JGL: ధర్మపురి పట్టణానికి చెందిన వేముల రాజేష్కు చెందిన 2 బొలెరో వాహనాల అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇంటి సమీపంలో నిలిపి ఉంచిన వాహనాల అద్దాలు పగులగొట్టడంతో పాటు టైర్లలో గాలి తీసివేసినట్లు తెలిసింది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై జి. మహేష్ తెలిపారు.
నిర్మల్ జిల్లాలో ఈనెల 22న ఆదివారం నిర్వహించే గురుకుల ప్రవేశ పరీక్ష అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో భోజన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. 5వ తరగతిలో ప్రవేశం కోసం జిల్లా వ్యాప్తంగా 6984 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
SDPT: పట్ట పగలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న శివరాత్రి దివాకర్ అనే దొంగను రాజగోపాల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నాగరాజుపల్లిలో తాళం వేసి ఉన్న ముక్కెర వెంకటేశం అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు బీరువాలో ఉన్న మూడు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు 24 గంటల్లోనే దొంగను అరెస్ట్ చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నరు.
ASF: జిల్లాలోని ST విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరంలో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని DTDO రమాదేవి ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు మార్చి 31వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ST విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
HNK: జిల్లాలోని న్యూశాయంపేట, అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఆమె ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్, R&B అధికారులకు సూచించారు.
NZB: గంజాయిని విక్రయిస్తున్న ముఠాలోని ఆరుగురిని బాల్కొండలో అరెస్ట్ చేసినట్లు CP సాయి చైతన్య తెలిపారు. మహమ్మద్ అమ్హద్ అలీ, మహమ్మద్ నయీమ్, చిల్వేరు మనోజ్ కుమార్, జక్కుల గోవింద్, ఆద్నాన్తో పాటు ఓ మైనర్ను అరెస్ట్ చేశామన్నారు. మున్ని, వహీద్ సుల్తాన్, సోఫియాన్, మోసిన్ పరారీలో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
WGL: తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు మరిపల్లి చందన, గోగుల సరిత వరంగల్ జిల్లాలో సందర్శించిన సందర్భంగా నిన్న కలెక్టరేట్లో కలెక్టర్ సత్య శారదను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో వరంగల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ వసుధ, సభ్యులు సుజాత, రామలీల తదితరులు ఉన్నారు.
KMM: ఖమ్మంలో రెవెన్యూ శాఖలో పదోన్నతులు పొందిన 15 మందికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నియామక పత్రాలు శుక్రవారం అందజేశారు. జవాబుదారీతనంతో పనిచేసి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని సూచించారు. డ్రాఫ్టింగ్, కంప్యూటర్ వినియోగంపై పట్టు సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ట్రెసా ప్రతినిధులు కలెక్టర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
NLG: గట్టుప్పల్ మండలం తేరట్ పల్లిలో శ్రీ మార్కండేయస్వామి 81వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
NLG: రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడికీ ప్రయత్నించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలన్నారు.
BDK: రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో విశ్రాంత ఏఆర్ ఎస్సై మైసయ్య మృతి చెందడంపై మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుమారు రూ.60 లక్షల బకాయిలు పెండింగ్లో ఉండటంతో, వైద్య ఖర్చులు భరించలేక ఆయన మరణించడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.
MHBD: రాష్ట్రంలో వచ్చేది BRS ప్రభుత్వమే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, రైతులు, మహిళల సమస్యలు వదిలిపెట్టి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కమిషన్ల కోసం కొట్లాడుతున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్, వైస్ చైర్మన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం సరికాదన్నారు.
SRD: జహీరాబాద్ నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశం. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో ఖాళీగా ఉన్న 500 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు జరగనున్నట్లు డీఆర్డీవో జ్యోతి తెలిపారు. అభ్యర్థులు ధృవీకరణ పత్రాలతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SRCL: గంభీరావుపేట మండల కేంద్రంలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఈనెల 26న మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ వి.విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనవచ్చని టాస్క్ కో ఆర్డినేటర్ జె.శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.
NGKL: నల్లమల్ల అటవీ ప్రాంతంలో అత్యంత అరుదైన నక్షత్రపు తాబేలు శుక్రవారం వెలుగుచూసింది. అడవిలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల నేపథ్యంలో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీడీఏ మెడికల్ ఆఫీసర్ కళ్యాణ్ సాగర్, బ్రహ్మగిరి నుంచి అచ్చంపేట వస్తుండగా రోడ్డుపై భారీ పరిమాణంలో ఉన్న ఈ తాబేలును గుర్తించారు.