• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కుల గణన సర్వే రెమ్యూనరేషన్ చెల్లించాలని విన్నపం

సంగారెడ్డి: 2024 నవంబర్‌లో కుల గణన సర్వే చేపట్టిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ వెంటనే విడుదల చేయాలని సిర్గాపూర్ PRTU మండల శాఖ ఆధ్వర్యంలో MPDO ఆఫీసులో సూపరింటెండెంట్‌కు శనివారం వినతి పత్రం అందించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాలని మండల శాఖ అధ్యక్షులు కర్ర నర్సింగ్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

February 28, 2026 / 04:31 PM IST

‘మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతు చేసి నీళ్లు ఇవ్వాలి’

వనపర్తి పట్టణం 9వ వార్డు కలెక్టర్ ఆఫీస్ రోడ్డులో పాడైన మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతు చేసి నీళ్లు ఇవ్వాలని బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కుమార్ మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. డ్రైనేజీల నిర్మాణం సందర్భంగా ఏడాది క్రితం పైప్ లైన్ పగిలిపోయి నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే పైప్ లైన్ మరమ్మత్తు చేసి తాగునీరు అందించాలని కోరారు.

February 28, 2026 / 04:30 PM IST

ఇమాంపూర్‌లో పౌర హక్కుల దినోత్సవం

MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో సివిల్ రైట్స్ డే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులు అందరికీ వెనుకబడిన తరగతుల కులాలకు సంబంధించి వారికి ఉన్న హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ బక్క స్వరూప, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

February 28, 2026 / 04:30 PM IST

సర్పంచుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం

NLG: జిల్లాలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శంకర్ నాయక్‌లకు సర్పంచులు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవరకొండ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్ మాట్లాడుతూ.. SSR రేట్లను పెంచాలని కోరారు. గౌరవ వేతనం రూ. 10 వేలకు పెంచాలన్నారు.

February 28, 2026 / 04:29 PM IST

యువత పాత్ర అత్యంత కీలకం: మేయర్

KNR: స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్ కే.రామకృష్ణ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన “50 సంవత్సరాల అత్యవసర పరిస్థితి-నేర్చుకోవలసిన పాఠాలు” అంశంపై వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 జిల్లాస్థాయి ఉపన్యాస ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న KNR మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యసాధనలో యువత పాత్ర కీలకమన్నారు.

February 28, 2026 / 04:29 PM IST

ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

JN: చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవాన్ని నేడు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి ఎంపీ కడియం కావ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిల్పూర్ గుట్ట ఆలయం ప్రాంత ప్రజలకే కాకుండా పరిసర జిల్లాల భక్తులకు కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోందని, ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తానన్నారు.

February 28, 2026 / 04:29 PM IST

కాంగ్రెస్‌లో చేరిన BRS నాయకులు

PDPL: గోదావరిఖని పట్టణం 8వ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం భాగ్యలక్ష్మి- తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో BRS పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. రామగుండం MLA రాజ్ ఠాకూర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

February 28, 2026 / 04:28 PM IST

పేరుకు మాత్రమే పేదల పార్టీ.. చేతల్లో మాత్రం రాక్షస పార్టీ: ఈటల

KMM: కనీస కనికరం లేకుండా పేదల ఆవాసాలను కూల్చివేసి తప్పు జరిగినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా బాధితులకు క్షమాపణ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పేదలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ఈ పార్టీ పేరుకు మాత్రమే పేదల పార్టీ అని చేతల్లో మాత్రం రాక్షస పార్టీ అని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని పేర్కొన్నారు.

February 28, 2026 / 04:28 PM IST

శాయంపేటలో వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమం..

HNK: శాయంపేట రైతు వేదికలో పలు గ్రామాల వార్డు మెంబర్లకు 24వ తేదీ నుండి నేటి వరకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో వార్డు మెంబర్ల పాత్ర, ఇతర అంశాలపై ఐదు రోజులపాటు వార్డ్ మెంబర్లకు అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు మెంబర్లకు నేడు మండల అధికారులు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.

February 28, 2026 / 04:27 PM IST

మార్చి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా మార్చి 31వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు వర్తిస్తాయని SP నితిక పంత్ శనివారం ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధం అన్నారు. చట్టపరమైన జారీచేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులు అవుతారని సూచించారు.

February 28, 2026 / 04:26 PM IST

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎంపీ నగేష్

ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ సూచించారు. శనివారం పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షాతో కలిసి మాట్లాడారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

February 28, 2026 / 04:25 PM IST

అంగన్వాడీలో గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాం

NZB: ధర్పల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం ‘అంగన్వాడీ పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 3-6 ఏళ్ల చిన్నారులకు ప్రీ-స్కూల్ శిక్షణ, పోషకాహారం, ఆరోగ్యలక్ష్మి పరీక్షలపై అవగాహన కల్పించారు. గ్రాడ్యుయేషన్ డే, ర్యాలీల ద్వారా పిల్లలను పాఠశాలలకు సిద్ధం చేసే అంశంపై తల్లిదండ్రులకు వివరించారు.

February 28, 2026 / 04:24 PM IST

‘సమాజ శ్రేయస్సు కోసం పనిచేసేది పోలీసులే’

MNCL: తమ కుటుంబ క్షేమం కన్నా సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్‌లో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను శనివారం ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులు అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు.

February 28, 2026 / 04:22 PM IST

కరీంనగర్ నుంచి గోవా టూర్ ప్యాకేజీ ఏర్పాటు

KNR-2 డిపో గోవా టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు డి ఎ. శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో ఉడిపి, ముఖంబికా అమ్మవారి దర్శనం, మృడేశ్వర్, గోకర్ణ టెంపుల్స్ దర్శనం, గోవా బీచ్‌లో ముఖ్య ప్రదేశాలు ఉన్నాయన్నారు. మార్చి 6న సా.4 గం.కు కరీంనగర్ నుంచి బయలుదేరి తిరిగి మార్చి 10న కరీంనగర్ చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.5,500, పిల్లలకు రూ.4,150 నిర్ణయించామన్నారు.

February 28, 2026 / 04:22 PM IST

అదుపుతప్పి ట్రాలీ బోల్తా.. డ్రైవర్కు గాయాలు

MHBD: మరిపెడ పట్టణ కేంద్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మరిపెడ నుంచి MHBD జిల్లాకు వెళ్తున్న ఓ ట్రాలీ అదుపుతప్పి జాతీయ రహదారిపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన వాహనాదారులు గాయపడిన డ్రైవర్ను ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 28, 2026 / 04:21 PM IST