హైదరాబాద్ పెరుగుతున్న నెపాల్గ్యాంగ్ల దొంగతనాలు. రామ్గోపాల్ పేటలో ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో భారీ మొత్తం చోరీ చేసి నేపాల్ పారిపోవాలని ప్లాన్ వేశారు. మొత్తంగా సినిమాను తలపించే నాటకీయ పరిణామం తరువాత పట్టుబడ్డారు.
భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి చెందిన విషాద ఘటన మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.
ముంబైలో ఘోరం జరిగింది. భారీ వర్షాల కారణంగా రైలు ఆగడంతో బిడ్డను ఆడించడానికి రైలు దిగిన తండ్రి నుంచి చేజారీ 4 నెలల పసికందు కాలువలో కొట్టుకుపోయింది.
మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక తెగకు సంబంధించిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వారికి మరణశిక్ష ఉంటుందని రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ తెలిపారు.
అహ్మదాబాద్లోని ఎస్జీ హైవేపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు.
తిరుపతిలో రైలు ప్రమాదం తప్పింది. పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సిబ్బంది అలర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వల్ల పలు రైలు ఆలస్యంగా నడవనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఉత్తరాఖండ్ చమోలీలోని అలకనంద నది ఒడ్డున ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనలో 15 మంది మృతి, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అలకనంద నది ఒడ్డున జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ చమోలి పరమేంద్ర దోవల్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Uttarakhand: Policeman among 10 killed in Chamoli transformer explosion Read @ANI Story | https://t.co/en9...
బెంగళూర్ లో పేలుళ్లకు పథకం వేసిన ఐదుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న సీసీబీ పోలీసులు, మరో ఇద్దరిపై అనుమానం.
ఒక ప్రేమ జంట తమ ఏకాంతం కోసం ఓ గ్రామంలో ప్రతిరోజు కరెంట్ తొలగిస్తున్నారు. మాటేసిన గ్రామస్తులు జంటను పట్టుకొని యువకుడికి దేహశుద్ది చేశారు.
మిథునం మూవీ రచయిత శ్రీరమణ మృతి చెందారు. ఈరోజు ఊదయం 5 గంటలకు మరణించారు. గతంలో రమణ, బాపుతో కలిసి శ్రీరమణ పనిచేశారు. పేరడి రచనలు చేయడంలో రమణ ఎంతో ప్రఖ్యాతి గాంచారు. దీంతోపాటు నవ్య వారపత్రికకు ఎడిటర్ గా కూడా రమణ పనిచేశారు. “మిథునం” చిత్రంలో వృద్ధ జంట కథ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటుంది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా 50 రోజులు ఆడింది. ఇద్దరు వృద్ధాప్య జంటల వైవాహిక సంబంధానికి సంబంధించిన ఈ చిత్రంలో...
తెలిసిన వ్యక్తి నుంచి వీడియో కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. బంధువు చికిత్స మేరకు 40 వేలు అప్పుగా అడగడంతో బాధితుడు అన్లైన్లో పంపాడు. తీరా చూస్తే అది ఫ్రాడ్ కాల్, ఏఐ టెక్నాలజీతో మోసం చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఏపీలో మరో టమాటా రైతును హత్య చేశారు. రైతును హత్య చేసి టమాటాలను దొంగిలించారు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. వారం రోజుల్లో ఇది రెండో ఘటన. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్యాసినో వ్యవహారంలో సంచలనం సృష్టించిన చికోటి ప్రవీణ్ మరో వివాదంలో చిక్కుకున్నారు.
ఓ మహిళ 12 మందిని పెళ్లాడింది. పెళ్లి చేసుకున్న ప్రతిసారీ ఆమె తన అత్తగారింటి నుంచి డబ్బు, నగలతో పరారయ్యేది. 12వ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు.
పబ్జీ గేమ్ పరిచయం ప్రేమగా మారి తరువాత పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ మహిళా సీమా గులాం హైదర్, భారతీయ యువకుడు సచిన్ గత 4 రోజులుగా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్వార్ట్ అలర్ట్ అయింది.