BHNG: మేడారం తరహాలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని ఎంపీ చామల స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలపై ఇవాళ గాంధీభవన్ ప్రెస్ మీట్లో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూమిని, ప్రజావసరాల దృష్ట్యా తాగునీటి రిజర్వాయర్ కోసం వెనక్కి తీసుకుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని విమర్శించారు.
NRPT: మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలో నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రి పనులను శనివారం మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. నిర్మాణంలోని నాణ్యతను గమనించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు.
NDL: బనగానపల్లె పట్టణంలోని కొండపేట కాలనీలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. కొండపేట కాలనీలో చేస్తున్న పలు అభివృద్ధి పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి అన్నారు.
కర్నూలు: రాష్ట్ర డీజీపీ చేపట్టిన ఆపరేషన్ వజ్ర ప్రహర్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో కర్నూలు పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. శనివారం కర్నూలు, ఆదోని, పత్తికొండ,ఎమ్మిగనూరు సబ్ డివిజన్ల పరిధిలలోని ఆయా గ్రామాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు.
HNK: “ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” అనే మదర్ థెరిసా సూక్తిని ప్రస్తావిస్తూ, గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం బాలవికాస ప్రధాన లక్ష్యమని MLA నాగరాజు అన్నారు. HNKలో ఇవాళ నిర్వహించిన బాలవికాస తాగునీటి శుద్ధీకరణ పథక కమిటీల మహాసభలో పాల్గొన్న ఆయన, చెరువుల పూడికతీత, పర్యావరణ పరిరక్షణ వంటి సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.
NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాలలో శనివారం జరిగిన సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షలో జూనియర్ కళాశాలలో 285 విద్యార్థులకు గాను ముగ్గురు గైర్హాజరు, ఆదర్శ కళాశాలలో 145 విద్యార్థులకు గాను ముగ్గురు గైర్హాజరైనట్లు ఇరు కళాశాలల ప్రిన్సిపల్స్ శ్రీనాథ్, శ్రీనివాస్ తెలిపారు. మొత్తంమీద పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు వారు సూచించారు.
MNCL: మంచిర్యాలలో నిబంధనలకు విరుద్ధంగా ఒకే భవనంలో నిర్వహిస్తున్న సూర్యతేజ పారామెడికల్, లక్ష్మి నర్సింగ్ స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ విద్యా సంస్థల్లో చేరి విద్యార్థులు మోసపోయే ప్రమాదం ఉందన్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
SRD: ప్రతి ఒక్కరికి ఉద్యోగ విరమణ సహజమని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. ఉద్యోగ విరమణ చేస్తున్న ఎస్ఐ దశరథ్, ఏఎస్ఐ యాదగిరిలను ఎస్పీ కార్యాలయంలో శనివారం సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖలో అనేక సంవత్సరాలు పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఏవో కల్యాణి, ఏఆర్ డీఎస్పీ నరేందర్ పాల్గొన్నారు.
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం సమీపంలో భారీ పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అయితే, ప్రమాద సమయంలో 30 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. బాణాసంచా తయారీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం వల్ల చట్టుపక్కల ప్రాంతాల్లో మంటలు అంటుకుని ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.
WNP: గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతి యువకులకు స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేసే అరుదైన అవకాశాన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ తరగతులు ప్రారంభించారు. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని తెలిపారు.
HYD: సిటీలో లంచగొండి బాబుల ఆటలు ఇక సాగవు. 2025లో తెలంగాణ ACB ఏకంగా 199 కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 29.2% పెరుగుదల. ముఖ్యంగా GHMC పరిధిలో 2025 చివరి మూడు నెలల్లోనే గత 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 78 కేసులు నమోదయ్యాయి. మొత్తం 273 మందిని అరెస్ట్ చేయగా, అందులో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులే.
CTR: పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద అంతర్జాతీయ టైలర్స్ డే వేడుకల ఘనంగా నిర్వహించారు. బాణసంచా పేల్చి, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. టైలర్స్ సంఘం అధ్యక్షులు శివానంద మాట్లాడుతూ.. టైలర్ షాపులు నిర్వహించే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్స్ సంఘం సభ్యులు మధుమేగా సూరి, శీను పాల్గొన్నారు.
KNR: చొప్పదండి మండలం రుక్మాపూర్ గురుకుల సైనిక్ స్కూల్ విద్యార్థులు ఆర్.సామ్రాట్, బి.హేమచంద్ర రాష్ట్ర స్థాయి రోబోటిక్ ఎగ్జిబిషన్లో పాల్గొని ‘ఇన్నోవేషన్ ఛాంపియన్’ అవార్డు గెలుచుకున్నట్లు డైరెక్టర్ రాజా దత్త తెలిపారు. HYDలో జరిగిన ఎగ్జిబిషన్లో ‘విద్యావేత్తలలో రోబోటిక్స్ ఆవిష్కరణలలో సవాళ్ళు’ అనే అంశంలో 7 లెవెల్స్ విజయవంతంగా పూర్తి చేసి అవార్డు సాధించారు.
AKP: ఎటువంటి ఒత్తిడికి గురి కావద్దని పదవ తరగతి విద్యార్థులకు డీఈవో అప్పారావు నాయుడు సూచించారు. శనివారం పాయకరావుపేట మండలం మంగవరం జడ్పీ హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. ప్రశ్నా పత్రం చదివి తెలిసిన ప్రశ్నలకు ముందు సమాధానాలు రాయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక బాగా ఉపయోగపడుతుందన్నారు.
VKB: తాండూరులోని మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. ఒకే రోజు రూ. 2 కోట్ల విలువైన ఉత్పత్తుల విక్రయాలు జరిగాయి. శుక్రవారం ఈ-నామ్ పాత సాఫ్ట్వేర్ ద్వారానే పంటల కొనుగోలుకు వ్యాపారులకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో రెండు రోజులుగా పేరుకుపోయిన ఉత్పత్తులకు ఒకేరోజు విక్రయాలు చేపట్టారు.