పంజాబ్లో పరువు హత్య కలకలం రేపింది. ఓ తండ్రి తన కూతుర్ని చంపి, ఆమె మృతదేహాన్ని బైక్కు కట్టి ఈడ్చుకెళ్లాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భారీ వరదలకు చైనాలో 29 మంది మృతిచెందారు. గత నెలలో కూడా వరదల వల్ల 33 మంది మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనాలోని చాలా ప్రాంతాలు వరదల వల్ల ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ప్రజలు తీవ్ర నష్టాలతో తల్లడిల్లుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
సినీ నటి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్షను ఎగ్మోర్ కోర్టు విధించింది. కార్మికుల చట్టం ప్రకారం ఆమెకు ఈ శిక్ష పడింది. జైలు శిక్షతో పాటుగా రూ.5 వేల జరిమానానా కోర్టు విధించింది. ఆమెతో పాటు మరో ముగ్గురికి కూడా ఈ శిక్ష పడింది.
డేటింగ్ యాప్లో పరిచయం అయిన అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటన హ్యర్యానా గురుగ్రామ్లో జరిగింది. పరిచయం అయిన వ్యక్తి హోటల్కు పిలిచి తినే పదార్థంలో మత్తు కలిపాడు. తన స్నేహితుడు ఇద్దరు కలిసి అమ్మాయిపై అత్యాచారం చేశారు.
ఓ ఎమ్మెల్యే కుమారుడు(mla son) ఓ వ్యాపారం డీల్ విషయంలో కంపెనీ సీఈఓ(CEO)ను ఏకంగా తుపాకీ పట్టుకుని బెదిరించాడు. అంతేకాదు అతన్ని వాహనంలో ఎక్కించుకుని పట్టపగలే తీసుకెళ్లారు. అయితే ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ గా మారింది.
ఆపద అంటే ఆరున్నర లక్షలను అప్పుగా ఇచ్చిన ఓ వ్యక్తి తనకు అవసరం ఉందని ఎన్నిసార్లు చెప్పినా తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వడం లేదని, కుటుంబంతో సహా వెళ్లి అతని ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశారు.
భార్యభర్తల గొడవలు మాములే అని అంటారు. కానీ క్షణికావేశంలో జరిగే నష్టాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. తన భార్య కాపురానికి రావట్లేదని ఓ భర్త తన అత్తగారింటికి నిప్పు పెట్టాడు. తర్వాత ఏమైందో మీరు చూసేయండి మరి.
ఒక ఏరియాలో కారును దొంగలిస్తారు. దాని ఛాసిస్ నెంబర్తో సహా చాలా మార్పులు చేసి వేరే ఏరియాలో తక్కువ ధరకే అమ్మేస్తారు. పోలీసుల కళ్లుకప్పి కోట్ల రూపాయలు దోచుకుంటున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమ్మ అనిపించుకోవడం ప్రతి మహిళకు ఉండే బలమైన కోరిక. అప్పుడే తన జీవితం సంపూర్ణంగా ఉంటుందని భావిస్తుంది. అలా 20 సంవత్సరాల నిరీక్షణ తరువాత బిడ్డలకు జన్మనిచ్చి తల్లి వారిని చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది.
తెలంగాణలో పలువురికి పోలీసులు(police) అంటే కనీసం గౌరవం లేకుండా పోయింది. మద్యం సేవించిన ఓ వ్యక్తికి ఏకంగా మరో వ్యక్తి సపోర్ట్ చేయడమే కాదు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. ఈ సంఘటన ఇటివల జరుగగా..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భక్తులు ఉన్న ఆలయంలోకి టెర్రరిస్టుల గుంపు ప్రవేశించింది. ముఖానికి నల్లని మాస్క్లు, చేతులో గన్ను ధరించి పలువురిని బెదిరించారు. దీంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అంతలో ఒక వ్యక్తి వచ్చి సదరు టెర్రరిస్ట్ను ఇవేం పనులు అంటు చెంప పగలగొట్టాడు. తరువాత ఏం జరిగిందంటే..