ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ను గురువారం వేలేరుపాడు, కుకునూరు మండలాల నేతలు కలిశారు. మండలాల అభివృద్ధి, పోలవరం నిర్వాసితుల కష్టాలపై ఎంపీకి వినతి పత్రం సమర్పించారు. ముంపు లేని ప్రాంతాలలో వెంటనే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, మండలాల్లో ఎక్కడా మంచినీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
BDK: మణుగూరు మండలం కూనవరం లో మజీద్-ఎ-బిలాల్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రమజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సహనం, సేవా భావం, దయ, సౌభ్రాతృత్వానికీ ప్రతీక అని కొనియాడారు.
ADB: బాల్య వివాహ రహిత జిల్లాగా ఆదిలాబాద్ను నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం పట్టణంలో బాల్య వివాహ నిరోధక అధికారులు నిర్వహించిన అభయ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ASF: రెబ్బెన మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు MRO సూర్య ప్రకాశ్ గురువారం తెలిపారు. నారాయణపూర్, కొమురవెల్లి నుంచి మంచిర్యాలకు అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న ఇసుకను అడ్డుకొని ట్రాక్టర్ ఓనర్ కాదబండి ప్రవీణ్ కు రూ.5,000ల జరిమానా విధించినట్లు చెప్పారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని MRO హెచ్చరించారు.
శ్రీకాకుళం నగరం వాంబేకాలనీకి చెందిన పైల మోహనరావు (48) దారుణ హత్యకు గురయ్యాడు. ఎచ్చెర్ల మండలం పొన్నా వంతెన సమీపంలో గురువారం సాయంత్రం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు టిఫిన్, కిరాణా షాపులను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యుల సంఘటన స్థలానికి చేరుకుని కన...
జింబాబ్వేతో మ్యాచ్లో 48 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ 8 బంతుల్లో 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. వన్ డౌన్లో ఇషాన్ కిషన్ ఇప్పుడే క్రీజులోకి వచ్చాడు. 3.4 ఓవర్లలో భారత్ స్కోర్ 48/1.
జింబాబ్వేతో మ్యాచ్లో 48 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ 8 బంతుల్లో 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. వన్ డౌన్లో ఇషాన్ కిషన్ ఇప్పుడే క్రీజులోకి వచ్చాడు. 3.4 ఓవర్లలో భారత్ స్కోర్ 48/1.
VKB: ధారూర్ మండల కేంద్రంలోని బస్టాండ్లో సీసీ ప్లాట్పారమ్ పనులు ప్రారంభం కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వర్షాలు పడితే బస్టాండ్ ఆవరణ అంతా మురుగునీరు, బురదతో నిండి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అధికార యంత్రాంగం స్పందించి సీసీ పనులు చేపట్టడంతో ఇకపై సౌకర్యంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
SRPT: జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా హుజూర్ నగర్కు చెందిన చెన్నగాని బాలకృష్ణ గౌడ్ను నియమించారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. బీసీల అభ్యున్నతి, సంఘ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, బీసీల సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని బాలకృష్ణ తెలిపారు.
NLG: దేవరకొండ ఆర్టీసీ డిపోలో ‘సురక్షిత ప్రయాణం’పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వెంకట్ రెడ్డి, డిపో మేనేజర్ విజయకుమారి పాల్గొని మాట్లాడారు. డ్రైవర్లు వాహనం నడిపేటప్పుడు ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని అన్నారు. ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా డ్రైవింగ్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
KRNL: చిలకలడోనలోని ఎస్సీ కాలనీలో 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఇవాళ కాలనీవాసులు జిల్లా అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. భూమిని సర్వే చేసి పేదలకు పంచిపెట్టడంతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వారు కోరారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ స్థలాన్ని పరిశీలించగా కొంత ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూమిపై సర్వే చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
BHPL: రేగొండ మండలం భాగిర్తిపేట గ్రామంలో టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అంబాల నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న సుమారు 20 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. అనుమతులు లేకుండా రేషన్ బియ్యాన్ని రాష్ట్ర బయటకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై అధికారులు హెచ్చరించారు.
E.G: మండపేట పురపాలక సంఘ కమిషనర్ టి.వి.రంగారావు ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ఆధ్వర్యంలో శానిటేషన్ సెక్రటరీలు మండపేటలోని పాల కేంద్రాలను తనిఖీ చేశారు. మండపేట పట్టణ పరిధిలో ఉన్న 16 పాలకేంద్రాలలో గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. పాల ఉత్పత్తులు నాణ్యత పరిశీలించి, ఏ విధమైన పాల ఉత్పత్తులు నిల్వ ఉంచరాదని పేర్కొన్నారు.
TG: గతంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక.. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. ఈ ప్రభుత్వం గ్రూప్ 1,2 ఉద్యోగాలు అమ్ముకుందని కొందరు ప్రచారం చేశారని.. కోర్టుల్లో కేసులు వేశారని వాటన్నింటిని జయించి.. ఇవాళ నియామక పత్రాలు అందించామని అన్నారు. తమ ప్రభుత్వం తప్పు చేయదని స్పష్టం చేశారు.
NGKL: బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులను సహించబోమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కుమ్మెర ఘటన బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు. కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ.పాటిల్తో సమావేశమై కేసు నమోదు ప్రక్రియ, నిందితులపై తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలని తెలిపారు.