HNK: జిల్లాలోని న్యూశాయంపేట, అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఆమె ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని మున్సిపల్, R&B అధికారులకు సూచించారు.