VZM: వీధులలో CC కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని బొబ్బిలి సీఐ కె.నారాయణరావు సూచించారు. శనివారం సాయంత్రం స్దానిక ఆకులరెల్లివీధిలో గ్రామస్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయవచ్చన్నారు. అలాగే శక్తి మొబైల్ యాప్ను మహిళలు స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవాలన్నారు.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని మెదక్ ఎల్కతుర్తి జాతీయ రహదారిపై భారీ గుంతలు ఏర్పడిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక 15 రోజులుగా గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బంది ఏర్పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతలు పూడ్చి రోడ్డు మరమ్మతు చేయాలని కోరుతున్నారు.
HYD: త్రిబుల్ ఐటీ HYDలో అందుబాటులోకి తీసుకొచ్చిన దృష్టి లైబ్రరీ విశేష ఫలితాలు ఇస్తోందని ప్రొఫెసర్ జవహర్ తెలిపారు. తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ వంటి మొత్తం 12 భాషల్లో ఈ లైబ్రరీ అందుబాటులో ఉంది. బ్రెయిలీ లిపి, ఆడియో బుక్ రూపాల్లో పీజీ స్థాయి వరకు పాఠ్యాంశాలు అందించడం ద్వారా దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది.
VSP: మధురవాడ శిల్పారామంలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయ శిల్పారామం పరిపాలనాధికారి రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘గగన సిరి డాన్స్ అకాడమీ’ ఆధ్వర్యంలో కళాకారులు కూచిపూడి, జానపద నృత్యాలు ప్రదర్శిస్తారన్నారు. రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శనలు కొనసాగుతాయని తెలిపారు.
NDL: పాణ్యం మండలం కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి భక్తులు రూ.50 వేల విరాళం అందజేసినట్లు ఈవో రామకృష్ణ శనివారం తెలిపారు. పాణ్యానికి చెందిన వెంకట చంద్రశేఖర్ బాబు-విజయలక్ష్మి దంపతులు స్వామివారి ఇలవేల్పు కావడంతో విరాళం అందజేశారు. దాతలకు స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేసి సత్కరించారు.
PDPL: ఇటీవల గని ప్రమాదంలో గాయపడి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు లక్ష్మీనారాయణను సంస్థ CMO డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్య బృందం చికిత్స వివరాలు సేకరించారు. వివరాలు కొత్తగూడెం ఆసుపత్రికి పంపించి, తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ మేరకు బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.
PLD: బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు, రామాపురం పేరూరుపాడు, బొల్లాపల్లి, రేమిడిచర్ల తదితర గ్రామాలలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు ఒకరినొకరు ఆలింగణం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. రంజాన్ సందర్భంగా మసీదులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దేశ శాంతి సౌభాగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
MNCL: రాష్ట్ర ప్రభుత్వం రూ.51వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వలన సింగరణి కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితులు వస్తున్నాయని AITUC అధ్యక్షుడు సీతారామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. AITUC ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవ్ సింగరేణి జాత’ బెల్లంపల్లికి వచ్చిన సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడారు.అధికారుల స్వార్థం కొరకు సంస్థను నష్టాలపాలు చేస్తున్నారని ఆరోపించారు.
KNR: రాష్ట్ర బడ్జెట్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఈసారి రూ. 17,907 కోట్లను కేటాయించగా, మున్సిపాలిటీలకు రూ.5,000 కోట్లు, కార్పొరేషన్లకు రూ.754 కోట్లు కేటాయించారు. జమ్మికుంట పట్టణంలో ఉపఎన్నికల సమయంలో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రకాశం: పెట్రోల్ బంకుల్లో క్యాన్లలో పెట్రోల్ నింపడం ఆపేయమని ఉత్తర్వులు వచ్చినట్లు కొండపి మండలం పెట్లూరు బంకు యజమాని వేణుగోపాల్ శనివారం తెలిపారు. రైతుల అవసరాలకు డీజిల్ మాత్రం క్యాన్లలో కొట్టవచ్చని నిబంధన ఉందన్నారు. పెట్రోల్ వాహనాలకు మాత్రం కొట్టమని కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
CTR: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజలు ఆస్తి పన్ను చెల్లించడానికి ఆదివారం సైతం వసూళ్ల కేంద్రాన్ని అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ నరసింహప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్పొరేషన్ కార్యాలయంలో పన్ను వసూళ్ల కేంద్రాలు పనిచేస్తాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ADB: మానసిక ఒత్తిడితో బాధపడుతున్న రైతులు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వం అందిస్తున్న టెలీ-మానస్ (Tele-MANAS) హెల్ప్ లైన్ 14416 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఈ నంబర్కు కాల్ చేసి నిపుణులైన కౌన్సిలర్ల ద్వారా ఉచిత సలహాలు పొందవచ్చని తెలిపారు. గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఈ సేవలపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
కృష్ణా: విశ్వనాథపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు ఊరటగా ఆదివారం మినుములు, పెసల కొనుగోలు కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రభుత్వ కనీస మద్దతు ధరల ప్రకారం నాణ్యత ఆధారంగా పంటలను స్వీకరిస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. మినుములకు సుమారు రూ. 7,800, పెసలకు రూ. 8,700 పైగా ధరలు లభిస్తున్నాయని చెప్పారు.
NRML: కుబీర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ప్రభుత్వ రంగ సంస్థ (మార్క్ ఫెడ్) ఆధ్వర్యంలో PACS ద్వారా ఆదివారం నుంచి శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నట్లు AMC ఛైర్మన్ గోనె కళ్యాణ్, PACS కార్యదర్శి క్రాంతి కుమార్ తెలిపారు. MLA రామారావు పటేల్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారన్నారు. ఈ మేరకు రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
MNCL: స్నేహితుల మధ్య జరిగిన గొడవలో దీపక్ అనే యువకుడు దాడికి గురై శనివారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. కూలి పని చేసుకునే సిడం దీపక్, సంజీవ్లు కాలేజీ రోడ్డులో అద్దెకు ఉంటున్నారు. 2 రోజుల క్రితం జరిగిన గొడవలో దీపక్పై రాడ్తో దాడి చేయడంతో గాయాలపాలయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.