KRNL: ఈనెల 26న జిల్లాలోని కిడ్స్ వరల్డ్ రోశయ్య కమ్యూనిటీ హాల్లో 8వ జిల్లాస్థాయి ఉషూ పోటీలను నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి టి.శ్రీనివాసులు తెలిపారు. పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ను రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ తన కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.