BDK: పాల్వంచలోని శ్రీనివాస కాలనీకి వెళ్లే రోడ్డుపై నెలలుగా గుంతలు ఉన్నాయి. ప్రతి రోజు ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై స్థానికులు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు కనిపించలేదు. అయితే రేపు మంత్రి తుమ్మల పర్యటన ఉండటంతో గుంతలను అధికారులు పూడ్చడంపై “మా బతుకులు అంత విలువలేనివేనా”..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
SDPT: మల్లన్న సాగర్ కాలువ ద్వారా చింతమడక పెద్ద చెరువుకు నీటిని విడుదల చేయాలని కోరుతూ శనివారం రైతులు సిద్దిపేట-హుస్నాబాద్ రహదారిపై ధర్నా చేపట్టారు. సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రహదారిపై బైఠాయించడంతో వాహనాలు కాసేపు నిలిచిపోయాయి.
WGL: తెలంగాణలో ధాన్యం, పత్తి రవాణాకు అవసరమైన ‘రైల్వే రేక్స్’ను సమృద్ధిగా కేటాయించాలని ఇటీవల ఎంపీ డా.కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ ఎంపీ కావ్యకు లేఖ ద్వారా “రైల్వే రేక్స్”ను సమృద్ధిగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రూల్ 377 కింద 2025 DEC- 9న ఎంపీ కావ్య ఈ అంశాన్ని లోక్ సభలో ప్రస్తావించారు.
వనపర్తి ఎమ్మెల్యే మెఘా రెడ్డి అమ్మపల్లి గ్రామంలోని శ్రీనివాస్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు. శ్రీనివాస్ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన అమ్మపల్లి గ్రామంలో శనివారం జరిగాయి. ఆయన మరణం దిగ్బంధికి గురి చేసింది. అతని జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు. ఆస్తులు కంటే ఆప్తులను సంపాదించుకోవడమే అసలైన జీవితం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
MBNR: ఫుట్ పాత్ ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని మున్సిపల్ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి ఆక్రమణలను ఆయన పరిశీలించారు. ఆక్రమణలు ఇలాగే కొనసాగితే ప్రజలకు ఎంతో ఇబ్బంది అవుతుందని వెల్లడించారు. ఆక్రమణలు చేయకుండా వ్యాపారం చేయాలన్నారు.
SRPT: సూర్యాపేట మున్సిపాలిటీలో పారిశుధ్యం పడకేసింది. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కేవలం ఆర్భాటాలకే పరిమితమైందని జనం మండిపడుతున్నారు. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి, మురుగు కాలువలు అధ్వానంగా మారాయి. దోమల వృద్ధి, దుర్వాసనతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అధికారులు ఫోటోలకు ఇస్తున్న ప్రాధాన్యత సమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
MDK: శివంపేట్ మండలంలోని మక్దుంపూర్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి, మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆధునిక వసతులతో గ్రామాలను తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కల్లూరి హరికృష్ణ పాల్గొన్నారు.
SRD: కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులను శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్ఆర్ఈజీఎస్ కింద నియోజకవర్గంలో రోడ్ల కోసం రూ. 2 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
NGKL: వచ్చే బడ్జెట్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని కోరుతూ జిల్లా DYFI ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి శనివారం వినతి పత్రం అందజేశారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి, యువత సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
RR: శేరిలింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కూమర్ యాదవ్ లబ్ధిదారులకు CMRF చెక్కులను అందజేశారు. సీఎం సహాయనిధి పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు.
KMR: జుక్కల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు. లబ్ధిదారుల కుటుంబసభ్యులతో కలిసి పూజలో పాల్గొన్న ఆయన, శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు.
HNK: పరకాల పట్టణ కేంద్రంలోని M.N రావు గార్డెన్స్లో శనివారం విష్ణుప్రియాంక-అరవింద్ వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
NRML: గత ఆరు నెలలుగా సరైన విధి విధానాలు లేక లైసెన్సుడ్ సర్వేయర్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని జిల్లా లైసెన్సుడ్ సర్వేయర్ల కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం ఎమ్మెల్యే ఏలేటికి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6500 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యామని, ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని కుసుమరామయ్య ఉన్నత పాఠశాల, నెహ్రూ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ చేశారు.
JGL: గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సిన్ ఎంతో అవసరమని జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. శనివారం రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్ సెంటర్ను ఆయన తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శ్రీకాంత్, ల్యాబ్ టెక్నీషియన్, డీఈవో,ఏఎన్ఎo పాల్గొన్నారు.