• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

ఉలిక్కిపడిన కడప.. అర్ధరాత్రి కత్తుల దాడిలో ఇద్దరు మృతి

కడప పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టణం నడిబొడ్డున అర్ధరాత్రి ఇద్దరు యువకులపై కత్తులతో కొందరు యువకులు దాడులకు పాల్పడ్డారు. కాపు కాచి మరీ ఇద్దరు స్నేహితులను హతమార్చారు. తీవ్ర గాయాలతో ఓ యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరొక యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ సంఘటన కడపలో కలకలం రేపింది. డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చదవండి: కలకలం.. టీడీపీ మండల అధ్యక్షుడిపై క...

February 2, 2023 / 01:49 PM IST

ఏపీలో కలకలం: టీడీపీ మండల అధ్యక్షుడిపై కాల్పులు

ఆంధ్రప్రదేశ్ లో అర్ధరాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. పల్నాడు జిల్లా రొంపిచర్లలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాల కోటిరెడ్డిపై కాల్పులు జరిగాయి. రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డికి తీవ్ర రక్తస్రావమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనప్రాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఈ కాల్పులకు పాల్పడింది ఎవరో తెలియడం లేదు. రాజకీయ కక్షతోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టా...

February 2, 2023 / 08:47 AM IST

క్రూరత్వం.. బాత్రూమ్ లో దాగున్నా వదలని కామాంధుడు

కామం మైకంలో అభం శుభం తెలియని బాలికపై కామాంధుడు ఎగబడ్డాడు. అతడి పైశాచిక ప్రవర్తనకు భయాందోళనకు గురైన బాలిక బాత్రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. అయినా వదల్లేదు. తలుపులు పగులగొట్టి బాలికను పట్టుకున్నాడు. కేకలు వేస్తుండడంతో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు. ఈ క్రమంలో బాలిక నోట్లో యాసిడ్ పోసి అతి క్రూరంగా ప్రవర్తించాడు. యాసిడ్ బాధకు విలవిలలాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక కన్నుమూసి...

February 1, 2023 / 09:54 AM IST

ట్రైన్ కిందకి దూకి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

ముంబైలోని విలేపార్లే రైల్వే స్టేషన్ లో విషాద ఘటన జరిగింది. ఓ రైల్వే ఉద్యోగి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అందరు చూస్తుండగానే పట్టాలపైకి దూకేశాడు. రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన పేరు రాకేష్ గౌడ్. పశ్చిమ రైల్వేలో చీఫ్ లోకో ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో ఆయన ప్లాట్ ఫామ్ పై నిల్చుని ఉన్నారు. కాసేపు అటు ఇటు […]

February 1, 2023 / 09:55 AM IST

విమానంలో మహిళ వికృత చేష్టలు.. బట్టలిప్పి రచ్చరచ్చ

విమాన ప్రయాణంలో ప్రయాణికులు రచ్చరచ్చ చేస్తున్నారు. ముష్టిఘాతాలు, బాహాబాహీకి దిగి బీభత్సం సృష్టిస్తున్నారు. దేశీయంగానే కాక అంతర్జాతీయ విమానాల్లోనూ ఇలాంటి పరిణామాలు  చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విమానంలో ఓ మహిళ నానా రభస చేసింది. సిబ్బందిపై దాడి చేయడమే కాక విమానంలో అర్ధ నగ్నంగా తిరుగుతూ వికృత చేష్టలకు పాల్పడింది. తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు...

January 31, 2023 / 11:44 AM IST

స్కూలు బ‌స్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బ‌స్సు.. 15 మంది చిన్నారుల‌కు గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేటలో స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదం గురించి డీఈవోను కలెక్టర్ ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు. తమ పిల్లలకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న...

January 31, 2023 / 11:43 AM IST

అమెరికాలో దుండగుల కాల్పులు.. పదిమందికి గాయాలు

అమెరికాలో తుపాకుల మోత కొనసాగుతుంది. ఫ్లోరిడాలో జరిగిన కాల్పుల్లో 10 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని లేక్‌ల్యాండ్ పోలీసు విభాగం నిర్ధారించింది. సోమవారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయని, కనీసం 10 మంది గాయపడ్డారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. డార్క్ బ్లూ కలర్ నిస్సాన్ కారులో వచ్చిన నలుగురు దుండగులు కిటికీ అద్దాలను దించి వాహనాన్ని నెమ్మదిగా పోనిస్తూ కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు తె...

January 31, 2023 / 10:14 AM IST

రూ.4 కోట్లకు పెరిగిన వడ్డీ.. పెట్రోల్ పోసుకున్న సర్పంచ్

గ్రామ అభివృద్ధి కోసం అప్పులు చేసి మరీ పనులు చేస్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. బిల్లులు పెండింగ్ లో ఉండడంతో తాము చేసిన అప్పులకు వడ్డీ భారీగా పెరుగుతోందని వాపోయింది. అధికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్న వినడం లేదనే ఆవేదనతో మహిళా సర్పంచ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో చోటుచేసుకుంది. చదవండి: మోడీ వి...

