KMM: సత్తుపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు సకాలంలో అందడమే లక్ష్యంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి శుక్రవారం అధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు.
HNK: సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కలిశారు. వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాల, MGM దవాఖానాల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం ప్రకటించిన ఎన్ఆర్ఐ వైద్యుడు డాక్టర్ సుజిత్ రెడ్డిని సీఎం అభినందించారు. వరంగల్ ప్రాంతంలో వైద్య సేవల స్థాయిని మరింత పెంచే దిశగా ప్రభుత్వం కూడా అవసరమైన సహకారం అందిస్తుందని సీఎం అన్నారు.
WGL: గంగదేవిపల్లి, సింగ్యతండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లును పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, పేద ప్రజల సొంత ఇంటి కళ ప్రజా ప్రభుత్వంలోనే నెరవేరుతోందని, ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.
WGL: గంగదేవిపల్లి, సింగ్యతండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లును పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, పేద ప్రజల సొంత ఇంటి కళ ప్రజా ప్రభుత్వంలోనే నెరవేరుతోందని, ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.
పెద్దపల్లి పట్టణంలోని కూనారం ఆర్ఓబి అప్రోచ్ రోడ్డు పనులు వేగిరం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆయన ఆర్వోపీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నెల రోజులలోపు అండర్ పాస్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఆర్వోబీ పూర్తయ్యలోపు అప్రోచ్ రోడ్డు పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని రైల్వే మరియు ఆర్& బీ అధికారులను ఆదేశించారు.
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని 6, 11, 13, 20వ వార్డులలో మున్సిపల్ ఛైర్మన్ భర్త ఆనంద్ కుమార్ వైస్ ఛైర్మన్ శానవాజ్ ఖాన్తో కలిసి శుక్రవారం పర్యటించారు. అనంతరం వార్డులలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.
MNCL: శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలో శుక్రవారం సింగరేణి యాజమాన్యం, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులకు మధ్య స్ట్రక్చర్ సమావేశం జరిగింది. జీఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న 10 ప్రధాన సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జీఎం తెలిపారు. సమావేశంలో నాయకులు కిషన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
BDK: కొత్తగూడెం కార్పొరేషన్ పేరును ‘కొత్తగూడెం-పాల్వంచ కార్పొరేషన్’గా మార్చాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, సుజాతనగర్లోని 7 గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, పాల్వంచ పేరు చేర్చాలని అక్కడి ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
WNP: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబంపై దాడి చేసి 2 నెలల పసికందు మరణానికి కారణమైన అగ్రకుల కుల దృహంకారులను అరెస్ట్ చేయాలని ఆదర్శ్ నగర్ కాలనీలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల మాట్లాడుతూ.. ఈ నెల 15 నుంచి జరుగుతున్న కుమ్మెర గ్రామ ఉత్సవాలలో ఆలయంలోకి ప్రవేశించకుండా రజకులను అడ్డుకోవడం అమానుషం అన్నారు.
SRCL: రైతుల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం అని సర్పంచ్ మామిడి రాజు అన్నారు. మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అన్నపూర్ణ జలాశయం ధ్వారా నీరు శుక్రవారం ఇల్లంతకుంట బిక్క వాగులోకి ప్రవేశించడంతో గ్రామంలో, రైతులలో ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
JGL: గ్రామాల్లో పచ్చదనంతో పాటు పర్యావరణ పరిరక్షణకు చెట్లు నాటేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ సంధి రాజమణి అన్నారు. శుక్రవారం పెగడపల్లి మండలం నరసింహునిపేటలో ఎస్సారెస్పీ ప్రధాన కాలువ వెంట మొక్కలను నాటారు. మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
WNP: పెబ్బేరు మండలంలోని చెంచువాడ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ‘స్వయం పరిపాలన దినోత్సవం’ జరిగింది. 20 మంది విద్యార్థులు జిల్లా, మండల అధికారులు, ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. హెచ్ఎం చిన్నరాములు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం విద్యార్థుల సహజ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను వెలికితీస్తుందని తెలిపారు.
ASF: శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును శుక్రవారం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్తో పాటు కాగజ్నగర్ మున్సిపల్ ఛైర్పర్సన్ షాహిన్ సుల్తానా, మాజీ చైర్మన్ దస్తగిరి, కౌన్సిలర్లు జ్యోతి, ఎంజి శారద సంతోష్, వసీమ్ మునీస్ షబీర్, దుర్గం సూరజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు.