కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన శనివారం రాత్రి కుంగిపోయింది. అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.
బీఎస్ఎఫ్ దళాలు మరోసారి పెద్ద ఎత్తున అక్రమంగా గోల్డ్ తరలిస్తున్న దుండగులను పట్టుకున్నారు. వారి నుంచి ఏకంగా 2.5 కిలోల గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని ఇండో బోర్డర్ సరిహద్దు వద్ద చోటుచేసుకుంది.
ఛత్తీస్గఢ్లోని మోహ్లా-మాన్పూర్ జిల్లా సర్ఖేడాలో నక్సలైట్ల కాల్పుల్లో బీజేపీ నేత బిర్జు తారామ్ మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నరకు జరిగిన కాల్పుల్లో ఈ ఘటన జరిగింది. అయితే ఇటివల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ వచ్చి నక్సెలైట్లను అణచి వేస్తామని చెప్పిన ఒకరోజు తర్వాతే ఇది జరగడం విశేషం.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)ని మోసం చేసి ముందుగానే టోల్ వసూలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు అతని బ్యాంక్ బ్యాలెన్స్, ఖాతాలను సీజ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కట్టిన ట్రాఫిక్ చాలన్ల డబ్బులు పక్కదారి పట్టాయి. అయితే వీటిని ఏకంగా ఓ ప్రభుత్వ అధికారి అల్లుడే పక్కదారి పట్టించడం విశేషం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 36 కోట్ల రూపాయలు పక్కకు మళ్లాయి. వీటిని ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన జయప్రదకు మద్రాసు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈఎస్ఐ కేసులో ఆమెకు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షను రద్దు చేయమని ఆమె కోర్టును సంప్రదించగా.. ఆమెకు భారీ షాక్ ఇచ్చింది.
భార్య రీల్స్ పిచ్చి భరించలేక, ఆ రీల్స్ చూసి తన భార్యను అందరూ చెడుగా మాట్లాడుకోవడం సహించలేక మనస్తాపానికి గురైన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొంత మంది పోలీసులు తమ వికృత చేష్టలను బయటపెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలను టార్గెట్ చేసి వారిని లోబరుచుకుంటారు. అలాంటి ఓ పోలీసు చీకటి కోణాన్ని తన భార్య బయటపెట్టి అతను అరెస్టు అయ్యేలా చేసింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ప్రమాదం ఎటు నుంచైనా పోంచి ఉండోచ్చు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని పెద్దలు అంటుంటారు. ఈ వీడియో చూస్తే నిజమే అనిపిస్తుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతాయి. ఫుట్ పాత్పై నడుచుకుంటు వెళ్తున్న వ్యక్తులపై కూడా కారు దూసుకెళ్లింది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
హైదరాబాద్లో మీరు ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే పర్మిషన్ కోసం లక్ష రూపాయలు రెడీ చేసుకోండి. అదెంటీ అనుమతి కోసమే అంత అమౌంట్ ఇవ్వాలా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే తాజాగా సరూర్ నగర్ పరిధిలో ఓ అధికారి ఇదే విషయంలో లక్షన్నర లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
అయోధ్య రామమందిరం ప్రాంతంలో పూజారి హత్య కలకలం రేపింది. హనుమాన్ ఆలయంలోని పూజారిని గొంతు కోసి హత్య చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పూజారి శిష్యులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు.