MNCL: కన్నెపల్లి మండలం నాయకంపేట గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ఒడ్డెటి పద్మ-అశోక్, గ్రామస్థులు కోరారు. ఈ మేరకు SIకి ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. NREGS కింద రూ. 5 లక్షల విలువగల CC రోడ్డు మంజూరు కాగా రోడ్డు పని ప్రారంభించే సమయంలో ముగ్గురు వ్యక్తులు పనులు అడ్డుకొని గొడవ చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్లు ఈ నెల 27వ తేదీతో ముగియనున్నట్లు ఆయా జిల్లాల మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ నిల్వలను త్వరగా విక్రయించుకోవాలని మార్కెట్ అధికారులు సూచించారు. సీజన్ ప్రారంభంలో ‘కిసాన్ యాప్’ వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
PDPL : జేఎన్టీయూహెచ్ అనుబంధ బీ-జోన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్ను నిన్న సాయంత్రం మంథని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ ఆవిష్కరించారు. ఈరోజు గురువారం నుంచి 12 జట్లతో లీగ్ కమ్ నాకౌట్ విధానంలో పోటీలు జరుగనున్నాయి. పూర్వ విద్యార్థులు, రామగుండం క్రికెట్ అసోసియేషన్, సింగరేణి అధికారులు ఆర్థిక సహకారం అందిస్తున్నారు.
WNP: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వనపర్తి రూరల్ ఎస్సై హృషీకేశ్ తెలిపారు. వివరాలు నాగవరం తండాకు చెందిన శ్రీనుతో మేఘవత్ జ్యోతికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం సరిపోలేదని అదనపు కట్నం కావాలని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు.
JGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామంలో రజకులను గుడిలోకి వెళ్ళకుండా అడ్డుకొని దాడిచేసి రెండు నెలల పసికందు ప్రాణాలు తీసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని రజక సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. మెట్పల్లి మండలం ఆత్మనగర్లో రజక యువజన కమిటీ ఆధ్వర్యంలో చిన్నారి మృతి పట్ల బుధవారం కొవ్వత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు.
BDK: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు అందరూ సకాలంలో పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రాన్ని కొత్తగూడెం వన్ టౌన్ ఎస్ఐ రాకేష్ సందర్శించారు.
KMR: ఎల్లారెడ్డి ఆర్డీవో కే. పార్థసింహారెడ్డి చేవెళ్లకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రభాకర్ కొత్త ఆర్డీవోగా నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ సెక్రటరీ డీఎస్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
HYD: ఇంటర్ పరీక్షలు జరుగుతున్న వేళ HYD జిల్లాలో పకడ్బందీగా అధికారులు పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణ యాదవ్ మారేడుపల్లి సహా అనేక సెంటర్లలో తనిఖీలు చేసిన ఆయన, పరీక్షలు పూర్తయ్యే వరకు నిత్యం తనిఖీలు చేపడతానని, ఆకస్మిక తనిఖీల్లో తేడా వస్తే చర్యలు ఉంటాయన్నారు.
KNR: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా కరీంనగర్ జిల్లా యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బదిలీ అయ్యారు. ఆమెను లేబర్ స్పెషల్ కమిషనర్గా నియమించారు. అలాగే జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు కూడా బదిలీ అయ్యారు. ఆయనను నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
NZB :ధర్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహంలో ఔట్సోర్సింగ్ విధానంలో హెడ్ కుక్ (వంట మనిషి) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తును వసతి గృహ కేర్ టేకర్ స్వరూపకు అందజేయాలన్నారు. వేతనం రూ.7800 ఉంటుందన్నారు.
NZB: ఎన్టీఆర్ కాలనీ వైపు ప్రహరీ నిర్మాణంపై హైకోర్టు మూడు వారాల స్టే విధించినప్పటికీ ఆర్మూర్ ఆర్టీసీ అధికారులు పనులు ప్రారంభించేందుకు ప్రయత్నించగా వివాదం నెలకొంది. స్టే విషయం కాంట్రాక్టర్కు తెలియజేయకపోవడంతో పనులు మొదలుపెట్టగా కాలనీవాసులు కోర్టు ఉత్తర్వుల ప్రతిని చూపించడంతో పనులు నిలిచిపోయాయి.
SRD: మహిళా సాధికారతపై జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గం జీర్లపల్లి గ్రామ సర్పంచ్ అమరేశ్వరి శివమణి ఎంపికయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఎంపికైన ఐదుగురు సర్పంచులలో ఈమె ఒకరు. తక్కువ కాలంలోనే గ్రామాభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు గాను ఈ గుర్తింపు లభించింది. ఫిబ్రవరి 25న జరిగే ఈ శిక్షణలో ఆమె పాల్గొననున్నారు.
HYD: ఇంటికి వచ్చిన వారికి మంచినీళ్లు పోసే గుణం మన సొంతం. అలాంటిది మనోళ్లు HYDలో ఆకలితో అలమటిస్తున్నవారికి కడుపునిండా బువ్వ పెట్టే చేతులయ్యారు. సికింద్రాబాద్, మెహిదీపట్నం, రెడ్హిల్స్, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో నిత్యం పేదల కడుపు నింపేందుకు అన్నదాన వితరణ చేస్తుంటారు. వ్యాపారవేత్తల నుంచి విద్యార్థుల వరకు తమ చేతికి తోచిన సాయం చేస్తున్నారు.
MDK: అల్లాదుర్గంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముప్పారం గ్రామానికి చెందిన సనుబాల వీరేశం(41) పని నిమిత్తం అల్లాదుర్గం వచ్చి, తిరిగి తన బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.
HYD: IPSP, BDS ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రిలయన్స్ ఔట్లెట్ వద్ద HYD ప్రజలు ఇజ్రాయిల్ దాడుల విషయంలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసనలు చేశారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దాడుల విషయంలో రిలయన్స్ అధినేత పాత్ర ఉందని ఆరోపిస్తూ సంస్థపై బహిష్కరణకు పిలుపునిచ్చారు. పోలీసుల పర్యవేక్షణలో ఆందోళన శాంతియుతంగా సాగింది.