• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: ఇల్లందు మండలం మాణిక్యరం గ్రామంలో శుక్రవారం సీతారామచంద్ర స్వామి వారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మనసారా కోరుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

February 20, 2026 / 12:46 PM IST

ఈ నెల 21న బడుల్లో పేరెంట్స్ మీటింగ్: డీఈవో

మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ నెల 21న పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆదేశించారు. నేపథ్యంలో పిల్లలకు ఇంటి వద్ద సహాయం ఎలా అందించాలన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా 10వ తరగతి, అలాగే 2వ, 3వ తరగతి ఎఫ్ఎల్ఎన్/ ఎఫ్ఎల్ఎస్ పరీక్షల డీఈవో సూచించారు.

February 20, 2026 / 12:44 PM IST

సిరిపురం యాదయ్య సేవలు మరువలేనివి. కాంగ్రెస్ నాయకులు

RR: తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, మహేశ్వరం నియోజకవర్గం నాగారం గ్రామానికి చెందిన సిరిపురం యాదయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.

February 20, 2026 / 12:43 PM IST

బురుగుపల్లిలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమం

KNR: గంగాధర మండలంలోని బురుగుపల్లి గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దులం కళ్యాణ్ ఆధ్వర్యంలో కిరాణా, చికెన్, మటన్ షాప్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్లాస్టిక్ కవర్లకు బదులుగా బయోడీగ్రేడబుల్ కవర్లు వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా MPDO ప్లాస్టిక్ వల్ల పర్యావరణం నష్టాలను వివరించారు.

February 20, 2026 / 12:43 PM IST

నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి బాంబ్ బెదిరింపు

HYD: నగరంలోని సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్‌తో కలిసి కోర్టు ప్రాంగణాన్ని పరిశీలిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఇలాంటి బెదిరింపు మెయిల్ వచ్చిన నేపథ్యంలో మళ్లీ అదే తరహా సందేశం రావడం ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

February 20, 2026 / 12:42 PM IST

ప్రైవేట్ టీచర్లకు ఇండ్లు కేటాయించండి..!

SRPT: తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జునకు వినతి పత్రం అందజేశారు. ఫణిగిరి రామస్వామి గట్టు వద్ద నిర్మించిన సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను, అర్హులైన ప్రైవేట్ ఉపాధ్యాయులకు కేటాయించాలని రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు మున్సిపల్ వైస్ చైర్మన్‌ను కోరారు. అనంతరం ఆయనను ప్రైవేట్ ఉపాధ్యాయులు సన్మానించారు.

February 20, 2026 / 12:42 PM IST

HYDలో పేరుకే ఉచిత పార్కింగ్!

HYD: జీవో నం. 15 ప్రకారం మాల్స్ లేదా మల్టీప్లెక్స్‌లో మొదటి 30 నిమిషాలు పార్కింగ్ పూర్తిగా ఉచితం. ఒకవేళ అక్కడ షాపింగ్ చేస్తే గంట వరకు ఉచితంగా ఉండాలి. కానీ, మాదాపూర్, గచ్చిబౌలి పరిధిలోని కొన్ని ప్రధాన మాల్స్ ‘డిజిటల్ ఎంట్రీ’ పేరుతో వాహనం లోపలికి వెళ్లకముందే సమయాన్ని లెక్కిస్తున్నాయి. లోపల సమయం వృథా అయ్యేలా చేసి రూ. 50 నుంచి రూ. 100 వసూలు చేయడం గమనార్హం.

February 20, 2026 / 12:40 PM IST

జమ్ములమ్మను దర్శించుకున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్

GDWL: నడిగడ్డ భక్తుల ఆరాధ్యదైవం, జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయాన్ని గద్వాల నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు శుక్రవారం సందర్శించారు. ఆలయ ఈవో పురందర కుమార్, అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు వారికి శ్వేత వస్త్రాలు సమర్పించారు.

February 20, 2026 / 12:39 PM IST

నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

HYD: నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. దిల్‌సుఖ్ నగర్‌లోని హైదరాబాద్-2 డిపో నుంచి రాకపోకలు సాగించే బస్సులకు సంబంధించి ప్రయాణికుల నుంచి సలహాలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు నేడు సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు 9959226249 నంబర్‌కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.

February 20, 2026 / 12:35 PM IST

ఆలయాన్ని సందర్శించిన ఛైర్మన్

BHPL: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఛైర్మన్ పరిశీలించారు. అనంతరం కాసేపు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో ఛైర్మన్ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

February 20, 2026 / 12:32 PM IST

‘పశు వైద్యశాల నూతన భవనం నిర్మించండి’

BDK: జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో పశు వైద్యశాల శిథిలావస్థకు చేరింది. దీంతో పశు వైద్య సిబ్బంది పశువులను తీసుకొచ్చిన రైతులు లోపలికి వెళ్లాలంటే భయపడుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న పశు వైద్యశాలను తొలగించి నూతన పశువైద్యశాలను నిర్మించాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ ఇవాళ ప్రభుత్వాన్ని కోరారు.

February 20, 2026 / 12:31 PM IST

‘అభివృద్ధిలో భాగస్వాములు కావాలి’

MNCL: గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులు భాగస్వాములు కావాలని జన్నారం మండలం ఎంపీవో జలంధర్ సూచించారు. జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు పోన్కల్ రైతు వేదికలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగింది. పలు విషయాలను వార్డు సభ్యులకు ఎంపీవో వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

February 20, 2026 / 12:30 PM IST

గోదావరి జలాలకు పూజలు చేసిన ఎమ్మెల్యే

SDPT: జిల్లా రాయపోల్ మండలం మంతూర్–అనాజీపూర్ శివారులో 13డి కాలువలో గోదావరి జలాలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్యతో కలిసి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం నీటి ప్రాజెక్టులు నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్వహణ కూడా చూసుకోలేకపోతుందన్నారు.

February 20, 2026 / 12:29 PM IST

భూతగాడ కేసులో నిందిత దంపతులకు 7 ఏళ్ల జైలు శిక్ష

BHPL: భూతగాడ నేపథ్యంలో జరిగిన హత్యాయత్నం కేసులో గొర్లవీడు గ్రామానికి చెందిన మామిడి రాజకుమార్, అతని భార్య రమను దోషులుగా నిర్ధారించిన జిల్లా అసిస్టెంట్ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులిద్దరికీ ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనంగా ఇద్దరికీ చెరో రూ. 5 వేల చొప్పున మొత్తం రూ. 10 వేల జరిమానా విధించినట్లు ఇవాళ SP సంకీర్త్ తెలిపారు.

February 20, 2026 / 12:29 PM IST

రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన MLA

ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను MLA పాయల్ శంకర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో స్రవంతితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రనమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

February 20, 2026 / 12:29 PM IST