వరుస భూకంపాలు 320 మందిని పొట్టనబెట్టుకున్నాయి. అరగంటలోనే పశ్చిమ ఆఫ్గాన్ మొత్తం చెల్లాచెదురైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
చోటా రాజన్ ముఠా అంటే 1990లలో ముంబై వణికిపోయేది. ఆయన గ్యాంగ్ చేసే పనులకు పోలీసులు తలలు పట్టుకోవల్సిన పరిస్థితి. అలాంటి ముఠాలోని ఒక వ్యక్తిని తాజాగా ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 28 ఏళ్ల నుంచి తప్పించుకు తిరుగుతూ ఈ రోజుకి పోలీసులకు చిక్కాడు.
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత చెందగా..వారిలో ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పైలట్లు అభయ్ గాడ్రూ, యశ్ విజయ్ రాముగాడే ముంబైకి చెందినవారని పేర్కొన్నారు.
సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. అమ్మ ఒడి పథకానికి అర్హత సాధించారని మాట కలుపుతున్నారు. అలా నమ్మి ఇద్దరు ముగ్గురు ఓటీపీ, లింక్ క్లిక్ చేసి ఉన్న డబ్బులను పోగొట్టుకున్నారు.
మాముళ్ల కోసం ఎవరైనా వస్తే అండగా ఉండాల్సిన పోలీసులే మాముళ్లు వసూలు చేయడం ప్రారంభించారు. అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ పోలీసులు ఇలా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు బాలీవుడ్లో అలజడి రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే స్టార్ హీరో రణబీర్ కపూర్కు ఈడీ అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ కమెడియన్ కపిల్ శర్మతో పాటు మరికొందరికి ఈడీ సమన్లు జారీ చేసింది.
ముంబైలోని ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఓ వ్యక్తికి 690 ఏళ్ల పాటు జైలు శిక్ష పడనుంది. అతని వయసు 34 ఏళ్లు మాత్రమే. కానీ చేసిన నేరాలు మాత్రం చాలానే ఉన్నాయి. ఇంతకీ అతనేం చేశాడు? అన్ని సంవత్సరాల పాటు శిక్ష ఎందుకు పడనుందో తెలుసుకోండి.
ఈ మధ్యకాలంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ గురించి ఎక్కువగా వార్తలు వినపడుతున్నాయి. దీనిలో భాగంగానే రీసెంట్ గా బాలీవుడ్ హీరో రణబీర్కు సమన్లు జారీ చేసినట్టుగా ఈడీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 6వ తేదీన రణబీర్ కపూర్ ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆయనకు జారీ చేసిన సమన్లలో పేర్కొన్నారు.