• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వెలిగొండకు కాల్సింది 53 TMCలే: చంద్రబాబు

AP: మార్కాపురంలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రక్షిత మంచినీరు అందిస్తాం. మార్కాపురం జిల్లాను ఒక సవాలుగా తీసుకుంటా. అన్ని పనులు చేస్తా, ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు తెస్తా. నదుల అనుసంధానం కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. గోదావరి నుంచి 6 వేల TMCలు సముద్రంలోకి వెళ్లాయి. వెలిగొండకు కాల్సింది 53 TMCలే’ అని పేర్కొన్నారు.

February 25, 2026 / 05:03 PM IST

‘రూఫ్ టాప్ సోలార్ సిస్టం’ పనుల పరిశీలన

NLG: జిల్లాలో పైలెట్ పద్ధతిన ఎంపిక చేసిన గ్రామాలలో గృహ జ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న ‘రూఫ్ టాప్ సోలార్ సిస్టం’ ఏర్పాటు పనులను మార్చి మొదటి వారంలోపు పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. కనగల్‌లో టీఎస్ రెడ్‌కో ఆధ్వర్యంలో గృహజ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న ‘రూఫ్ టాప్ సోలార్ సిస్టం’ పనులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు.

February 25, 2026 / 05:03 PM IST

‘అంగన్వాడీల వేతనం పెంచాలి’

AKP: వేతనాలు పెంచాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం ఎలమంచిలి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలన్నారు.

February 25, 2026 / 05:02 PM IST

జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు పడకల్ విద్యార్థిని ఎంపిక

NZB : జక్రాన్‌పల్లి మండలం పడకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న చందన జాతీయ స్థాయి 46వ సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు గడ్డం శ్రీనివాస్ తెలిపారు. వెస్ట్ బెంగాల్ పోల్బనగర్లో ఈనెల 25 నుంచి మార్చి 1 వరకు జరిగే పోటీల్లో పాల్గొంటుందని చెప్పారు.

February 25, 2026 / 05:02 PM IST

ఏఎంసీ భవన ఆధునీకరణకు నిధులు

SKLM: రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో కోటబొమ్మాళి వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం ఆధునికీకరణకు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలానే చీపుర్లుపాడు వద్ద మార్కెట్ యార్డు ,సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధికి మంజూరు చేశారు. మొత్తం 3 కోట్ల 20 లక్షల రూపాయలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

February 25, 2026 / 05:02 PM IST

మాట నిలబెట్టుకున్న కార్పొరేటర్

KNR: కరీంనగర్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నెరవేర్చి చింతకుంటలోని 14వ డివిజన్ ప్రజల మన్ననలు పొందారు కార్పొరేటర్ గడ్డి ప్రదీప్. దీర్ఘకాలికంగా ఉన్న తాగునీటి సమస్యపై స్పందించిన ఆయన, ఎన్నికల ప్రచారంలో భాగంగా సొంత ఖర్చుతో బోరు వేయిస్తానని మాట ఇచ్చారు. గెలిచిన వెంటనే స్పందించి, బోరు నిర్మాణం పూర్తి చేసి నీటి సౌకర్యం కల్పించారు.

February 25, 2026 / 05:01 PM IST

శిబిరాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలి: ITDA PO

ADB: జాతీయ సేవా పథకం శిబిరాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. బుధవారం ఉట్నూర్లోని ఐటీడీఎ కార్యాలయంలో ఉప సంచాలకులు జాదవ్ అంబాజీ, జాతీయ సేవా పథక నిర్వాహకురాలు కొరిమి ప్రత్యూషలతో కలిసి టీ షర్టులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంబధిత అధికారులు ఉన్నారు.

February 25, 2026 / 05:01 PM IST

నడిగూడెంలో ఇంటర్ పరీక్షా కేంద్రాల తనిఖీ

SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యుడు జీ.శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు కల్పించిన వసతులను ఆయన పరిశీలించారు. ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌కు తావులేకుండా నిబంధనల ప్రకారం పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

February 25, 2026 / 05:01 PM IST

సదాశివనగర్‌లో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

కామారెడ్డి జిల్లాలోనీ సదాశివనగర్ మండల కేంద్రంలో బుధవారం కళ్యాణ లక్ష్మీ పథకం కింద మంజూరైన చెక్కులు బుధవారం పంపిణీ చేశారు. జాయింట్ కలెక్టర్ విక్టర్ హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో సహాయపడుతోందన్నారు. ఈ సందర్భంగా బాధితులు ధన్యవాదాలు తెలిపారు.

February 25, 2026 / 05:01 PM IST

అన్న సమారాధనలో పాల్గొన్న వైసీపీ నేత

విజయనగరంలోని నందివీధిలో వెలసిన శ్రీ పైడితల్లమ్మ వారి (గద్ది) 12వ వార్షిక మహోత్సవాలు ఇవాళ అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఈ మహోత్సవాల్లో నెల్లిమర్ల నియోజవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు పాల్గొన్నారు..అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన చేతులు మీదగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.

February 25, 2026 / 05:01 PM IST

మంచి మనసును చాటుకున్న యువకులు

MNCL : జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో గాజుల సత్తయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న చత్రపతి శివాజీ యూత్ సభ్యులు రూ. 5000, 25 కేజీల రైస్ బ్యాగ్ బుధవారం అందజేసి, మంచి మనసును చాటుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపాడుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 05:01 PM IST

అసెంబ్లీ సమావేశాలను వీక్షించిన విద్యార్థులు

కృష్ణా: పెనమలూరు (M) తాడిగడప జిల్లా పరిషత్ హై విద్యార్థులు బుధవారం అసెంబ్లీ సమావేశాలను వీక్షించారు. చట్ట సభల్లో చట్టాలను రూపొందించడం, అమలు పరచడం, సమస్యలపై ఎమ్మెల్యేలు చర్చించే తీరును స్వయంగా వీక్షించడంత విద్యార్థులు అనుభూతి చెంది తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బోదే ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.

February 25, 2026 / 05:00 PM IST

పోలీసులతో ఇంటర్న్‌షిప్, వాలంటరీలుగా చేసే ఛాన్స్..!

HYD పోలీసులు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తూ ఆధునిక పోలీసింగ్‌లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో ముందడుగు వేశారు. ఇంటర్న్‌షిప్, వాలంటరీ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. 25 సం.రాల లోపు డిగ్రీ, పీజీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://form.jotform.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.

February 25, 2026 / 05:00 PM IST

వచ్చే సంక్రాంతికి మారుతి మరో సినిమా?

ఇటీవల ‘ది రాజాసాబ్’ మూవీతో డిజాస్టర్ అందుకున్న దర్శకుడు మారుతి మరో ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ‘హ్యాపీ పొంగల్’ అనే టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కించనున్నాడట. ఇప్పటికే ఓ కామెడీ కథను సిద్ధం చేసినట్లు, హీరో కోసం వెతుకులాట స్టార్ట్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

February 25, 2026 / 05:00 PM IST

కలెక్టర్‌ను కలిసిన వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు

W.G: కలెక్టర్ నాగరాణిని భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల బృందం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. పెదఅమిరం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డా. మానస, డా. జాగృతి రోహిత్, డా. రాఘవేంద్ర, డా. సతీష్ చవాన్ పాల్గొన్నారు. భవిష్యత్తులో జిల్లాలో వరి సాగుపై రైతులకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టే అంశంపై చర్చించారు.

February 25, 2026 / 04:59 PM IST