ఇరాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపానికి ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో భవనాలు, ఇండ్లు, పలు ప్రభుత్వ కట్టడాలు నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 440 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైందని అధికారులు వెల్లడించారు. భూకంపం వల్ల ఖోయ్, అజర్ బైజాన్ ప్రావిన్స్ లోని పలు భవనాల...
మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వట్టి వసంత్ చికిత్స పొందుతూ కన్ను మూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వట్టి వసంత్కుమార్ స్వస్థలం ప.గో.జిల్లా పూండ్ల. 1955లో ఆయన జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు శాసనసభ సభ్యుడు వట్టి పని చేశారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ క...
మధ్యప్రదేశ్ లో రక్షణ శాఖకు చెందిన రెండు యుద్ద విమానాలు కుప్పకూలడం కలకలం రేపింది. మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కుప్పలకూలాయి. ఈ రెండు ఘటనలకు సంబంధించి సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గ్వాలియర్ ఎయిర్బేస్ నుంచి యుద్ధ విమానాల విన్యాసాలు జరుగుతుండగా.. మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ విమానాలు ఒకదానికొకటి ఢీక...
జార్ఖండ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ధన్బాద్లోని పురానా బజర్ లోని ఓ హాస్పిటల్ లో జరిగిన ఈ ప్రమాదంలో డాక్టర్ దంపతులతో సహా ఆరుగురు మృతి చెందారు. శుక్రవారం రాత్రి హజ్రా హాస్పిటల్లో జరిగిన ప్రమాదంలో మరొకొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు డాక్టర్ వికాస్ హజ్రా, అతని భార్య ప్రేమ హజ్రాతో పాటు మరికొందరు ఉద్యోగులు మరణించారు. మంటలు చెలరేగాక ఆర్పేయత్నం జరగకపోవటం..దట్టమైన పొగ అలుముకోవటంతో అందరూ ఊపిరి ఆ...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ ముందు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరుకాబోతున్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా వైఎస్సార్ సీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ రెండు సార్లు నోటీసులు జారీచేసింది. దర్యాప్తునకు హాజరుకావాలంటూ సూచించింది. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో ఇవాళ సీబీఐ ముందు కడప ఎంపీ మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రానున్నారు...
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై 22 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దిండోషి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలిక ఉండే ప్రాంతంలోనే ఉండే యువకుడు ఆమెపై కన్నేశాడు. అదును చూసి తనను గోరెగావ్ లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. ఆ తర్వాత తనను మళ్లీ తన ఇంటి వద్ద వదిలేశాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు […]
తండ్రి లేడు.. తల్లి కూలీ పనులు చేస్తూ కష్టపడి చదివిస్తోంది. బుద్ధిగా చదువుకుంటున్న అమ్మాయిని తోటి విద్యార్థులు కన్నేశారు. ఆమెను ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఆమెకు ప్రలోభాలు చూపించి లొంగ దీసుకున్నారు. పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాళ్లు మొక్కుతా వదిలేయండి అని బతిమిలాడినా వినలేదు. అడవికి తీసుకెళ్లి ఒక్కరు కాదు ఏకంగా ముగ్గురు అత్యాచారం చేశారు. పాశవికంగా ప్రవర్తించడ...
ఏపీలోని పల్నాడు జిల్లా లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు దగ్గర పెళ్లి కారును టిప్పర్ లారీ డీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలకి చేరుకుని పరిశీలించారు. అతి వేగమే ఈ ప్రమాదన్నికి కారణమని తెలుస్తుంది. కేసు నమోదు చేసుకుని...
ప్రేమ కోసం ఎంతటి సాహసమైనా చేయాలని అనిపిస్తుంది. ఇక మనసుకు నచ్చిన వాళ్లు చెబితే ఎంతటి పనులనైనా చేయడానికి వెనుకాడం. ఇక అమ్మాయి కోరితే అరక్షణంలో తీసుకుని ఇచ్చే ప్రియులు కూడా ఉంటారు. అట్లాంటి వ్యక్తే మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువకుడు. ప్రేయసి కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ప్రేయసి కోరిందల్లా తీసుకొచ్చి ఇచ్చేందుకు బైక్ దొంగతనాలు చేసి వాటిని అమ్మితే వచ్చిన డబ్బుతో ఆమె కోరికలన్నీ తీ...
