BPT: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పనులను గడువులోగా పూర్తి చేసి, వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన స్పష్టం చేశారు.
కృష్ణా: గ్రామీణ ప్రజలు ముందస్తు కాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని టిడిపి నేత వర్ల చైతన్య అన్నారు. బుధవారం పమిడిముక్కల మండలం హనుమంతపురం గ్రామ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పేర్కొన్నారు.
ATP: వజ్రకరూరు గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను జడ్పీ సీఈవో శివశంకర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, మండల సమస్యలపై ఎంపీడీవోతో చర్చించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని గ్రామ సర్పంచ్ మోనాలిసాకు సూచించారు.
నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ స్వామి అమ్మవార్ల దేవస్థానాన్ని మార్చి మూడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయునున్నారు. ఆరోజు ఉదయం ఆర్జిత సేవలు అనంతరం 10 గంటల తర్వాత ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. సంప్రోక్షణ అనంతరం నాలుగవ తేదీ యధావిధిగా దర్శనం కల్పిస్తామన్నారు.
నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్ పెద్ద బండలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ అందజేశారు. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను నిజం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. సీఎం రేవంత్, మంత్రి వెంకట్ రెడ్డి సహకారంతో డివిజన్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు.
టీమిండియాలోకి పునరాగమనం చేసిన తర్వాత ఇషాన్ కిషన్ దుమ్మురేపుతున్నాడు. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ఇషాన్ కిషన్ మూడో స్థానానికి దూసుకెళ్లాడు. మరోవైపు, వరుసగా విఫలమవుతున్నప్పటికీ అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. అయితే, పాక్ ప్లేయర్ ఫర్హాన్ నుంచి అభిషేక్ టాప్ ప్లేస్కు ముప్పు ఏర్పడింది. అతడు T20 WCలో తన ప్రదర్శనతో రెండో స్థానానికి దూసుకొచ్చాడు.
NGKL: బల్మూర్ మండలం మంగలికుంటపల్లి గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వెంకటయ్య యాదవ్ పనులు ప్రారంభించారు. పంచాయతీ భవనానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చిన వెంకటేశ్వరరావు, కృష్ణ రావులను ఈ సందర్భంగా నాయకులు అభినందించారు.
MDK: కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషం అని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండించింది. చేగుంటలో నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటని ఘటనకు పాల్పడ్డ వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని చేగుంట మండలం ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు మొహమ్మద్ రఫీ అన్నారు.
NLG: నార్కట్ పల్లి మండలం, గోపలాయపల్లి గుట్టపై శ్రీ వారిజాల వేణు గోపాలస్వామి ఆలయంలో బుధవారం సుదర్శన హోమాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల రోహిణి నక్షత్రం సందర్భంగా గుట్టపై హోమాన్ని నిర్వహిస్తారు. పలువురు దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి హోమంలో పాల్గొన్నారు. భక్తులు విచ్చేసి హోమాన్ని తిలకించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిపారు.
TG: రాజ్యసభ సీటు కోసం ఢిల్లీకి పోనని రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి అన్నారు. దక్షిణాదికి జాతీయ కిసాన్ అధ్యక్ష పదవి ఇవ్వాలని గతంలో AICCని అడిగానని తెలిపారు. అనుకోని కారణాల వల్ల తనకు ఆ పదవి రాలేదని చెప్పారు. రాజ్యసభ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కోరారు. రాజ్యసభ కావాలని CM, PCC చీఫ్ను అడుగుతానని వెల్లడించారు.
ATP: గుత్తి ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ స్వాతి బుధవారం తెలిపారు. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయని వివరించారు. ఎమ్మెస్సీ మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
బియ్యప్పిండి చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. తేమను పోనివ్వకుండానే మృతకణాలను, జిడ్డును తొలగిస్తుంది. స్పూన్ బియ్యప్పిండి, తేనె కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగితే మంచి స్క్రబ్లా పనిచేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు బియ్యంపిండికి తగినంత పెరుగుతో కలిపి వాడాలి. బియ్యప్పిండి, ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ప్యాక్లా వేస్తే జిడ్డు తగ్గుతుంది.
SDPT: అక్కన్నపేట మండలంలోని జనగామలో ఆర్థిక అక్షరాస్య త కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యత, సైబర్ నేరాల నివారణ, బ్యాంకింగ్ సేవలపై వివరించారు. KYC, e-KYC, CKYC, డిజిటల్ KYC ప్రక్రియలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ చందు లక్ష్మి, సెక్రటరీ మహేందర్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ సంజయ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.
ELR: నూజివీడు(మం) సుంకొల్లు, సిద్ధార్థనగర్లలో మామిడి తోటలను ఉద్యాన అధికారులు బుధవారం పరిశీలించారు. శాస్త్రవేత్త కే. రాధా రాణి మాట్లాడుతూ.. మామిడి పూత పిందె కట్టి నిలిచేందుకు 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి ఆర్. హేమ, రైతులు పాల్గొన్నారు.
టాలీవుడ్ నటి వైష్ణవి చైతన్య కోలీవుడ్లో హీరోయిన్గా అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా రాబోతున్న చిత్రంలో ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో అజిత్ కుమార్ ‘వలిమై’లో చిన్న పాత్ర పోషించిన వైష్ణవి.. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోయిన్గా తమిళ ప్రేక్షకులను అలరించనున్నట్లు టాక్.