• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వ్యభిచార దందా కట్టడి చేయాలని వినతి

WGL: రాయపర్తి మండలం మైలారం శివారులో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచార దందాను అరికట్టాలని శనివారం గ్రామస్థులు సర్పంచ్ చిర్ర వేణుకు వినతిపత్రం సమర్పించారు. ఈ దందా కారణంగా గ్రామ యువత దారితప్పుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీ సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

February 21, 2026 / 08:24 AM IST

అనధికారిక మార్కెటింగ్‌పై టీజీ-రెరాచర్యలు

HYD: పుప్పాలగూడలోని ప్రణీత్ కాన్‌సెప్ట్ అంబియన్స్ ప్రాజెక్టులో అనధికారిక మార్కెటింగ్‌పై టీజీ-రెరా కఠిన చర్యలు తీసుకుంది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే బ్లాకులను విక్రయానికి పెట్టినందుకు సదరు ప్రమోటర్‌పై రూ. 43.71 లక్షల ఫైన్ విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అలాగే నిర్మాణ ప్రగతికి సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించింది.

February 21, 2026 / 08:21 AM IST

మున్సిపాలిటీలో రూ.500 కోట్ల కుంభకోణం..?

NZB: 2014-25 మధ్య ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగిన రూ.500 కోట్ల అవినీతిపై విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైంది. ఇటీవల కమిషనర్ రాజు ఏసీబీకి చిక్కడంతో పాత అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ ఇంటి నంబర్ల కేటాయింపుపై అధికారులు ఆరా తీస్తున్నారు. సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.

February 21, 2026 / 08:17 AM IST

తక్షణమే రైతుబంధు విడుదల చేయాలి: హరీశ్ రావు

SDPT: మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 17వ తేదీన రైతుబంధు విడుదల చేస్తానని సీఎం రేవంత్ చెప్పారని, 20వ తేదీ వచ్చినా ఇప్పటికీ నిధులు జమ కాలేదని హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు నాట్లు వేసేటప్పుడా?, కోతల సమయంలోనా? ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు పంటలకు ఇవ్వలేదని, ఈసారి అయినా విడుదల చేస్తారా? అని నిలదీశారు.

February 21, 2026 / 08:17 AM IST

మాట నిలబెట్టుకున్న మాజీ మేయర్

KNR: కరీంనగర్‌లో ఎన్నికల హామీని నెరవేర్చిన మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ తన నిబద్ధతను చాటుకున్నారు. 58వ డివిజన్‌కు చెందిన మాడిశెట్టి రవీందర్ కుమార్తె వివాహానికి హాజరైన ఆయన, ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.25,000 నగదును ఆడబిడ్డ కట్నంగా అందజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హామీని అమలు చేశామన్నారు.

February 21, 2026 / 08:17 AM IST

అధికారులు సమన్వయంతో కృషి చేయాలని: కలెక్టర్

SRD: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ పీ.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి అధికారులు-ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెంపొందించాలన్నారు.

February 21, 2026 / 08:14 AM IST

ఆందోళన కలిగిస్తున్న మరణాలు..!

NLG: జిల్లాలో శుక్రవారం విషాదం నిండిన రోజుగా మిగిలింది. వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మామిడాలలో అప్పుల బాధతో సంతోష్ ఉరివేసుకోగా, తిట్టకుంటలో మానసిక స్థితి సరిగా లేక నర్సమ్మ నిప్పంటించుకుని మృతి చెందింది. నకిరేకల్‌లో గీత కార్మికుడు వెంకటేశం చెట్టుపై నుంచి పడి, మండలాపురంలో తల్లిదండ్రులు మందలించారని మహేష్ గడ్డిమందు తాగి మృతి చెందాడు.

February 21, 2026 / 08:14 AM IST

మత సామరస్యం.. మసీదుకు ఆర్థిక సాయం

RR: నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో కాంగ్రెస్ నాయకుడు మాణిక్యం మత సామరస్యాన్ని చాటుకున్నారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని మసీదు అభివృద్ధి కోసం ఆయన రూ. 30,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. సర్పంచ్ చేతుల మీదుగా ఈ మొత్తాన్ని మైనార్టీ కమిటీకి అందించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెబుతూ, భవిష్యత్తులోనూ తన వంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

February 21, 2026 / 08:11 AM IST

భక్తి మార్గంలో పయనించాలి: మున్సిపల్ ఛైర్మన్

ADB: ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని మున్సిపల్ ఛైర్మన్ బండారి అనుష అన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పల్లకి ఊరేగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మున్సిపల్ నూతన ఛైర్మన్‌గా ఎన్నికైన ఆమెను సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

February 21, 2026 / 08:11 AM IST

కబడ్డీ జట్టుకు కోచ్‌గా పండు రాథోడ్

NZB: మక్తల్‌లో ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్న ‘సీఎం-కప్’ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు కోచ్‌గా పండు రాథోడ్ నియమితులయ్యారు. పండు రాథోడ్ ప్రస్తుతం కాకతీయ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో జిల్లా జట్టు రాణించేలా ఆయన శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పండు రాథోడ్‌ను పాఠశాల యాజమాన్యం అభినందించినారు.

February 21, 2026 / 08:10 AM IST

ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం

SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామ సర్పంచ్ కట్కామ్ మల్లేశం సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో ఆడపిల్లల పెళ్లి జరిగితే రూ. 5016ల ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు గ్రామంలో ఇద్దరు ఆడపిల్లల పెళ్లిలకు రూ. 5016ల చొప్పున ఆర్థిక సహాయాన్ని శుక్రవారం రాత్రి అందజేశారు.

February 21, 2026 / 08:07 AM IST

‘రెండేళ్లుగా నిరాశ.. ఈసారైనా సాధించాలి’

VKB: గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో పదో తరగతి ఫలితాల్లో వికాబాదాబ్ జిల్లా రాష్ట్రస్థాయిలో అట్టడుగున నిలిచింది. గతేడాది 73.97 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇది రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువ. ఈసారి ఎలాగైనా మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యాశాఖ అధికారులు పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఈ ఏడాది ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు.

February 21, 2026 / 08:06 AM IST

వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ PHCలను ఏర్పాటు

MNCL: లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఆసుపత్రి వార్డులు, ల్యాబ్, రిజిస్టర్లు, మందుల నిల్వలు, పరిశీలించారు. ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ PHCలను ఏర్పాటు చేసిందన్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించి ప్రజల సంక్షేమం కొరకు చర్యలు తీసుకుంటుందన్నారు.

February 21, 2026 / 08:06 AM IST

‘నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్’

NRML: జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. వెంటనే వసూలు చేసేందుకు సోమవారం నుంచి నెల రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. పన్నులు చెల్లించని వారికి నోటీసులు అందించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

February 21, 2026 / 08:04 AM IST

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లకు నేటికి 13 ఏళ్లు

HYD: దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లు జరిగి నేటికి 13 ఏళ్లు. 2013 FEB 21న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ కేసులో NIA కోర్టు దోషులకు మరణశిక్ష విధించినప్పటికీ, న్యాయపరమైన కారణాలతో ఇప్పటికీ అమలు కాలేదు. తమకు ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

February 21, 2026 / 08:04 AM IST