ఇద్దరి మధ్య గొడవలో భార్య వేలను కొరికి మింగేశాడు భర్త. 23 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్ని చిత్రహింసలు పెట్టిన ఒక్క రోజు కూడా ఫిర్యాదు చేయలేదని భార్య అంటోంది.
మహిళలు ప్రతి రోజు క్యాబుల్లో వెళ్తున్నారా? అయితే జర జాగ్రత్త. వెళ్లే క్రమంలో మీరు ఫోన్ మాట్లాడే విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఎవ్వరినీ కూడా నమ్మే పరిస్థితి లేదు. పక్కన ఉన్నవారు లేదా డ్రైవర్ సహా మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అలా విని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే ఇక అంతే సంగతులు. అవును. అచ్చం ఇలాంటి సంఘటనే ఇటివల జరిగింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్ రోడ్లు మరో చిన్నారిని(child) బలి తీసుకున్నాయి. ఇప్పటికే ఇక్కడి రోడ్ల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతుండగా..తాజాగా హైదరాబాద్(Hyderabad) బాచుపల్లిలో మరో ఘోరం చోటుచేసుకుంది. రోడ్ల గుంతల కారణంగా ఓ తండ్రి స్కూటిపై వెళ్తున్న చిన్నారి కింద పడి మృత్యువాత చెందింది. ఆ వివరాలెంటో ఇఫ్పుడు చుద్దాం.
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన సచిన్ బిష్ణోయ్(Sachin Bishnoi) అలియాస్ సచిన్ థాపన్ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అజర్బైజాన్లోని బాకు నుంచి భారత్కు రప్పించింది.
హర్యానాలోని నుహ్(Nuh district)లో సోమవారం సాయంత్రం జరిగిన మతపరమైన ఊరేగింపులో దుండగుల వర్గాలు(Haryana Violence) రాళ్లు రువ్వుకున్నాయి. ఈ క్రమంలో పలువురు కార్లకు నిప్పంటించడంతో 50 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరణించిన వారి సంఖ్య మంగళవారం ఉదయం నాటికి ఐదుకు చేరుకుందని పోలీసులు పేర్కొన్నారు.
మహబూబ్నగర్ ఎమ్మెల్యే, మంత్రి వి.శ్రీనివాస్గౌడ్(srinivas goud)పై కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్ విషయంలో ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని తెలిపింది.
ముంబై-నాగ్పూర్ ఎక్స్ప్రెస్వే (సమృద్ధి మహామార్గ్) పనులు జరుగుతున్న షాపూర్లో గిర్డర్పై క్రేన్ ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో 17 మంది కార్మికులు మృత్యువాత చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సొంత జిల్లా థానే(thane district)లో చోటుచేసుకుంది.