ADB: గృహ వినియోగానికి కేటాయించిన LPG సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించరాదని సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీతో ప్రజలకు అందిస్తున్న గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లో వినియోగించడం చట్ట విరుద్ధమని అన్నారు. ఇటువంటి చర్యలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమే కాకుండా ప్రజల ప్రాణ భద్రతకు కూడా ముప్పు కలిగిస్తాయని తెలిపారు.
NGKL: బల్మూర్ మండలం రంగాపూర్ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయాన్ని ప్రముఖ సినీ నటుడు సుప్రీత్ రెడ్డి (ఛత్రపతి కాట్రాజు) దర్శించుకున్నారు. శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు, ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవంలో భాగంగా శనివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సీతారాముల స్వామి వారికి పంచోపా నిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. రామాయణ పారాయణం, రామాయణ ప్రవచనం ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
E.G: దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో 40 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదం ముగిసింది. కొల్లూరు సుబ్బమ్మకు చెందిన 14 ఎకరాల భూమిని 1982 నుంచి పాసుపుస్తకాలు లేకుండానే స్థానిక పేద రైతులు సాగు చేస్తున్నారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించగా, తాజాగా భూమి హక్కు పట్టాదారులదేనని తీర్పు వెలువడింది. శనివారం ఎమ్మెల్యే మద్దిపాటి లబ్ధిదారులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు.
MDCL: రామంతాపూర్ భగాయత్ వెంకట సాయి నగర్ కాలనీలో కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ వద్ద రాత్రి చీకటి కారణంగా మహిళల భద్రత సమస్యలు తలెత్తుతున్నాయి. ఈమేరకు అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు. హైమాస్ట్ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని కోరగా, సమస్యను త్వరలో పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
KNR: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయనామ సంవత్సరం అని ప్రకటించి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కోత పెట్టడం విస్మరించడమేనని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి విమర్శించారు. శంకరపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయనామ సంవత్సరంగా ప్రకటించిన CM బడ్జెట్లో మాత్రం కోత విధించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు.
KMM: నేరాల నియంత్రణలో భాగంగా అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ఖమ్మం జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నిన్న తెలిపారు. ఏటియం సెంటర్లు, బ్యాంకుల పరిసరాలలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి వేళలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను, వాహనాలను తనిఖీ చేశారు.
ELR: నూజివీడు పట్టణంలోని శారద డిగ్రీ కళాశాలలో 25వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారని కోఆర్డినేటర్ డి.రామకృష్ణ తలిపారు. 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొనే ఈ మేళాలో 925 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు హాజరు కావాలని ఆయన కోరారు.
NDL: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఇవాళ బనగానపల్లె మండలం నందవరం ఆలయానికి వస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు తెలిపారు. నందవరంలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దర్శనానికి మంత్రి సత్యకుమార్ వస్తున్నారని చెప్పారు. రాత్రి 8 గంటలకు నందవరం ఆలయానికి వస్తారని, ఏర్పాట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ATP: జిల్లా మట్టి వాసనతో రూపొందిన ‘సొట్టా బుగ్గల పిల్లో’ ఫోక్ సాంగ్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి అతిథిగా పాల్గొని పాటను ఆవిష్కరించారు. అనంతపురం స్వరం, ఇక్కడి లొకేషన్లలోనే చిత్రీకరించిన ఈ జానపద గీతంపై ఆమె ప్రశంసలు కురిపించారు. కళాకారులను ప్రోత్సహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
PPM: బలిజిపేట మండలం అజ్జాడ గ్రామంలో శనివారం YCP సీనియర్ కార్యకర్తల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన పెంకి సంజీబు, బడే నరసింహ నాయుడు, పోల చిన్నం నాయుడు కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
చిత్తూరు జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాలకు ప్రకటన విడుదలైనట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. చిత్తూరులోని ఇరువారం, కుప్పంలోని కేంద్రీయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కృష్ణా: గన్నవరం మండలంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఇవాళ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బలిపర్రు, వీరపనేనిగూడెం, తెంపల్లి ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు కరెంట్ నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.
NRPT: ఊట్కూరు మండలం నిడుగుర్తికి చెందిన డాక్టర్ కౌండిన్య శ్రీజ గౌడ్ అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మెడికల్ కాలేజీలో పీజీ సీటు సాధించారు. HYDలోని కామినేని ఆసుపత్రిలో MBBS పూర్తి చేసిన ఆమె, 2025 DECలో నిర్వహించిన USMLE స్టెప్-2 పరీక్షలో 300 మార్కులకు గానూ 252 మార్కులు సాధించి మెరుగైన ప్రతిభ కనబరిచారు.
KRNL: ఈనెల 26న జిల్లాలోని కిడ్స్ వరల్డ్ రోశయ్య కమ్యూనిటీ హాల్లో 8వ జిల్లాస్థాయి ఉషూ పోటీలను నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి టి.శ్రీనివాసులు తెలిపారు. పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ను రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ తన కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.