SRD: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25వ తేదీన కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి అడివయ్య మంగళవారం కోరారు. ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా దివ్యాంగులకు 6 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాకు దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
NZB: మోపాల్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కారోబార్స్, పారిశుద్ధ్య సిబ్బంది పెండింగ్ వేతనాలను చెల్లించాలని నిజామాబాద్ కలెక్టర్కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామపంచాయతీలో వేతనాలు లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు తెలిపారు. కుటుంబ సర్వే నిర్వహించి సంవత్సర కాలం గడుస్తున్నా ఎన్యుమరేటర్లు గౌరవ వేతనం అందలేదన్నారు.
SRPT: అధికారిక పర్యటనలో భాగంగా సోమవారం కోదాడకు వచ్చిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సామాన్య ప్రజలతో కలిసిపోయారు. రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిరిగి వెళ్తుండగా, దారిలో తల్లి ఒడిలో ఉన్న చిన్నారిని చూసి చిరునవ్వుతో పలకరించారు. పాప పేరు అడిగి తెలుసుకున్న కలెక్టర్, ఆమెను అంగన్వాడీకి పంపిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.
NLG: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు జరిగే పరీక్షల దృష్ట్యా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్-163 సెక్షన్ అమలు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. జిల్లాలోని 45 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు.
MBNR: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి ఇంటిపై దాడికి కార్యకర్తలను ప్రేరేపించారని సోమవారం MBNR ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. కామారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను ఎంపీ పరామర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిరాధార ఆరోపణలు చేయడం సులభమని, వాటిని రుజువు చేయాలేదంటే క్షమాపణ చెప్పాలన్నారు.
VKB: ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి నేడు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ డీఎం కృష్ణమూర్తి తెలిపారు. బస్సు సేవలు, ఇతర ఫిర్యాదుల కోసం ప్రయాణికులు ఉదయం నిర్ణీత సమయంలో 9959225253 నంబర్కు నేరుగా కాల్ చేసి సూచనలు ఇవ్వవచ్చని ఆయన పేర్కొన్నారు.
JN: లింగాల గణపురం మండలంలోని సిరిపురంలో విద్యుత్ షాక్తో రెండు మూగజీవాలు మృతి చెందాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం వెనుక ఉన్న విద్యుత్ స్తంభం వద్ద బర్ల ఐలయ్యకు చెందిన ఒక మేక, ఒక గొర్రె మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మరణించాయన్నారు.
RR: భూ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిరక్షణ కమిటీ ధర్మన్నగూడ గ్రామ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్కు వినతి అందజేశారు. మాజీ ఎంపీటీసీ గౌర మల్లేశ్ ప్రజలందరిని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలంతా కలిసి ఐక్యంగా పోరాడి ఆలయ భూమిని దక్కించుకోవాలని తెలిపారు. సభ్యులు శశిధర్ రెడ్డి, నరసింహ, ఇతరులన్నారు.
HYD: GHMC పరిధిలో సోమవారం రాత్రి వరకు పలుచోట్ల వర్షం కురిసింది. తిరిగి తెల్లవారుజాము నుంచి శివారు పెద్దఅంబర్పేట్, ఇబ్రహీంపట్నం పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నిన్న హస్తినాపురంలో 17.5MM, సులేమాన్నగర్లో 14.5MM, అత్తాపూర్ 13.5 MM వర్షం కురిసింది. వనస్థలిపురం ఎన్టీవో కాలనీ, శాస్త్రిపురం, సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ వద్ద 9.3MM వర్షపాతం నమోదైంది.
యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండి అవైస్ చిస్తీ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో 2026-27 వార్షిక బడ్జెట్ అంచనాలను ఆమోదించారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ‘దివ్యాంజన్ సెక్షన్ ‘ను ప్రారంభించారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖకు పంపాలని తీర్మానించారు.
NZB: తెలంగాణ రాష్ట్ర మార్కెట్ కమిటీ ఛైర్మన్ల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ముఖ్య సలహాదారు నరేందర్ రెడ్డికి మార్కెట్ కమిటీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫోరం అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి వినతిపత్రం అందజేశారు. యార్డుల అభివృద్ధి పనులు మంజూరులో జాప్యం, ఛైర్మన్ గౌరవ వేతనాలు అందకపోవడం వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.
SDPT: హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ కోసం 36 ఎకరాల భూమి కేటాయిస్తూ క్యాబినేట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం తెలిపారు. అలాగే చిగురు మామిడి మండల కేంద్రంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణానికి 3.12 ఎకరాలను దేవాదాయ శాఖకు కేటాయిస్తూ క్యాబినేట్ నిర్ణయం తీసుకుందన్నారు.
MBNR: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం,నిర్మాన్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నేడు ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీ (మహిళల)లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి మైత్రి ప్రియ తెలిపారు. ఎస్సెస్సీ, అంతకంటే పై విద్యార్హత కలిగిన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత తమ విద్యాసర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.
ADB: జిల్లాలోని ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ హాల్ టికెట్ అందజేయాలని PDSU జిల్లా కార్యదర్శి కుమ్ర అశోక్ తెలిపారు. ఫీజులు చెల్లించలేదని హాల్ టికెట్లు ఇవ్వకపోతే సంబంధిత యాజమాన్యాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్తో పరీక్ష రాసే అవకాశం కల్పించిందని తెలిపారు.
SRCL: వార్డు సభ్యులు పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో రాధా అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ఇటీవల నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ సమగ్ర అభివృద్ధిలో వార్డు సభ్యులు కూడా కీలక పాత్ర వహిస్తారని తెలిపారు.