January 31, 2023 / 09:29 AM IST

అమర్‌రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో నష్టం

షార్ట్ సర్క్యూట్ కారణంగా అమర్‌రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు, జాతీయ రహదారిపై కలకలం రేపింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం ఏర్పడగా.. కార్మికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మోర్దానపల్లెలో జాతీయ రహదారి పక్కన అమర్‌రాజా ఫ్యాక్టరీ ఉంది. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పరిశ్రమలో బ్యాటరీలు తయారు చేస్తుంటారు. సోమవ...

January 31, 2023 / 08:34 AM IST

భార్య చూస్తుండగానే పాము కాటేసింది.. అక్కడికక్కడే భర్త మృతి

ఓ వ్యక్తి తన భార్య ముందే పాము కాటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. క్వీన్స్ లాండ్ కు చెందిన ఓ వ్యక్తి ఇంటి వెనుక ఉండగా.. ఓ పాము తన చేతి మీద కాటేసింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో తన భార్య కూడా అక్కడే ఉంది. అది ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ అని చెబుతున్నారు. తన భర్తను పాము కాటేయగానే.. భార్య గట్టిగా అరిచింది. […]

January 30, 2023 / 03:52 PM IST

మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 13 మంది అరెస్ట్

మేడ్చల్ జిల్లాలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు జరిపిన దాడుల్లో 13 మంది పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం.. ఇక్కడ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు కొంతకాలంగా సమాచారం ఉంది. దీంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పేకాట శిబిరం నుంచి భారీ ఎత్తున నగదు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ లక్షల్లో డబ్బు పెట్టి పేకాట ఆడుతున్నట్లు పోలీసులు తె...

January 30, 2023 / 11:48 AM IST

పెళ్లిచూపుల్లో అమ్మాయి ‘నో’.. కాల్వలోకి దూకిన యువకుడు

పెళ్లిచూపులకు వెళ్లగా.. తనను వివాహం చేసుకోవడానికి అమ్మాయి నిరాకరించడంతో ఓ యువకుడు మనస్తాపం చెందాడు. ఆమె తిరస్కరించడాన్ని తట్టుకోలేక కాళేశ్వరం గ్రావిటీ కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘నాన్నా.. ఓ పెళ్లి కోసం పరకాల వెళ్తున్నా’ అని ఇంట్లో చెప్పేసి కారులో వెళ్లిన యువకుడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ సంఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఫారిన్ పిల్లతో ఫేస్ బుక్ లవ్.. 11 ఏళ్ల...

January 30, 2023 / 10:49 AM IST

సీఎం కేసీఆర్ కార్యాలయం పేరిట భారీ మోసం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం పేరిట దంపతులు భారీ మోసం చేశారు. అమాయక ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయల మేర దండుకున్నారు. తమ పిల్లల భవిష్యత్ కోసం కష్టపడి సంపాదించిన సొమ్ము వారికి అప్పగించిన తల్లిదండ్రులు నిలువునా మోసపోయారు. మేనేజ్ మెంట్ కోటాలో ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు ఇప్పిస్తామని చెప్పడంతో ఆ దంపతులకు లక్షలు, వేలల్లో ఇచ్చి నట్టేటా మునిగారు. వారు బిచాణా ఎత్తేయడంతో లబోదిబోమంటూ బాధితులు పోలీస...

January 29, 2023 / 04:42 PM IST

అప్పు తీసుకున్న వాళ్లు తిరిగి చెల్లించడం లేదని భార్యను చంపి వ్యాపారి ఆత్మహత్య

మధ్యప్రదేశ్ లోని పన్నాలో దారుణం చోటు చేసుకుంది. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్లు తిరిగి చెల్లించడం లేదని జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యాపారి తన భార్యను చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ముందు ఇది హత్యగా భావించిన పోలీసులు.. దర్యాప్తు చేస్తుండగా సూసైడ్ నోట్ దొరికింది. అందులో ఆ వ్యాపారి పలు విషయాల గురించి ప్రస్తావించాడు. ఆ వ్యాపారి పేరు సంజయ్ సేత్. ఆయన భగేశ్వర్ ధామ్ బాబా భక్తుడు. గురూజీ [&he...

January 29, 2023 / 03:08 PM IST

యూపీ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలా బెహ్రైచ్ జాతీయ రహదారిపై స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారులో స్కూటీ ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు పాదాచారులను బలంగా ఢీకొట్టింది. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆ...

January 29, 2023 / 12:09 PM IST