కూతురు వయసయ్యే బాలికపై అత్యాచారం చేసి ఆపై బాలికను కర్కశంగా హత్య చేసిన నిందితుడికి ఉరి శిక్ష ఖరారైంది. మానవత్వం లేకుండా అభంశుభం తెలియని బాలికపై పాశవికంగా ప్రవర్తించిన నిందితుడికి ప్రకాశం జిల్లా కోర్టు మరణశిక్ష వేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఘటన జరిగిన రెండేళ్లకు అతడికి శిక్ష పడింది. ప్రకాశం జిల్లాలో 8 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన సంఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. కేసు నమోదు చ...
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర వేడుకలు అట్టహాసంగా నిర్వహించాల్సిన అధికారి కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. జీవితంపైనే విరక్తితో అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు రాసుకున్న లేఖలో ఆయన తెలిపాడు. అనారోగ్య సమస్యలు భరించలేక అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్...
Crime News : తమ దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని 16 ఏళ్ల బాలుడిని కొందరు యువకులు చంపేశారు. ఈ ఘటన ఢిల్లీలోని షాహ్ బాద్ డెయిరీ ఏరియాలో చోటు చేసుకుంది. వాళ్లు 16 ఏళ్ల బాలుడికి రూ.18 వేలు ఇచ్చారు. చాలా రోజులు అయినా ఆ బాలుడు వాళ్లకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న ఆ యువకులు అదును చూసి చంపేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు […]
పెళ్లికి సమయం ముంచుకొస్తుంది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.. పనులు వేగవంతం చేయాలని వరుడు కూడా ఓ చేయి వేశాడు. కుటుంబసభ్యులతో పాటు అతడు పనులు చేస్తున్నాడు. ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న ఆ యువకుడు కొద్దిసేపటికే కుటుంబాన్ని మొత్తం కన్నీటిలో ముంచి వెళ్లిపోయాడు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఆనందాలు సంతోషాలతో నిండాల్సిన ఆ ఇంట్లో గుండెశోకం మిగిలింది. ఈ సంఘటన తెలంగాణలోని ఆదిలాబ...
సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వందలు, వేల మంది రోజు తిరుగుతుంటారు. ఎవరైనా కథ వినకపోతారా? ఎవరైనా సినిమాల్లోకి తీసుకోకపోతారా? ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా? అంటూ ఫొటోలు, కథలు, రచనలు పట్టుకుని స్టూడియోలు, ప్రొడ్యూసర్, హీరోహీరోయిన్ల కోసం గాలిస్తుంటారు. ఈ సందర్భంగా కొందరి ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తుంటారు. అపాయింట్ మెంట్ కోసం కాళ్లరిగేలా తిరుగుతారు. అలాంటి అమాయకులను కొందరు మోసగాళ్లు చాలా సులువుగా మోసం చేసేస్...
మంచి ఉద్యోగం.. అందమైన భార్య. పెళ్లయి ఆర్నెళ్లు దాటింది. మిగతా అన్ని పనులు చూసుకుని తీరిగ్గా హనీమూన్ కు వెళ్దామని పక్కాగా ప్రణాళిక వేసుకున్నాడు. మలేసియాలో జాలీగా గడిపి వద్దామని ఆ యువకుడు కలలు గన్నాడు. అనుకున్నట్టే హనీమూన్ కోసం మలేసియా వెళ్లాడు. బాలీలో భార్యతో కలిసి సరదాగా తిరుగుతుండగా విధి కాటేసింది. రాకాసి సముద్రం అతడిని పొట్టన పెట్టుకుంది. ఎన్నో ఆశలతో వెళ్లిన ఆ యువకుడు శవమై హైదరాబాద్ కు చేరుకు...