MNCL: ప్రజలతో కలిసి వార్డు సభ్యులు పనిచేయాలని గ్రామాలలో జన్నారం, లక్షెట్టిపేట ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ సూచించారు. లక్షెట్టిపేట, జన్నారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ గురువారం కొనసాగింది. పలు చట్టాలపై వార్డు సభ్యులకు అధికారులు అవగాహన కల్పించారు. గ్రామాలలో సమస్యలు పరిష్కారం కావాలంటే అందరూ కలిసి పని చేయాలన్నారు.
JN: ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం, ఇతర అంశాలపై జనగామ కలెక్టరేట్లో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
AP: IPS సునీల్ నాయక్పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. వైసీపీ హయాంలో Dy. స్పీకర్ రఘురామకృష్ణరాజును CID కస్టడీలో హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో గుంటూరు మొబైల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా, ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసేందుకు అక్కడి హైకోర్టు నిరాకరించడంతో గుంటూరు మొబైల్ కోర్టులో పోలీసులు అరెస్ట్ వారెంట్ పిటిషన్ వేశారు.
TG: హన్మకొండలో దారుణం జరిగింది. వరుసకు పిన్ని అయిన మహిళపై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఎర్రబెల్లి గ్రామానికి చెందిన ధరావత్ రాజ్ కుమార్ అదే గ్రామానికి చెందిన మహిళపై కోరిక పెంచుకున్నాడు. ఈ క్రమంలో తన కోరిక తీర్చాలని తరచూ ఒత్తిడి చేశాడు. నిన్న రాత్రి అత్యాచారానికి యత్నించగా.. ఆమె గట్టిగా అరవడంతో నిందితుడు పరారయ్యాడు. యువకుడిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
KRNL: ఆదోని జిల్లాలో సాధన నిరాహార దీక్షలు గురువారనికి 103వ రోజుకు చేరాయి. జేఏసీ నేతలు హనుమంతు, సుభాష్ చంద్రబోస్, నాగరాజు తదితరులు దీక్షలో ఉన్నారు. కొందరు నేతలు దీక్ష విరమిస్తారని ప్రకటించినప్పటికీ, మరో వర్గం దీక్ష కొనసాగించింది. ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని, జిల్లా సాధించే వరకు పోరాటం ఆపరాదుని జేఏసీ నేతలు వెల్లడించారు.
KNR: చొప్పదండి మున్సిపాలిటీలో ప్రజలకు శుద్ధి చేసిన నీటిని 5 రూపాయలకే 20 లీటర్ల క్యాన్ చొప్పున అందిస్తున్నట్లు చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్ తెలిపారు. ఊరిలోని మంచినీళ్ల బావి నుంచి నీటిని సేకరించి, శుద్ధి చేసి ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాయిన్ బాక్స్లో 5 రూపాయలు వేసి నీటిని పొందవచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కోరారు.
ADB: ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఐఈవో జాదవ్ గణేష్ తెలిపారు. అయితే జిల్లాలో ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని వెల్లడించారు. మొత్తం 8,549 మంది విద్యార్థులకు గాను 8,180 మంది హాజరయ్యారని, 369 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
TPT: రైల్వే కోడూరులో మార్చి 5న శ్రీ సాయి డిగ్రీ & పీజీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. సుమారు 15 కంపెనీలు పాల్గొని 630 కిపైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. పదో తరగతి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావచ్చు. ఆసక్త కలిగి అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
HYD: సికింద్రాబాద్ రైల్వే టాస్క్ ఫోర్స్ పోలీసులు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.79,230 విలువైన 70 బాటిళ్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారు.
NGKL: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం పేరు మార్పును ఉపసంహరించుకొని యథావిధిగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ డిమాండ్ చేశారు. అమ్రాబాద్ మండలంలోని వెంకటేశ్వర్ల బావి, మల్కమామిడి, మన్ననూర్ గ్రామాలను సందర్శించి పని ప్రదేశంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కాకినాడ: ఏలేశ్వరంలో జనసేన నాయకుడు బంక కోదండరాం ఆధ్వర్యంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. రాష్ట్ర కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వం వల్ల లభించే బీమా, ఇతర ప్రయోజనాలను కార్యకర్తలకు వివరించారు. పార్టీ శ్రేణులు తప్పనిసరిగా సభ్యత్వం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆశయాలను బలోపేతం చేయాలన్నారు
NLG: గుడిపల్లి మండలం ఘనిపల్లి అగ్నిప్రమాద బాధితులకు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నేతృత్వంలో ఇందిరమ్మ ఇల్లు కల్పిస్తామని మండల పార్టీ నాయకులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం తహసీల్దార్ మధుసుహాసిని, ఎంపీడీవో అండాలు, ఆర్ఐ సత్య రాజ్, సర్పంచ్ మల్లిక వెంకటేశ్వర్లు బాధితుడు భిక్షం కుటుంబాన్ని పరామర్శించారు.
బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గురువారం చీరాలలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తీరును ప్రతి గదికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. ప్రశ్నాపత్రం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా, కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
RR: శంకర్ పల్లి మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ చాకలి అశోక్ ఇవాళ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బొకే అందజేశారు. ఈ సందర్భంగా రెండో సారి స్వతంత్ర అభ్యర్థిగా, కౌన్సిలర్గా గెలిచిన అశోక్ను ఎమ్మెల్యే అభినందించారు. వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
‘కోర్ట్’ సినిమా జోడీ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘బ్యాండ్ మేళం’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా.. తాజాగా సెకండ్ సింగిల్ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 28న మాస్ మహారాజా రవితేజ ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక దర్శకుడు సతీష్ జివ్వాజి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.