JN: జిల్లా కేంద్రంలో శిక్షణ పొందిన కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. కాటమయ్య కిట్లను గౌడ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని, గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేటలో గ్రంథాలయం నుంచి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో మభ్యపెడుతూ, నోటిఫికేషన్ల జారీలో జాప్యం చేస్తుందని నాయకులు ఇంద్ర నాయక్ మండిపడ్డారు.
SRD: జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకి జిన్నారం మున్సిపల్ సమస్యలపై ఛైర్మన్ జనార్ధన్ వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ పరిధిలో తాగునీరు, డ్రైనేజ్, రహదారులు తదితర సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాలకవర్గం కలెక్టర్ను సన్మానించారు.
SDPT: బెజ్జంకి(మం) రాంసాగర్ గ్రామంలో గోపాలమిత్ర, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ ఇంగాల లక్ష్మి–నాగమల్లేశం శిబిరాన్ని ప్రారంభించారు. మండల పశువైద్యురాలు డాక్టర్ హరిత పాడి పశువులు, దూడలకు నట్టల నివారణ మందులు ఇచ్చి, గర్భకోశ సంబంధిత వ్యాధుల నివారణకు చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరేశం రైతులు పాల్గొన్నారు.
RR: చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సౌందర రాజన్ ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా.. సౌందర రాజన్ మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి
HNK: రోడ్డు ప్రమాద నివారణ కార్యక్రమంలో భాగంగా ఐనవోలు పోలీసులు శుక్రవారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్గా గుర్తించిన పున్నేలు గ్రామ శివారులోని ఏకశిలా స్కూల్ సమీపంలో, నేషనల్ హైవే–563పై హెవీ వాహన డ్రైవర్లకు ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో కలిసి నేత్ర పరీక్షలు నిర్వహించారు. చూపు సమస్యలు ఉన్న వారికి ఉచితంగా కళ్లజోడులు పంపిణీ చేశారు.
నారాయణపేట: నర్వ మండలం రాయికోడ్ గ్రామం 10వ వార్డులో విద్యుత్ స్తంభాలకు కొత్త ఎస్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. సర్పంచ్ పీ. శశికళ రవికుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది వీటిని అమర్చారు. రాత్రి వేళల్లో ప్రజలకు మెరుగైన వెలుతురు, భద్రత కల్పించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఎస్ఈడీ బల్బులతో విద్యుత్ ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు.
ASF: మాలీ కులస్థులను ST జాబితాలో చేర్చేందుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేలా కృషి చేయాలని కోరుతూ MLC దండే విఠల్కు కాగజ్ నగర్లో శుక్రవారం ఆ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్రావు, జిల్లా అధ్యక్షుడు వాసు, విజయ్ శ్రీనివాస్, వసంత్ పాల్గొన్నారు.
GDWL: పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరాలని గట్టు ఎస్సై శేఖర్ గౌడ్ కోరారు. గోర్లఖాన్ దొడ్డి పాఠశాల వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతూ.. సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థుల పైచదువుల ఖర్చును తానే భరిస్తానని తెలిపారు. 42 మందికి ఉచిత స్టడీ మెటీరియల్ అందించారు.
NRML: ఖానాపూర్ మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన గురిజాల నడిపి నరహరి, భూటా శంకర్, చీమల శ్రీకాంత్, బూర్క లక్ష్మణ్, గాదె రమేష్, దాసన్ల శ్రీనివాస్ ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ ఆరుగురిని పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఇవాళ జిల్లా సమీకృత కలెక్టరేట్లో సీఎం కప్ 2025 క్రీడా పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించారు. జిల్లా నుంచి పాల్గొన్న 22 మంది క్రీడాకారులలో 4 బంగారు, 8 వెండి, 10 కంచు పథకాలు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విభాగ అధ్యాపకుని డాక్టర్ ఎస్. రవికుమార్ను ప్రజావాణి పిర్యాదుల నోడల్ ఆఫీసర్గా నియమిస్తూ పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీ.రమేష్ బాబు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ ఎస్. రవికుమార్ను పలువురు అభినందనలు తెలిపారు.
KNR: రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్లో ‘బాహుబలి’ మోటార్లు గర్జించాయి. యాసంగి సాగును దృష్టిలో ఉంచుకుని అధికారులు గోదావరి జలాలను విడుదల చేశారు. పంప్ హౌస్ నుంచి ఎత్తిపోసిన నీటిని వరద కాలువ ద్వారా శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి వారబంది పద్ధతిలో నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.
MHBD: వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడకుండా పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. తొర్రూరు పట్టణంలో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాలకు చెందిన 189 మంది బాధితులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 1.05 కోట్ల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఎస్సై శ్రీసాయి జాబ్ మేళ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని AR హెడ్ క్వాటర్స్ వద్ద మార్చి 10వ తేదీన జాబ్ మేళ నిర్వహిస్తున్నామన్నారు. వివిధ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల ఖాళీలు ఉండటంతో నిరుద్యోగ యువత తమ ధ్రువపత్రాలతో భారీ ఎత్తున వచ్చి సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.