WGL: దీర్ఘకాలంగా విధులకు హాజరుకాని ఉమ్మడి వరంగల్ జిల్లాలో 17మంది వైద్యులను సేవల నుంచి తొలగిస్తూ డిఎంఈ నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో హనుమకొండ ప్రసూతి ఆసుపత్రి, ఎంజీఎం ఆసుపత్రి, జనగామ, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో పనిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అలాగే కాకతీయ వైద్య కళాశాలకు ఎంపికై విధుల్లో చేరని పలువురు వైద్యులను కూడా ఈ జాబితాలో ఉన్నారు.
SDPT: గజ్వేల్ 17వ వార్డులోని బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ పద్మాబాయ్ సందర్శించారు. దవాఖానలోని వైద్య సదుపాయాలను పరిశీలించి, ప్రజలు వీటిని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, కేంద్రం నిర్వహణ తీరును తనిఖీ చేశారు.
MBNR: డీసీసీబీ అభివృద్ధి ప్రణాళిక లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలను అనుసంధానం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ రమాకాంత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
KMR: కామారెడ్డి జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీ ఏర్పట్లు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలు, సలహాలు కు 9866143782, 9948164514 నంబర్కు కాల్ చేయాలన్నారు.
HNK: జిల్లాలోని ఐదుగురు దివ్యాంగులకు WGL పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాంకేతికత దివ్యాంగుల సాధికారతకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు.
SRD: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్పై మాజీ మంత్రి హరీశ్రావు చేసిన విమర్శలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో పనులు 50% కూడా పూర్తికాలేదని, అశాస్త్రీయంగా వ్యయం పెంచారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రూ. 300 కోట్లు ఆదా చేసి పనులు వేగవంతం చేసిందన్నారు. 35 విభాగాలతో, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్, కేన్సర్ చికిత్స త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
HYD: ప్రకృతి వైపరీత్యాల సమయంలో యువ ఆపద మిత్రుల సేవలను వినియోగించుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. యువ ఆపదమిత్ర పథకంలో భాగంగా HYD జిల్లాకు చెందిన 105 మంది యువవాలంటీర్లు వారం రోజులపాటు ఫతుల్ గూడలో హైడ్రా శిక్షణ పొందారు. వారికి ధ్రువపత్రాలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదల సమయంలో హైడ్రాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా అందుబాటులో ఉండాలన్నారు.
HYD: మియాపూర్లోని సాయినగర్లో శంకర్(18) అనే విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది పదో తరగతిలో ఫెయిల్ అయిన శంకర్, తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం బీదర్ వెళ్లిన సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
NLG: ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఇంటర్మీడియేట్ విద్యాశాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధం చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 57,353 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 103 కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
ADB: ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రికి వచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ తెలిపారు. నిన్న హైదరాబాద్లోని సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన రిమ్స్ అభివృద్ధిపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, వైద్య సేవలను గురించి వివరించారు.
GDWL: జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావులను మున్సిపల్ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ ఛైర్మన్ శంకర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని శాలువాతో సన్మానించి, గద్వాల పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇందుకు అధికారులు సానుకూలంగా స్పందిస్తూ ప్రజల సంక్షేమానికి తమవంతు మద్దతు ఉంటుందని తెలిపారు.
SRPT: అనుమతి లేకుండా ఇసుక రవాణాతో పాటు కూడలిలో అక్రమంగా నిలువచేసిన ఇసుక డంపులపై, మంగళవారం కూడలిలో ఉన్నటువంటి ఇసుక డంపుల మీద రెవిన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు.ఈ దాడుల్లో అక్రమంగా నిలువ చేసినటువంటి ఆ డంపులను గుర్తించి 17 డంపులను అధికారులు సీజ్ చేశారు. ఈ డంప్లలో ఇసుక సుమారు 202 ట్రక్కులు అవుతాయని అధికారులు తెలిపారు.
BHPL: భూపాలపల్లి జిల్లాలోని మత్స్యకారులు, మత్స్య కృషీవలులకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2025-26 కింద మోటార్ సైకిల్ విత్ ఐస్ బాక్స్ మంజూరు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి వై. విజయ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల అర్హులైన మత్స్యకారులు జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో మార్చి 5వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
KMR: వనపర్తి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సేపక్ తక్రా పోటీల్లో కామారెడ్డి జిల్లా జట్టు ప్రతిభ కనబరిచి సీఎం కప్ సెకండ్ ఎడిషన్లో ద్వితీయ స్థానంలో సాధించింది. ఈ విషయాన్ని జిల్లా క్రీడాధికారి రంగా వెంకటేశ్వర్ తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు తుమ్మ రమేశ్, కార్యదర్శి కుమ్మరి నరేశ్, కోశాధికారి సతీశ్ జట్టు సభ్యులను అభినందించారు.
NZB: మార్చి 14 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు, సిబ్బంది ఎవరూ సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు తీసుకురావద్దని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.