అమెరికాలోని టెక్సాస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తెలుగువాళ్లు మృతి చెందారు. వీరంతా ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం వాసులు. ప్రమాద వార్త తెలియడంతో స్థానికుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
కసాయి సెంట్రల్ ప్రావిన్స్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకు రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒకే కుటుంబానికి చెందినవాళ్లు కూడా మృతి చెందారు.
ప్రస్తుతం చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ 13ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు.
ఆలయం వద్ద ప్రసాదం తిని ఒకరు మృతి చెందగా మరో 70 మంది పరిస్థితి విషమంగా ఉన్న ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఐసీయూలో మరికొందరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిని సజీవదహనం చేశాడు ఓ ట్రాన్స్జెండర్. తాను ట్రాన్స్జెండర్ అని తెలిసి వేరే అతనితో రిలేషన్లో ఉంది. అదే సమయంలో ట్రాన్స్జెండర్ కూడా యువతి ప్రేమించిన అతనిపై మనసుపడ్డాడు. విషయం తెలియడంతో దారుణం యువతిని చంపేశాడు.
దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, ఓవర్ టేకింగ్ , మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది గాయాలపాలవుతున్నారు. తాజాగా శనివారం ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సారావుపేటలో విషాదం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న 19 ఏళ్ల శిల్ప శిల్పకు రెండు నెలల క్రితం వెంకటేష్ అనే వ్యక్తితో వివాహం కొన్ని రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఈ క్రమంలోనే ఆమెను భర్త హతమార్చాడని బంధువుల ఆరోపణ భర్త వెంకటేష్ పై అనుమానం వ్యక్తం చేస్తున్న యువతి బంధువులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హన్మకొండ-కరీంనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇసుక లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో ఢీకొన్న ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.
న్యూయార్క్లోని లాగ్వార్డియా విమానాశ్రయంలో ఆందోళనకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఓ చిన్నారి డైపర్లో 17 బుల్లెట్లు లభ్యమయ్యాయి. అకస్మాత్తుగా సెక్యూరిటీ గేటు వద్ద ఉన్న ఎక్స్-రే మిషన్లో అలారం మోగడం ప్రారంభించింది. దీని తరువాత, తనిఖీ సమయంలో, ఒక ప్రయాణికుడు పిల్లల డైపర్లో దాచిపెట్టిన 17 తుపాకీ బుల్లెట్లను తీసుకువెళుతున్నట్లు గుర్తించగా..అతడిని అరెస్టు చేశారు.
చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లోని విశ్వవిద్యాలయంలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో 14 మంది మరణించారు. దీంతోపాటు డజన్ల కొద్దీ గాయపడినట్లు అధికారులు తెలిపారు.
బిగ్ బాస్ షోపై మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదు అయింది. రియాలిటీ షో ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, నిర్వాహకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించిందని, గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన ఘర్షణలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి అని హైకోర్టు న్యాయవాది అరుణ్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.