాష్ట్రలోని ధులే(maharashtra Dhule) జిల్లాలో మంగళవారం ఒక కంటైనర్ ట్రక్కు నాలుగు వాహనాలను ఢీకొట్టి, ఆపై హైవేపై ఉన్న హోటల్లోకి దూసుకెళ్లడంతో కనీసం 15 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.