• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బషీరాబాద్‌లో సూచిక బోర్డులు లేక ప్రయాణికుల తికమక

VKB: బషీరాబాద్ మండల కేంద్రంలోని రైల్వే గేట్ సమీపంలో సూచిక బోర్డులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మూలమలుపు నుంచి జీవంగి, ఇందర్చేడు, నవాంగి గ్రామాలకు వెళ్లే మార్గాలు ఉండటంతో కొత్త వాహనదారులు ఏ దారి ఎటువైపు వెళ్తుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

February 23, 2026 / 08:02 AM IST

కుమ్మెర ఘటనపై కేశంపేటలో కొవ్వొత్తుల ర్యాలీ

RR: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో రజక కుటుంబంపై దాడి చేసి పసికందును హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కేశంపేటలో BC, SC, ST-JAC, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాధితులకు న్యాయం చేసి మర్డర్ కేసు నమోదు చేయాలని నాయకులు కోరారు. మహిపాల్ మహారాజ్, రాములు, రమేశ్ తదితరులు ఉన్నారు.

February 23, 2026 / 08:02 AM IST

ఉచిత శిక్షణకు .. నేడే లాస్ట్

MBNR: జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్‌లో DDU -GKY& స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో యువతులకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కో-ఆర్డినేటర్ రవి తెలిపారు. టెన్త్ పాసైన వారు అర్హులని, ఎంపికైన వారికి ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజనం, మెటీరియల్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ నెల 23 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

February 23, 2026 / 08:02 AM IST

గ్రామ పాలనపై ‘సర్పంచ్’లకు స్పెషల్ క్లాస్..

MNCL: గ్రామ పంచాయతీల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా జన్నారం మండల సర్పంచులు సిద్ధమయ్యారు. మంచిర్యాల ఇంజనీరింగ్ కళాశాల వేదికగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న ‘సర్పంచుల శిక్షణ తరగతుల’ను సర్పంచులందరూ ఏకతాటిపైకి వచ్చి విజయవంతం చేయాలని జన్నారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుదిరే వెంకన్న కోరారు.

February 23, 2026 / 08:02 AM IST

మహిళా సంఘ భవనాలలో మరుగుదొడ్లు నిర్మిస్తాం: DRDO

ASF:మహిళా సంఘ భవనాల నమూనాలో మరుగుదొడ్ల నిర్మాణానికి చోటు లేని విషయం వాస్తవమేనని ఆసిఫాబాద్ జిల్లా DRDO దత్తారావు ప్రకటనలో తెలిపారు.కానీ మహిళలు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్వచ్చ భారత్ మిషన్లో భాగంగా పంచాయతీల నుంచి తీర్మానాలు స్వీకరించి మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. ఇప్పటికే దాదాపు అన్నిచోట్ల భవనాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.

February 23, 2026 / 08:01 AM IST

వైభవంగా జాతర ఉత్సవాలు ప్రారంభం

PDPL: రాయికల్ మండలం కట్కాపూర్, బీర్పూర్ మండల పరిధిలోని రంగాసాగర్, కండ్లపెళ్లి, మంగెల గ్రామాల సరిహద్దుల్లో వెలసిన శ్రీ గొల్లకేతమ్మ మల్లన్న స్వామి జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా వచ్చి మల్లన్నకు నైవేద్యం సమర్పించగా, లగ్న పట్నం కార్యక్రమం కన్నుల పండుగలా సాగింది.

February 23, 2026 / 08:01 AM IST

పెద్దమల్లారెడ్డి—జేబీఎస్‌కు ఎక్స్ ప్రెస్ బస్సు ప్రారంభం

KMR: పెద్దమల్లారెడ్డి నుంచి HYD జేబీఎస్‌కు ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసు ప్రారంభం కావడం గ్రామ ప్రజలకు ఊరటగా మారింది. ప్రతిరోజూ ఉదయం 6:10 గంటలకు బయలుదేరి రామాయంపేట మీదుగా ఉదయం 8:30 గంటల వరకు జేబీఎస్ చేరుకుంటుంది. ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల కోసం వెళ్లేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది.

February 23, 2026 / 07:55 AM IST

‘రేంజ్ పరిధిలోనే పెద్దపులి సంచారం’

ASF: సిర్పూర్(టి) అటవీశాఖ రేంజ్ పరిధిలోనే పెద్దపులి సంచరిస్తోంది. దీంతో అటవీశాఖ అధికారులు వాటి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రేంజ్ పరిధిలో సంచరిస్తున్న పెద్దపులులను అధికారులు, టైగర్ ట్రాకర్స్, వాచర్స్ నిత్యం ట్రాకింగ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతాలకు పశువులు,మేకలు తీసుకెళ్లద్దని, ఒంటరిగా వెళ్లొద్దని వద్దని సూచిస్తున్నారు.

February 23, 2026 / 07:47 AM IST

నేడు యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం

KMR: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి 1:00 వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణి కి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

February 23, 2026 / 07:46 AM IST

“బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలి”

BHPL: కుమ్మెర జాతరలో FEB 18న అగ్రకుల రెడ్ల దాడిలో రెండు నెలల పసిపాప మౌనిక మరణాన్ని నిరసిస్తూ BHPL జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి ST, SC, JAC, DSP ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దోషుల పై బలమైన సెక్షన్లు పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్షించాలని, మౌనిక కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 07:40 AM IST

ఏక్ మామిడిలో వీధిలైట్లు లేక ప్రజల ఇబ్బంది

VKB: ఏక మామిడిలో వీధిలైట్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. సాయంత్రం అయిందంటే ఇంట్లో నుంచి బయటకు రావాలంటే లైట్లు లేక అపరిచితులును గుర్తించలేకపోతున్నామని వాపోయారు. వేసని సమీపిస్తున్న వేళ విష సర్పాల సంచారం పెరిగిందని, వాటి నుంచి రక్షించుకోవాలంటే వీధి లైట్లు ఉండాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

February 23, 2026 / 07:38 AM IST

నేడు సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

MBNR: నవాబ్ పేట మండల కేంద్రంలోని మార్కెట్ సమీపంలో సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తులసీరామ్ తెలిపారు. మండల పరిధిలోని ఎస్టీ సామాజిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం పిలుపునిచ్చారు. ఉత్సవానికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు.

February 23, 2026 / 07:35 AM IST

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి : జాజుల

NGKL: కుమ్మెర మల్లన్న జాతరలో అగ్రకుల వారు జరిపిన దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, నష్టపరిహారం ఇవ్వాలన్నారు. బాధితులపై FIR నమోదు చేయడం దుర్మార్గమని ఆగ్రహించారు.

February 23, 2026 / 07:33 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. వాగులో పడిపోయిన బస్సు

ADB: ఉట్నూర్ మండలంలో సోమవారం ఉదయం షాంపూర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో పడింది. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను స్థానికులు వెంటనే రక్షించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్తా లేదా సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ​ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 07:33 AM IST

లింగమంతుల గుట్ట జాతరకు సర్వం సిద్ధం

NLG: ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా జరిగే నిడమనూరు (M) ఎర్రబెల్లి లింగమంతుల జాతరకు గుట్ట ముస్తాబైంది. అభివృద్ధి పనులు పూర్తికావడంతో లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తారని ఆలయ ఛైర్మన్ వెంకన్న, సర్పంచ్ మధు తెలిపారు.

February 23, 2026 / 07:32 AM IST