మెదక్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామంలో అర్దరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవ దహనం అయ్యారు. గ్రామానికి చెందిన, పిట్టల అంజమ్మ తన ఇద్దరు కుమారులతో కలసి హైదరాబాద్లో నివాసం ఉంటుంది. నిన్న మనవరాలు మధు తో కలిసి పెన్షన్, రేషన్ బియ్యం కోసం గ్రామానికి వచ్చింది. అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి భారీ శబ్దం రావడంలో భయాందోళనకు గురుయ్యారు. వెంటనే పోలీసులు, అగ్నిమా...
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో నాలుగంతస్థుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. లక్నోలోని, హజ్రత్ గంజ్ ప్రాంతంలోని ఒక నాలుగంతస్థుల భవనం మంగళవారం రాత్రి కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణా బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప...
మహారాష్ట్రలోని పూణె సమీపంలో ఉన్న భీమా నది తీరంలో విషాదం చోటు చేసుకుంది. భీమా నది ఒడ్డున ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. భీమా నది తీరంలో మృతదేహాలు ఉన్నాయనే సమాచారం అందండంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. నది తీరంలో నాలుగు మృతదేహాలు తేలుతూ కనిపించాయి. ఆ తర్వాత కొంత సేపటికి మరో మూడు మృతదేహాలు కనిపించాయి. వీళ్లంతా ఒకే ఫ్యామిలీకి...
ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటా అని ఓ మహిళకు మాటిచ్చాడు. మాయ మాటలు చెప్పి తనతో సహజీవనం చేశాడు. ఇద్దరూ కొన్ని రోజులు కలిసే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఆ మహిళను పక్కన పెట్టడం ప్రారంభించాడు అతడు. పెళ్లి చేసుకో అంటే మాట దాటేశాడు. చివరకు ఏం చేయాలో తెలియక తన గోడును కలెక్టర్ కు విన్నవించుకుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. పాల్వంచలో నివాసం ఉండే […]
కాలిఫోర్నియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ‘హాప్ మూన్ బే’ పట్టణంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇలా రెండోసారి కాల్పులు జరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ కాల్పుల ఘటనలో చైనాకు చెందిన వ్యవసాయ కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు 67 ఏళ్ల వ్యవసాయ కూలీ జావో చున్లీ అని అధికారులు గుర్తించారు. తోటి వర్కర్లపై అతడు కాల్పులు జ...
మేడ్చల్ జిల్లా లోని శామిర్ పేటలో కాల్పలు కలకలం రేపాయి. ముడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో వైన్ షాప్ వద్ద దుండుగులు కాల్పలు జరిపారు. తుపాకులతో బెదిరించి రూ 2లక్షలు చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని మద్యం దుకాణం వద్దకు రాత్రి మాస్క్ లు ధరించి ముగ్గురు దుండగులు వచ్చారు. క్యాషియర్ తో పాటు మరో ఇద్దరిపై కర్రలతో దాడి చేశారు. తుపాకీతో బెదిరించి రూ.2 లక్షలను దుండగులు చోరీ చేశారు. మ...
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పిఠాపురం – సామర్లకోట మధ్య పట్టాలు గూడ్స్ రైలు పట్టాలు తప్పగా.. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. రైలు పట్టాలు తప్పడంతో విశాఖపట్నం నుంచి విజయవాడ రూట్లో పలు రైళ్లు రాకపోకలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు తెలిపారు. పిఠాపురంలో స్టేషన్లో యశ్వంతపూర్, రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్ర...
Crime News : కుక్కను ఎవరైనా కుక్క అనే పిలుస్తారు. కాకపోతే కొందరు తమ పెంపుడు కుక్కలకు పేర్లు పెట్టుకుంటారు. అటువంటి వాళ్లు మాత్రం తమ పెంపుడు కుక్కను పెట్టుకున్న పేరుతో పిలుస్తారు. కానీ.. దానికి ఒక పేరు ఉందని వేరే వాళ్లకు తెలియదు కదా. అప్పుడు దాన్ని వాళ్లు కుక్క అనే పిలుస్తారు కదా. కానీ.. ఓ వ్యక్తి తన కుక్కను పేరుతో కాకుండా కుక్క అని పిలిచాడని.. ఏకంగా ఆ వ్యక్తినే చంపేశాడు కుక్క […]
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. యువ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నాడు.వైజాగ్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని మరణానికి వ్యక్తిగత సమస్యలే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. 2013 లో కిశోర్ తిరుమల డైరెక్టర్ వహించిన సెకండ్ హ్యాండ్ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఆయన ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వత వర ముళ్లపూడి దర్మకత్వంలో కుందనపు బొమ్మ చిత్రంలో నటించారు. ఈ సినిమా 2016 లో రిలీజ్ అయింది. మరికొన్ని సిన...
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కన్న తల్లి తన ప్రియుడితో కలిసి ముగ్గురు పిల్లల్ని యాదాద్రిలో వదిలేసి వెళ్లిపోయింది. బలవంతంగా అర్ధరాత్రి ఆటోలో తీసుకొచ్చి యాదాద్రి ఆలయం సమీపంలో వదిలేసింది. వారి సొంత తండ్రి గతంలోనే వదిలేసి వెళ్లడం.. ఇప్పుడు తల్లి ప్రియుడితో కలిసి గెంటేయడంతో అభంశుభం తెలియని చిన్నారులు యాదాద్రిలో తీవ్ర చలిలో గజగజ లాడుతూ కనిపించారు. పిల్లలను దయనీయ స్థితిని గుర్తించిన పోలీసులు చ...
పట్టాలు దాటుతూ.. రైలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. పట్టాలు దాటుతుండగా ఎదురుగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించ...
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. లక్నో- కాన్పూర్ హైవేపై వెళ్తున్న ఓ ట్రక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలను ఢీకొంది. అంతేకాకుండా రోడ్డు పక్కనున్నవారిపై కూడా ట్రక్కు దూసుకెళ్లింది. ఆ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసుల...
విశాఖలో హత్యాయత్నం కలకలం రేపింది. తండ్రిపై కూతురు కత్తితో దాడి చేసింది. శంకరమఠం ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు తండ్రిపై కోపంతో కూతురు ఈ దాడి చేసింది. పోలీసులకు తండ్రి ముకుందరావు ఫిర్యాదు చేయడంతో బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు తన లవర్ కి ఇంట్లోని నగలు, నగదు రహస్యంగా ఇచ్చింది. అంతేకాదు అతడినికి ఇవ్వడానికి మరిన్ని డబ్బులు కూడా ఇవ్వమని తండ్రిని...
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది. కాలిఫోర్నియాలోని చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా వేడుక జరుగుతోంది. ఆ కార్యక్రమంలో కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంఘటనకు గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. చైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో జరుగుతుండగా ...
తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం జరిగింది. ధర్మపురిలో జల్లికట్టును వీక్షించేందకు వచ్చిన ఓ బాలుడు మృతిచెందాడు. జల్లికట్టును ను చూసేందుకు గోకుల్ అనే 14 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన ఎద్దు గోకుల్ ను కడుపులో పొడిచింది. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు బాలుడ్ని ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు ...