డ్రగ్స్ దందాలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెడ్లర్స్ విదేశీ సిమ్ కార్డ్స్, కోడ్ పదాలు ఉపయోగిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
డ్రగ్స్ కేసులో భాగంగా హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ పోలీసులు మరోసారి సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిపారు.
ప్రజలను కాపాడాల్సిన పోలీసులు వారే రోడ్లపై బూతులు తిట్టుకుంటూ ఒకరినొకరు చితకబాదుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నేటిజనుల ముందు పోలీసులు నవ్వుల పాలు అవుతున్నారు.
ఇండోబంగ్లాదేశ్ సరిహద్దులో గోల్డ్ స్మగ్లింగ్ ముఠాను BSF జవాన్లు చేధించారు. ఆ క్రమంలో ఇద్దరిని పట్టుకుని వారి నుంచి ఏకంగా 14 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఓ బాలిక ఇన్స్పెక్టర్పై అత్యాచారం కేసు పెట్టింది. దీని ఆధారంగా పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసి జైలుకు పంపారు. నిందితుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పశ్చిమ డీసీపీ తెలిపారు.
తమిళ్ హీరో విజయ్ ఆంటోని నివాసంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తన 17 ఏళ్ల కుమార్తె మీరా ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత గమనించిన హీరో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
టూరిస్టు ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే కొండలు లేదా జలపాతలు లేదా ఆయా ప్రదేశాల వద్ద ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో చెెప్పలేం. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. టూర్ కోసం వెళ్లిన పర్యటకుల వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత చెందారు.
ఆస్పత్రులకు వెళ్తున్నారా అయితే జాగ్రత్త. ఎందుకంటే ఎక్కడ చుసినా కామాంధులే తయారయ్యారు. గతంలో పలు చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి రాగా..తాజాగా ఏకంగా హైదరాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రిలోనే ఓ వ్యక్తి యువతిపై ఆత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం పోలీసులకు తెలుపడంతో బహిర్గతమైంది.
భాగ్యనగరం(hyderabad)లో ఫేక్ సర్టిఫికెట్లు(Fake certificates) తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఆ క్రమంలో ఆరుగురిని అరెస్టు చేయగా..వారి నుంచి అనేక యూనివర్సిటీలకు చెందిన ద్రువపత్రాలు లభ్యమయ్యాయి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.
బ్రెజిల్(brazil)లోని అమెజాన్ రెయిన్ఫారెస్ట్లో ఓ ప్రయాణీకుల విమానం శనివారం కూలిపోయింది. దీంతో అందులో ఉన్న మొత్తం 14 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా తెలిపారు.
హైదరాబాద్ పరిధిలో చిన్నారులకు ఏదైనా వ్యాధి వస్తే చాలు వెంటనే గుర్తుకొచ్చేది నిలోఫర్ హాస్పిటల్. అలాంటిది ఈ ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం చిన్నారులకు భద్రత లేకుండా పోయింది. తాజాగా ఓ ఆరు నెలల బాబు ఆస్పత్రి నుంచి కనిపించకుండా పోయాడు. ఓ మహిళ ఎత్తుకుంటానని తీసుకుని ఏకంగా ఎత్తుకెళ్లింది.
వేగంగా వెళ్తున్న అంబులెన్స్ వాహనం ప్రమాదవశాత్తు ఆగిఉన్న పాల వ్యానును ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు విషయం తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషాదఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలోని తవనంపల్లి మండలం తెల్లగుండ్లపల్లి పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీ...
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా(annamayya district)లో తెల్లవారుజామున ఘోర ప్రమాదం(road accident) జరిగింది. లారీ, తుఫాన్ వాహనం వచ్చి ఢీకొన్న ఘటనలో ఐదురుగు మృత్యువాత చెందగా..మరో 11 మందికి గాయాలయ్యాయి.
ఐఐఐటీ చదివిన ఓ విద్యార్థి హ్యాకింగ్ నేర్చుకున్నాడు. తన హ్యాకింగ్ నైపుణ్యంతో ఓ వెబ్సైట్ను హ్యాక్ చేసి రూ.4.16 కోట్ల విలువైన రివార్డు పాయింట్లను దోచేశాడు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో హీరో నవదీప్ ఉన్నారని, బేబీ సినిమాలోని దృశ్యాలే స్పాట్ లో కనిపించాయని తెలిపారు. బేబీ మేకర్స్కు నోటీసులు ఇవ్వనున్నామన్నారు.