సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు గుబులు రేపుతోంది. కబాలి నిర్మాత కేపీ చౌదరి అరెస్ట్ అవ్వడంతో పోలీసులు ఆయన కాంటాక్ట్స్ లిస్ట్ పరిశీలించారు. తాను 12 మందికి కొకైన్ అమ్మినట్లు కేపీ చౌదరి అంగీకరించడంతో పోలీసులు ఆ 12 మందికి నోటీసులు పంపారు.
ఓ దంపతులు అధిక వడ్డీ పేరుతో పలువురి నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయలు తీసుకుని రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇది తెలిసిన బాధితులు మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఏపీలో జరిగింది.
పశ్చిమ బెంగాల్లోని ఓండా రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 25 ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఒక గూడ్స్ రైలు మెయిన్ లైన్కు బదులుగా లూప్ లైన్లోకి ప్రవేశించి ట్రాక్పై ఉన్న మరొక గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైళ్లలోని 12 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. జూన్ 2 నాటి విషాదకరమైన బాలాసోర్ రైలు ప్రమాదం ఘటన మరువక ముందే మరొకటి చోటుచేసుకుంది. దీంతో ఖరగ్పూర్-బంకురా-ఆద్రా ల...
కూతురుని కాపురానికి పంపకుండా విడాకుల కోసం కోర్టులో కేసు వేసిందన్న కోపంతో విజయవాడలో ఓ వ్యక్తి తన అత్తను దారుణంగా హతమార్చాడు. విజయవాడలో నగర శివారులోని చనమోలు వెంకటరావు ఫ్లైఓవర్ సమీపంలోని ఫుట్పాత్పై జరిగింది. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్లో హిజాబ్ వివాదం వెలుగులోకి వచ్చింది. హయత్ నగర్లోని జీ స్కూల్ యాజమాన్యం ఓ ముస్లిం విద్యార్థినిని క్లాస్ రూములో స్కార్ఫ్ ధరించవద్దని కోరడంతో ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జానకీపురం సర్పంచ్ నవ్య(Sarpanch Navya) కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసును జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. ఈ క్రమంలో విచారణ వేగవంతం చేయాలని కమిషన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నవ్యకు కాజీపేట ఏసీపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై గల ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. మూడు రోజుల్లో సమర్ప...
టాలీవుడ్ చిత్రసీమలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఆ మధ్య టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్స్ , నటి నటులు , టెక్నీషన్ల పేర్లు ఈ డ్రగ్స్ కేసులో వినిపించడం..ఆ తర్వాత వారికీ క్లిన్ చిట్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో పలువురు సినీ ప్రముఖుల పేర్లలో అషు రెడ్డి(Ashu reddy) పేరు ఉండడం తో మరోసారి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలోని సోలిపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన లారీని వేగంగా వచ్చిన బొలేరో ఆకస్మాత్తుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా..ఒకరికి గాయాలయ్యాయి. శనివారం ఉదయం బెంగళూరు హైవేపై హైదరాబాద్ నుంచి కర్నూల్ వైప్ వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగ...
విద్యుత్ వైరును దొంగిలించారనే ఆరోపణపై పోలీసులు కొందరు దుర్మార్గులను వెంబడించారు. ఇంతలో పోలీసులను చూసి ఓ దుండగుడు ఫ్లై ఓవర్పై నుంచి దూకాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. నేరస్థుడిని ఆసుపత్రిలో చేర్చారు, కాని వైద్యులు అతని ప్రాణాలను రక్షించలేకపోయారు.
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు రోజుల పాటు ఆయన్ని పోలీసులు విచారించారు. విచారణలో ఆయన మొత్తం 12 మంది పేర్లను బయటపెట్టారు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలలో టెన్షన్ మొదలైంది.