కృష్ణా: ఉయ్యూరులో ఇటీవల డిజిటల్ అరెస్టుకు గురైన వృద్ధ దంపతులను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శుక్రవారం శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డిజిటల్ అరెస్ట్కు గురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరైనా వీడియో కాల్ ద్వారా లేదా వాయిస్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడితే నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీబీ), జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (జీడీఎంఎస్) ఆధ్వర్యంలో మహాజన సభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జీడీఎంఎస్ ఛైర్మన్ వడ్రణం హరిబాబు నిర్వహించారు. ఈ సమావేశంలో సహకార సంఘాల అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై వారు ప్రధానంగా చర్చించారు.
WGL: వర్ధన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 3వ డివిజన్లో నీటి ఎద్దడిని నివారించేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కౌన్సిలర్ గుజ్జ వీరరాఘవ రావు శుక్రవారం సొంత నిధులతో కాలనీలో బోరు తవ్వించి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించిన వార్డు సభ్యుడికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
మహబూబ్ నగర్: అంబేడ్కర్ చౌరస్తా వద్ద ‘ఇందిర మహిళా శక్తి’ గ్రామ దుకాణాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుందన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ఇలాంటి దుకాణాలను ప్రోత్సహిస్తోందని తెలిపారు.
GDWL: పారిశుధ్యం, నీటి ఎద్దడి, విద్యుత్ సమస్యలు లేకుండా వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం అని కౌన్సిలర్ ఫర్హీన్ తబుసం మహబూబ్ పాష అన్నారు. డ్రైనేజీల్లో ఏళ్ల తరబడి నిలిచిన మురుగు, చెత్తను శుక్రవారం కార్యకర్తలు చేత తొలగించారు. పట్టణంలోని 20వ వార్డులో ఉన్నటువంటి ఇళ్ల తరబడి చెత్తను క్లీన్ చేయించి, శుభ్రంగా ఉంచుతామన్నారు.
నల్గొండ: జిల్లా పోలీసు శాఖలో పదవి విరమణ పొందిన SI దుర్గా రెడ్డి, ఆసాయి ఫరీద్, నిరంజన్లను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో వారి సేవలు ప్రశంసనీయమని ఎస్పీ పేర్కొని శాలువాలు, జ్ఞాపికలు అందజేశారు. అలాగే విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోలీస్ సిబ్బంది షేక్ తాయూబ్, మరియాదాస్ కుటుంబ సభ్యులకు చేయూత చెక్కులు అందజేశారు.
తమిళ స్టార్ హీరో, TVK అధినేత విజయ్ దళపతికి భార్య సంగీత షాక్ ఇచ్చింది. 26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకుల కోసం చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 1999లో వివాహం చేసుకున్న ఈ జంటకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత ఏడాది నుంచి వీరు విడిపోతారనే ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడది నిజమైంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరుణంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
ప్రకాశం: కొమరోలు మండలంలోని అల్లినగరం గ్రామంలో గల చిక్కుడు పంటను ఉద్యాన శాఖ అధికారి శ్వేత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలో పేను బంక, తదితర చీడపీడలను నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు అగ్రికల్చర్ అసిస్టెంట్, స్థానిక రైతులు పాల్గొన్నారు.
జింబాబ్వేతో మ్యాచ్లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ ఈ మ్యాచ్లో నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం తనను తీవ్రంగా ఆశ్చర్యపరిచిందని తెలిపాడు. అభిషేక్ ఎంతటి విధ్వంసకర బ్యాటరో అందరికీ తెలిసిందేనని.. కానీ ఈ మ్యాచ్లో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఆడాడని పేర్కొన్నాడు. ఇకపై ఇదే శైలిలో ఆడాలని అతడికి సూచించాడు.
KMM: కేసీఆర్ పాలనలో రహదారులు అద్వానంగా ఉండేవని, కానీ ప్రజా ప్రభుత్వం రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతుందని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. శుక్రవారం ఏన్కూరు మండలం గార్ల ఒడ్డులో రూ. 10 కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు.
TPT: కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ అన్ని నియోజక వర్గాలు, జిల్లాకు సంబంధించిన ప్రాధాన్యత పనులపై సమీక్ష నిర్వించారు. ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డీఆర్వోలు, ఆర్టీవో, జిల్లా పంచాయతీ, మున్సిపల్ అధికారులు, టిడ్కో, సీపీవో, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
W.G: నర్సాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి రామరాజు ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, క్షేత్రస్థాయిలో వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
HYD: గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఆవరణలో అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 45-50 ఏళ్ల వ్యక్తిని చూసిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయించారు. అయితే ట్రీట్మెంట్ పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
SKLM: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 18వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ అన్నారు . శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నరసన్నపేటలో ఏప్రిల్ 4, 5 తేదీలలో జరిగే మహాసభలకు కార్మికులు, రైతులు తరలిరావాలని కోరారు. జిల్లాలో భూమి,నిర్వాసితుల సమస్యలు, ఉపాధి హామీ అమలు వంటి అంశాలపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు.